Covid-19: కరోనా సోకినా కొందరు ఎందుకు సేఫ్గా ఉంటున్నారు..? కారణం తెలిసింది..
- కరోనా సోకినా కొందరు ఎందుకు సేఫ్..?
- కొందరిలో ప్రత్యేకమైన ఇమ్యూన్ రెస్పాన్స్..
- శరీరంలో పూర్తిగా చేరకముందే వైరస్పై పోరు..
- తాాజా పరిశోధనలో వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Covid-19: 2019లో ప్రారంభమైన కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికించింది. చైనా, భారత్, ఇటలీ, అమెరికా ఇలా అన్ని దేశాలను అతలాకుతలం చేసింది. తన రూపాన్ని మార్చుకుంటూ కోవిడ్-19 ప్రజలపై దాడి చేస్తూనే ఉంది. మహమ్మారి వల్ల ప్రపంచంలో లక్షల చావులు నమోదయ్యాయి. ప్రపంచం ఎప్పుడూ చూడని విధంగా లాక్డౌన్లోకి వెళ్లింది. ప్రస్తుతం వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో ప్రస్తుతం కరోనాను అడ్డుకోగలిగాం.
ఇదిలా ఉంటే కొంతమందికి కరోనా వైరస్ సోకినప్పటికీ, వారు విజయవంతంగా దాన్ని ఎదుర్కొన్నారు. ఎలాంటి అనారోగ్యానికి గురికాలేదు. ఇలా ఎందుకు జరుగుతోందనే దానిపై పరిశోధకులు అధ్యయనం చేశారు. సైన్స్ జర్నల్ నేచర్లో ప్రచురించబడిన ఒక కొత్త అధ్యయనం, కరోనా వైరస్ ఎటాక్ చేసిన తర్వాత కూడా కొంతమందికి COVID-19 ఎందుకు రాదననే విషయాన్ని వెల్లడించింది. పరిశోధకులు మొదటిసారిగా ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. SARS-CoV-2 యొక్క ప్రీ-ఆల్ఫా స్ట్రెయిన్ని ఆరోగ్యవంతులైన వాలంటీర్లకు సోకేలా చేసి పరిశోధన నిర్వహించారు.
Also Read
- Dr. Himabindu Annamaraju : లక్షల్లో ఒక్కరికి వచ్చే రుగ్మత.. తల్లీబిడ్డకు సేఫ్ డెలివరీ..!
- Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
- Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
- Jowar Roti: 'జొన్న రొట్టె' విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
Read Also: Viral Video: సబ్బు పై కాలేయడంతో మూడో అంతస్థు మీదనుండి జారిపడ్డ మహిళ.. చివరకు..?
వ్యాధి సోకిన వారితో పోలిస్తే, ఇన్ఫెక్షన్ని నిరోధించే వ్యక్తుల్లో ముక్కులోని కణజాలం వేగంగా రోగనిరోధక ప్రతిస్పందన కలిగి ఉంటున్నారని తేలింది. వైరస్ని గుర్తించిన వెంటనే అది తీవ్రంగా మారేలోపే ముక్కులోని శ్లేష్మ-సంబంధిత T (MAIT) కణాల క్రియాశీలత పెరగడం, ఇన్ఫ్లమేటరీ తెల్ల రక్త కణాల తగ్గుదల నమోదై, ఇది వైరస్ని నాశనం చేస్తున్నట్లు తేలింది. ఇన్ఫెక్షన్ను నిరోధించే వ్యక్తులు నాసికా కణాలలో HLA-DQA2 అనే జన్యువు యొక్క అధిక పనితీరు కలిగి ఉంటారని అధ్యయనం కనుగొంది.
ఇంపీరియల్ కాలేజ్ లండన్లోని ఇన్ఫెక్షియస్ డిసీజ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ క్రిస్టోఫర్ చియు ఈ అధ్యయనానికి నాయకత్వం వహించారు. ఈ పరిశోధనతో మన రోగనిరోధక వ్యవస్థ కొందరిలో ఎలా వైరస్ని ఎదుర్కొంటుందనే దానిని తెలియజేసిందని చెప్పారు. ఈ సహజ రక్షణను అనుసరించి కొత్త చికిత్సలు, వాక్సిన్లను అభివృద్ధి చేయడానికి ఈ పరిశోధన ఒక ఆధారాన్ని అందిస్తుందని చెప్పారు.
తాజావార్తలు
-
Bhadradri Kothagudem: తీవ్ర విషాదం.. వేటగాళ్ల విద్యుత్ ఉచ్చుకు ఫారెస్ట్ ఆఫీసర్ బలి!
-
Mecca Pact Explained: పాకిస్థాన్ పాచికలు చెల్లవు.. మక్కా ఒప్పందం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
-
Explainer: టాటా నానో రీఎంట్రీ..!? ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మరో అద్భుతం!
-
Tabu AI Deepfake Case: ఏఐ వీడియోలపై కోర్టుకెక్కిన టబు.. 150 లింకులపై కీలక ఆదేశాలు!
-
Explainer: రెస్టారెంట్ కిచెన్లో బొద్దింకల కాపురం..ఈగల సంసారం.. మీరు తింటున్నది ఇదే!
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!