Tragedy: దమ్ముంటే హైదరాబాద్కు రమ్మన్నాడు.. నిజంగానే వచ్చి చంపేశారు.. ఏం జరిగిందంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరంగల్లో ఇద్దరు యువతులను ప్రేమ పేరుతో వేధించాడు.. దీంతో యువతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు.. కానీ దమ్ముంటే హైదరాబాద్ రండి అంటూ సవాల్ విసిరి వచ్చాడు.. సీన్ కట్ చేస్తే.. యువతి కుటుంబ సభ్యులు.. హైదరాబాద్కు వచ్చి మరీ అతన్ని మర్డర్ చేసేశారు. అసలు ఈ కేసులో ఏం జరిగింది? ఆ యువకుడు ఎవరు? జరిగింది పరువు హత్యా? ప్రతీకారంలో భాగంగా చంపేశారా?
ఈ మర్డర్కు ప్రేమ పేరుతో వేధింపులేనని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. వరంగల్ నుంచి వచ్చిన భాస్కర్.. వచ్చే సమయంలో దమ్ముంటే హైదరాబాద్కు రండి అని సవాల్ విసిరాడని.. ఆ సవాల్లో భాగంగా వచ్చి చంపేశారని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ కేసులో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఐటీ హబ్ మాదాపూర్లో.. ప్రేమ వ్యవహారం.. వివాదాస్పదంగా మారి ఓ యువకుడి దారుణ హత్యకు దారితీసింది. రామేశ్వరం కేఫ్ ఎదుట జరిగిన ఈ ఘటన నగరంలో ఒక్కసారిగా కలకలం రేపింది.
Also Read
- Mobile SIM Card Rules 2026: మీకు తెలియకుండానే మీ పేరుపై సిమ్ ఉందా? ఇలా చెక్ చేయండి.. రిపోర్ట్ చేయండి..
- Ganesh Idol Collapse: గణేష్ ఆగమనం వేడుకలో ఘోర ప్రమాదం.. 22 అడుగుల విగ్రహం కూలి ఇద్దరు మృతి
- Shocking Incident: రూ. 60 లక్షల ప్యాకేజ్ అల్లుడు.. చిన్న గొడవకే చంపేసిన అత్తింటివారు..
- Meerpet Murder : గోనె సంచిలో ఆయా శవం.. మీర్పేట్లో దారుణ హత్య
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన సీనపల్లి భాస్కర్పై ఇద్దరు వ్యక్తులు కర్రలు, కత్తులతో విచక్షణారహితంగా దాడి చేయడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. హత్య అనంతరం నిందితులిద్దరూ నేరుగా మాదాపూర్ పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయారు. భాస్కర్.. మాదాపూర్లోని ఓ హోటల్లో కుక్గా పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నాడు. మంగళవారం అర్ధరాత్రి రామేశ్వరం కేఫ్ సమీపంలో అతడిని అడ్డగించిన తమ్మెడబోయిన రాజు, మారం కుమారస్వామి కత్తులు, కర్రలతో దాడి చేశారు. తలతో పాటు శరీరంలోని పలు భాగాల్లో తీవ్ర గాయాలు కావడంతో భాస్కర్ అక్కడికక్కడే మృతి చెందాడు.
హైదరాబాద్కు వచ్చి పథకం ప్రకారం దాడి..
భాస్కర్ ఇద్దరు యువతులను ప్రేమ పేరుతో వేధించాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై గతంలో వరంగల్ మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. ఐతే ఇరు వర్గాలకు కౌన్సెలింగ్ కూడా నిర్వహించారు పోలీసులు. అయినప్పటికీ వివాదం కొనసాగిందని పోలీసులు చెబుతున్నారు. అనంతరం భాస్కర్ “దమ్ముంటే హైదరాబాద్కు రండి” అంటూ సవాల్ విసిరినట్లు సమాచారం. దీంతో ఆగ్రహానికి గురైన యువతుల తండ్రి తన బంధువుతో కలిసి హైదరాబాద్కు వచ్చి పథకం ప్రకారం దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
అయితే ఈ కేసులో మరో కోణాన్ని మృతుడు భాస్కర్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. భాస్కర్, ఓ యువతి పరస్పర అంగీకారంతో ప్రేమించుకున్నారని.. ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారని వారు చెబుతున్నారు. యువతి కుటుంబ సభ్యులు కులాంతర వివాహానికి వ్యతిరేకించారని, గతంలోనే చంపేస్తామని బెదిరించారని ఆరోపిస్తున్నారు. వేధింపులు, వెంటపడడం వంటి ఆరోపణల్లో నిజం లేదని, ఈ హత్య పరువు, కుల వివక్ష కారణంగానే జరిగిందని భాస్కర్ కుటుంబ సభ్యులు అంటున్నారు. ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రేమ, వేధింపుల ఆరోపణలు, కుటుంబ సభ్యులు చేస్తున్న ప్రేమ, కుల వివాదం ఆరోపణలు సహా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కేసు దర్యాప్తు పూర్తయిన తర్వాతే హత్యకు దారితీసిన అసలు కారణాలు స్పష్టమయ్యే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!