Ramya Ragupathi: కృష్ణ గారిని నేను లాగలేదు.. నరేష్ ఆయనను బురదలోకి లాగాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramya Ragupathi:సీనియర్ నటుడు నరేష్- పవిత్ర లోకేష్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన విషయం తెల్సిందే. ఇక వీరి పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తాను అని నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి శపథం చేసిన విషయం కూడా విదితమే. ఇప్పటివరకు మౌనంగా ఉన్న ఆమె ఇప్పుడు తన బంధాన్ని కాపాడుకోవడానికి మీడియా ముందుకు వచ్చింది. నరేష్ బండారాన్ని బయటపెట్టింది. గత కొన్నిరోజులుగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ నరేష్ బాగోతాన్ని బయటపెట్టింది. ఇక తాజాగా ఆమె ఎన్టీవీకి ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో ఆమె తన మనోగతాన్ని చెప్పుకొచ్చింది. నరేష్ తన మీద వేసిన ఆరోపణల దగ్గరనుంచి పవిత్ర- నరేష్ ల పరిచయం, ప్రేమ, పెళ్లి వరకు అసలు మధ్యలో ఏం జరిగిందో మొత్తం పూసా గుచ్చినట్లు చెప్పుకొచ్చింది.
నరేష్ తనను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని, రెండేళ్లు పెళ్లి చేసుకోమని తన వెంట పడినట్లు ఆమె తెలిపింది. తనపై ప్రేమతోనా, రాజకీయ పరంగా ఏమైనా ఎజెండా ఉందా అని అప్పుడే అడిగితే నువ్వే నా దేవత, భాగ్యలక్ష్మి అని కబుర్లు చెప్పి పెళ్లి చేసుకున్నట్లు చెప్పింది. ఇక ఇన్ని చేసినా తన కొడుకు కోసం తాను అతనికోసం పోరాడుతున్నట్లు చెప్పిన రమ్య తన కొడుకు, నరేష్ వలన ఎంత ఇబ్బంది పడ్డాడో చెప్పుకొచ్చింది. తన కొడుకు స్నేహితులు, స్కూల్ లో వారు అతనికి కాల్ చేసి మీ నాన్న పెళ్లి అంటగా, మీ అమ్మ దొంగ అంటగా అంటూ చెప్తుంటే ఆ పిల్లాడి మనస్తత్వం ఎలా ఉంటుందో మీరే ఊహించండి అని చెప్పిన ఆమె తన కొడుకుకు తండ్రి కావాలని అందుకే ఈ పోరాటం చేస్తున్నట్లు తెలిపింది.
Also Read
- Peddi : ముంబైలో ట్రైలర్ లాంచ్, భోపాల్లో రెహమాన్ లైవ్ కాన్సర్ట్!
- CM Vijay: IMDb లిస్ట్ను షేక్ చేసిన తమిళనాడు సీఎం.. వారంలోనే టాప్-2లోకి 'దళపతి'! అసలేం జరిగిందంటే..
- Tollywood: ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కలకలం..జాయింట్ సెక్రటరీ పదవికి నట్టి కుమార్ రాజీనామా!
- iBomma : ఐబొమ్మ మళ్లీ యాక్టివ్.. కొత్త సినిమాలతో సడెన్ ఎంట్రీ!
ఇక నరేష్- పవిత్ర లిప్ లాక్ వీడియో గురించి ఆమె మాట్లాడుతూ.. “ఆ వీడియో చూసి నేనేమి షాక్ అవ్వలేదు.. ఇలాంటి కిస్సింగ్ సీన్స్ నేను చాలా చూసేశాను. కాకపోతే అమ్మాయిలే మారుతూ ఉంటారు” అని చెప్పుకొచ్చింది. ఇక కృష్ణగారిని తానూ ఈ విషయంలోకి లాగలేదని, ఆయన ఈ బురదలో కాలు పెట్టాలని అనుకోలేదని తెలిపింది. నరేష్ కావాలనే ఇదంతా చేసినట్లు చెప్పిన రమ్య.. కృష్ణ గారికి అన్ని తెలిసి కూడా మౌనంగా ఉన్నారని చెప్పుకొచ్చింది. కృష్ణ గారి సంతకాన్ని ఫోర్జరీ చేసి పిటిషన్ వేశాడని, ఈ విషయం కృష్ణగారికి కూడా తెలియలేదని చెప్పింది. ఇక ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తుందని, నరేష్ తో తనకు విడాకులు వద్దని, తన కొడుకుకు తండ్రి మాత్రమే కావాలని చెప్పుకొచ్చింది. పవిత్ర- నరేష్ పెళ్లి ఎలా చేసుకుంటారో తానూ చూస్తానని రమ్య తెలిపింది.
తాజావార్తలు
-
Supreme Court: భార్య తన కెరీర్ కొనసాగించడం ‘‘భర్తను విడిచిపెట్టినట్లు కాదు’’
-
Peddi : ముంబైలో ట్రైలర్ లాంచ్, భోపాల్లో రెహమాన్ లైవ్ కాన్సర్ట్!
-
Nirmala Sitharaman: నిర్మలా సీతారామన్ రష్యా టూర్ రద్దు.. కారణమిదేనా!
-
CSK Vs SRH: సీఎస్కే జట్టులోకి మరో విధ్వంసకర బ్యాట్స్మెన్.. SRH ప్లే ఆఫ్ ఆశలు గల్లంతేనా..?
-
Anand Mahindra: మనుషులకు ప్రకృతి నేర్పే ‘డెడ్లీ’ లెసన్.. బిలియనీర్ చెప్పిన పవర్ఫుల్ మెసేజ్!
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!