Winter Foods to Eat: చల్లగా ఉందని వేడి వేడిగా బజ్జీలు, పకోడీలు చిరుతిళ్లు లాగిస్తున్నారా?
- తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా తగ్గుతున్న ఉష్ణోగ్రతలు
- చలితో వణికి పోతున్న జనాలు
- ఈ సమయంలోనే వేడి వేడి బజ్జీలు, పకోడీలు, చిరుతిళ్లు తినాలని కోరిక
- వీటి వల్ల శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల వంటివి వచ్చే ప్రమాదం
- చలికాలంలో తినాల్సిన ఫుడ్స్ గురించి తెలుసుకుందా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి.. చలితో ప్రజలు వణికిపోతున్నారు.. ఇక, అల్లూరి జిల్లా ఏజెన్సీలో చలి వణుకు పుట్టిస్తుంది. రాత్రి ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కి పడిపోయాయి. ఏజెన్సీ వ్యాప్తంగా దట్టమైన పొగమంచు కురుస్తుంది. మినుములూరులో 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవగా.. పాడేరులో 11 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దట్టమైన పొగమంచు, శీతల గాలులతో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. ఈ సమయంలోనే వేడి వేడి బజ్జీలు, పకోడీలు, చిరుతిళ్లు తినుకుంటారు. కానీ ఇలాంటివి తినడం వల్ల చలికాలం శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల వంటి ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, చిన్న చిన్న జాగ్రత్తలతో వీటిని చాలా వరకూ అదుపులో ఉంచుకోవచ్చని చెబుతున్నారు. ఆహారం మీద శ్రద్ధ పెడితే నిరోధకశక్తినీ పెంచుకోవచ్చని అంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
READ MORE: CM Chandrababu: మహిళలపై అఘాయిత్యాలు.. సీఎం సీరియస్ వార్నింగ్
Also Read
- Soya Manchurian: పిల్లలు లొట్టలేసుకుంటూ తినే 'మిల్ మేకర్ మంచూరియా'.. టేస్టీగా, హెల్తీగా ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి!
- Sleep Disorder : రాత్రి 8 గంటలు నిద్రపోయినా అలసట ఎందుకు పోదు? చాలా మంది తెలుసుకోవాల్సిన నిజాలు!
- Kerala Parotta : కేరళ స్టైల్ పరోటా ఇష్టమా.? తినే ముందు ఇవి తెలుసుకోండి..!
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
చలిని ఎదుర్కోవటానికి శరీరానికి అధిక శక్తి అవసరం. శక్తిని అందించడంలో ఆహారం పాత్ర కీలకం. కాబట్టి చలికాలంలో కాస్త ఎక్కువగా తినాల్సి ఉంటుంది. మిర్చీబజ్జీల వంటి చిరుతిళ్ల వైపు మళ్లుతుంటుంది. అయితే జంక్ఫుడ్తో బరువు పెరిగే ప్రమాదం పెరుగుతుంది. దీంతో పాటు చాలా రోగాలు సైతం వస్తాయి. కాబట్టి చలికాలంలో ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రొటీన్లు, పిండి పదార్థాలు, కొవ్వులు శరీరానికి శక్తిని అందిస్తాయి. అయితే.. జీవక్రియల కోసం విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ ఎ, విటమిన్ డి బాగా తోడ్పడతాయి. కాలుష్య కారకాలు హాని చేయకుండా నిలువరిస్తాయి. కాబట్టి నిమ్మకాయ, బత్తాయి, నారింజ, జామ పండ్ల వంటివి ఎక్కువగా తీసుకోవాలి. బత్తాయి తింటే, నిమ్మరసం తాగితే జలుబు చేస్తుందనే అపోహలు వీడాలని వైద్యులు చెబుతున్నారు. అలాగే ఎరుపు క్యాప్సికం, పసుపు క్యాప్సికం, కీరా, క్యాబేజీలోనూ విటమిన్ సి ఉంటుంది. ఈ సీజన్ లో లభించే ఉసిరిలో కూడా విటమిన్ సి మోతాదు ఎక్కువే ఉంటుంది. ఇంకా ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి జింక్ కూడా అవసరం. ఇది చిక్కుళ్లు, గుమ్మడి విత్తనాలు, మాంస పదార్థాల్లో ఉంటుంది. ఇప్పుడు జింక్ కలిపిన పదార్థాల ఉత్పత్తులూ మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. గుడ్డు పచ్చసొన, బొప్పాయి, క్యారెట్, గుమ్మడికాయ, చిలగడ దుంప, ఆకుకూరలతో విటమిన్ ఎ లభిస్తుంది.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!