India U-19 vs Sri Lanka U-19: చరిత్ర సృష్టించిన భారత యువ ఓపెనర్లు.. రికార్డుల మోత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India U-19 vs Sri Lanka U-19: శ్రీలంక అండర్-19 జట్టుతో జరుగుతున్న తొలి యూత్ టెస్టులో భారత అండర్-19 జట్టు ఓపెనర్లు లక్షయ్ రైచందానీ, సాగర్ విర్క్ అద్భుతమైన బ్యాటింగ్తో చరిత్ర సృష్టించారు. తొలి వికెట్కు 295 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి యూత్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో రెండో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. దీంతో 25 ఏళ్లుగా చెక్కుచెదరని గౌతమ్ గంభీర్, వినాయక్ మానే పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టే అవకాశాన్ని తృటిలో కోల్పోయారు.
మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక అండర్-19 జట్టు 9 వికెట్ల నష్టానికి 424 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. ఆ జట్టు తరఫున సేనుజ వెకునగోడ 233 పరుగులతో అద్భుతమైన డబుల్ సెంచరీ సాధించి భారత బౌలర్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు. భారీ లక్ష్యాన్ని ఎదుర్కొన్న భారత యువ జట్టు ఒత్తిడికి లొంగకుండా ఓపెనర్ల అద్భుత ప్రదర్శనతో బలమైన సమాధానం ఇచ్చింది.
Also Read
- Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
- Jasprit Bumrah: రీఎంట్రీ మ్యాచ్లో రికార్డుల వర్షం.. చరిత్ర సృష్టించిన బుమ్రా..
- IND vs ENG 1st ODI: సీనియర్ల రీఎంట్రీతో ఆసక్తికర పోరు.. భారత తుది జట్టు ఇదే..
- Suryakumar Yadav: టీ20 జట్టులోకి మళ్లీ సూర్యకుమార్ యాదవ్..? బీసీసీఐ కీలక సంకేతాలు
లక్షయ్ రైచందానీ, సాగర్ విర్క్ తొలి నుంచే క్రమశిక్షణతో కూడిన బ్యాటింగ్ ప్రదర్శించారు. శ్రీలంక బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా 91.5 ఓవర్ల పాటు తొలి వికెట్కు 295 పరుగులు జోడించారు. ఈ అద్భుత భాగస్వామ్యానికి లతేంద్ర ఆకాష్ తెరదించాడు. సాగర్ విర్క్ 312 బంతుల్లో 134 పరుగులు చేసి అవుటయ్యాడు. అతని ఇన్నింగ్స్లో 15 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. మరోవైపు లక్షయ్ రైచందానీ అసాధారణ ఓపికతో బ్యాటింగ్ చేస్తూ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 198 పరుగులతో నాటౌట్గా నిలిచాడు.
ఈ భాగస్వామ్యం యూత్ టెస్ట్ చరిత్రలో రెండో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యంగా నమోదైంది. ఇప్పటి వరకు అత్యధిక భాగస్వామ్య రికార్డు భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్, వినాయక్ మానే పేరిటే ఉంది. 2001లో చెన్నైలో ఇంగ్లాండ్ అండర్-19 జట్టుతో జరిగిన మ్యాచ్లో ఈ జోడీ తొలి వికెట్కు 391 పరుగులు జోడించి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. తాజా మ్యాచ్లో లక్షయ్, సాగర్ ఆ రికార్డుకు కేవలం 96 పరుగుల దూరంలో నిలిచిపోయారు.
యూత్ టెస్ట్ చరిత్రలో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యాల జాబితాలో ఇప్పుడు గంభీర్–వినాయక్ మానే (391) తొలి స్థానంలో ఉండగా, లక్షయ్ రైచందానీ–సాగర్ విర్క్ (295) రెండో స్థానానికి చేరుకున్నారు. 1997లో జింబాబ్వేకు చెందిన డగ్లస్ మారిల్లియర్–మార్క్ వెర్ములెన్ నెలకొల్పిన 268 పరుగుల రికార్డును భారత జోడీ అధిగమించింది.
మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత అండర్-19 జట్టు మూడు వికెట్ల నష్టానికి 378 పరుగులు చేసింది. మ్యాచ్ ముగియడానికి ఒక రోజు మాత్రమే మిగిలి ఉండటంతో తొలి యూత్ టెస్ట్ డ్రా దిశగా సాగుతున్నట్లు కనిపిస్తోంది. టెస్ట్ సిరీస్కు ముందు జరిగిన మూడు మ్యాచ్ల యూత్ వన్డే సిరీస్ను శ్రీలంక 2-1 తేడాతో గెలుచుకున్న సంగతి తెలిసిందే. అయితే టెస్ట్ సిరీస్లో భారత యువ ఆటగాళ్లు బ్యాటింగ్లో తమ సత్తా చాటుతూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు.
తాజావార్తలు
-
India U-19 vs Sri Lanka U-19: చరిత్ర సృష్టించిన భారత యువ ఓపెనర్లు.. రికార్డుల మోత
-
Tragedy: దమ్ముంటే హైదరాబాద్కు రమ్మన్నాడు.. నిజంగానే వచ్చి చంపేశారు.. ఏం జరిగిందంటే..
-
Iran: ఇరాన్ నెక్ట్స్ టార్గెట్ ఇదేనా? మరో సంక్షోభం రానుందా?
-
Used Smartphone Buying Guide: సెకండ్ హ్యాండ్ స్మార్ట్ఫోన్ కొంటున్నారా? ఇవి తప్పనిసరిగా చెక్ చేయండి.. లేదంటే అంతే..!
-
New Smartphones: స్మూత్ డిస్ప్లే.. 8000mAh బ్యాటరీ.. రేపు లాంచ్ కాబోతున్న ఫోన్లు ఇవే..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!