India U-19 vs Sri Lanka U-19: చరిత్ర సృష్టించిన భారత యువ ఓపెనర్లు.. రికార్డుల మోత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India U-19 vs Sri Lanka U-19: శ్రీలంక అండర్-19 జట్టుతో జరుగుతున్న తొలి యూత్ టెస్టులో భారత అండర్-19 జట్టు ఓపెనర్లు లక్షయ్ రైచందానీ, సాగర్ విర్క్ అద్భుతమైన బ్యాటింగ్తో చరిత్ర సృష్టించారు. తొలి వికెట్కు 295 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి యూత్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో రెండో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. దీంతో 25 ఏళ్లుగా చెక్కుచెదరని గౌతమ్ గంభీర్, వినాయక్ మానే పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టే అవకాశాన్ని తృటిలో కోల్పోయారు.
మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక అండర్-19 జట్టు 9 వికెట్ల నష్టానికి 424 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. ఆ జట్టు తరఫున సేనుజ వెకునగోడ 233 పరుగులతో అద్భుతమైన డబుల్ సెంచరీ సాధించి భారత బౌలర్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు. భారీ లక్ష్యాన్ని ఎదుర్కొన్న భారత యువ జట్టు ఒత్తిడికి లొంగకుండా ఓపెనర్ల అద్భుత ప్రదర్శనతో బలమైన సమాధానం ఇచ్చింది.
Also Read
- Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
- India vs Sri Lanka 2nd Test: కొలంబో టెస్ట్కు వర్షం ముప్పు.. 5 రోజులూ వర్షం.. మ్యాచ్ ఫలితం ఏమవుతుంది..?
- BWF World Championships 2026: 15 ఏళ్ల నిరీక్షణకు తెర.. ప్రపంచ నంబర్-1తో పోరాడి కాంస్యం.. భారత బ్యాడ్మింటన్లో కొత్త చరిత్ర
- Steve Waugh Praises Vaibhav Sooryavanshi: బ్రాడ్మన్, గిల్క్రిస్ట్ తర్వాత వైభవ్..? బేబీ బాస్పై ఆస్ట్రేలియా దిగ్గజం సంచలన వ్యాఖ్యలు
లక్షయ్ రైచందానీ, సాగర్ విర్క్ తొలి నుంచే క్రమశిక్షణతో కూడిన బ్యాటింగ్ ప్రదర్శించారు. శ్రీలంక బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా 91.5 ఓవర్ల పాటు తొలి వికెట్కు 295 పరుగులు జోడించారు. ఈ అద్భుత భాగస్వామ్యానికి లతేంద్ర ఆకాష్ తెరదించాడు. సాగర్ విర్క్ 312 బంతుల్లో 134 పరుగులు చేసి అవుటయ్యాడు. అతని ఇన్నింగ్స్లో 15 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. మరోవైపు లక్షయ్ రైచందానీ అసాధారణ ఓపికతో బ్యాటింగ్ చేస్తూ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 198 పరుగులతో నాటౌట్గా నిలిచాడు.
ఈ భాగస్వామ్యం యూత్ టెస్ట్ చరిత్రలో రెండో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యంగా నమోదైంది. ఇప్పటి వరకు అత్యధిక భాగస్వామ్య రికార్డు భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్, వినాయక్ మానే పేరిటే ఉంది. 2001లో చెన్నైలో ఇంగ్లాండ్ అండర్-19 జట్టుతో జరిగిన మ్యాచ్లో ఈ జోడీ తొలి వికెట్కు 391 పరుగులు జోడించి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. తాజా మ్యాచ్లో లక్షయ్, సాగర్ ఆ రికార్డుకు కేవలం 96 పరుగుల దూరంలో నిలిచిపోయారు.
యూత్ టెస్ట్ చరిత్రలో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యాల జాబితాలో ఇప్పుడు గంభీర్–వినాయక్ మానే (391) తొలి స్థానంలో ఉండగా, లక్షయ్ రైచందానీ–సాగర్ విర్క్ (295) రెండో స్థానానికి చేరుకున్నారు. 1997లో జింబాబ్వేకు చెందిన డగ్లస్ మారిల్లియర్–మార్క్ వెర్ములెన్ నెలకొల్పిన 268 పరుగుల రికార్డును భారత జోడీ అధిగమించింది.
మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత అండర్-19 జట్టు మూడు వికెట్ల నష్టానికి 378 పరుగులు చేసింది. మ్యాచ్ ముగియడానికి ఒక రోజు మాత్రమే మిగిలి ఉండటంతో తొలి యూత్ టెస్ట్ డ్రా దిశగా సాగుతున్నట్లు కనిపిస్తోంది. టెస్ట్ సిరీస్కు ముందు జరిగిన మూడు మ్యాచ్ల యూత్ వన్డే సిరీస్ను శ్రీలంక 2-1 తేడాతో గెలుచుకున్న సంగతి తెలిసిందే. అయితే టెస్ట్ సిరీస్లో భారత యువ ఆటగాళ్లు బ్యాటింగ్లో తమ సత్తా చాటుతూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు.
తాజావార్తలు
-
Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
-
IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
-
Off The Record: జగన్కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా…!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!