బాలీవుడ్ ని ఒక ఊపు ఊపేసిన ఫోర్నోగ్రఫీ కేసులో రోజుకో ట్విస్ట్ బయటపడుతోంది. నెల రోజుల తర్వాత నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపార వేత్త రాజ్ కుంద్రా బెయిల్ ద్వారా బయటికొచ్చాడు. ఇక కుంద్రా దంపతులపై నటి షెర్లిన్ చోప్రా తీవ్ర ఆరోపణలు చేసిన విషయం విదితమే.. శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా తనను లైంగికంగా వేధించారని, వారి గ్యాంగ్ స్టార్లతో తనను చంపడానికి ప్రయత్నించారని ఘాటు ఆరోపణలు చేసింది. అయితే.. అవేమి నిజం కాదని, తమ పరువు తీయడానికి, ఫ్రీ పబ్లిసిటీ కోసం షెర్లిన్ ఈ ఆరోపణలు చేసిందని తెలుపుతూ శిల్పాశెట్టి దంపతులు షెర్లిన్ పై రూ. 50 కోట్లు పరువు నష్టం దావా వేశారు.
ఇక తాజాగా ఈ విషయమై షెర్లిన్ స్పందిస్తూ.. రాజ్ కుంద్రా బెదిరింపులకు తాను భయపడేది లేదని తెగేసి చెప్పింది. అంతేకాకుండా తనను మానసికంగా వేధించినందుకు పరిహారంగా రూ. 75 కోట్లు పరువు నష్టంగా తిరిగి వారిపై కేసు వేసి, నోటీసులు ఇంటికి పంపినట్లు తెలిపింది. మరి షెర్లిన్ వ్యాఖ్యలపై శిల్పాశెట్టి దంపతులు ఎలా స్పందిస్తారో చూడాలి.