CM Chandrababu: మహిళలపై అఘాయిత్యాలు.. సీఎం సీరియస్ వార్నింగ్
- మహిళలపై అత్యాచార ఘటనలపై సీఎం సీరియస్..
- మహిళలపై అత్యాచార ఘటనలపై సహించేది లేదని వార్నింగ్..
- పిల్లలను మనమే మానసికంగా సరిదిద్దాలని సూచన..
- నేరస్తులు ఉంటే వాళ్ల తాటతీస్తామని హెచ్చరిక..
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్లో చిన్నారులు, బాలికలు, యువతులు, మహిళలు.. ఇలా తేడా లేకుండా వరుసగా అఘాయిత్యాలు వెలుగు చూశాయి.. అయితే, మహిళలపై అత్యాచార ఘటనలపై సీరియస్గా స్పందించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. మహిళలపై అత్యాచార ఘటనలపై సహించేది లేదని హెచ్చరించారు.. పిల్లల తప్పు కూడా ఉండదు… మనమే మానసికంగా సరిదిద్దాలని సూచించారు.. అయితే, ఎవరైనా కరుడుగట్టిన నేరస్తులు ఉంటే చర్యలుంటాయి.. కరుడుగట్టిన నేరస్తులు ఉంటే వాళ్ల తాటతీస్తామని వార్నింగ్ ఇచ్చారు.. ఇక, అరవై శాతం భూ ఆక్రమణల పైనే తమకు ఫిర్యాదు వచ్చాయన్నారు సీఎం.. గ్రామాలలో రెవెన్యూ ఇబ్బందులపై ప్రత్యేక పరిష్కార మార్గాలు చూస్తాం అన్నారు.. విదేశీ మద్యం, స్టాండర్డ్ బ్రాండ్లు తీసుకొచ్చాం.. షాపు లైసెన్సులు రద్దు చేయడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు.
Read Also: P. Chidambaram: ఢిల్లీ హైకోర్టులో కేంద్ర మాజీమంత్రి చిదంబరానికి బిగ్ రిలీఫ్
Also Read
- AP Liquor Scam Case: లిక్కర్ స్కామ్లో కీలక మలుపు.. రంగంలోకి దిగిన ఐటీ అధికారులు
- Minister Gottipati Ravikumar: విద్యుత్ కోతలకు నో.. నిరంతర సరఫరా ఉండాల్సిందే.. మంత్రి గొట్టిపాటి ఆదేశాలు
- School Holidays: 2026-27 విద్యాసంవత్సరానికి అకడమిక్ క్యాలెండర్ విడుదల.. స్కూళ్లకు 87 సెలవులు
- AP WhatsApp Services: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. వాట్సాప్లోనే మెడికల్ కౌన్సిల్ సేవలు
ఇక, ఎమ్మెల్యేలు కూడా తన మన లేకుండా తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు చంద్రబాబు.. 25 ఏళ్ల తాకట్టు పెట్టి మద్యం పైన అప్పులు తెచ్చారు.. ఇసుక రవాణా విషయంలో ఎవరైనా అడ్డు పడితే పిడి యాక్టు పెడతాం అని హెచ్చరించారు.. ఉచిత ఇసుక అమలు సరిగా జరగడానికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.. దీపం – 2 పధకం అమలు పూర్తిస్ధాయిలో జరుగుతుంది. అమరావతి నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.. ఉద్యోగాల కల్పన ప్రధాన ఉద్దేశంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోంది.. 3,73,539 మందికి ఉద్యోగకల్పన ధ్యేయంగా పని చేస్తున్నాం.. ఉద్యోగాలు ఎక్కువ ఇచ్చే కంపెనీలకు ఇన్సెంటివ్ ఎక్కువ ఇస్తాం అని ప్రకటించారు. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పైన మా ఆలోచన.. ఓర్వకల్లును డ్రోన్ సిటీగా తయారు చేస్తాం.. లా అండ్ ఆర్డర్, ప్రజలకు అవసరమైన సేవలు, టెక్నాలజీ అనుసంధానంతో చేస్తాం.. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 ను తీసుకొస్తున్నాం.. సోలార్ పేనెల్స్ పెడతాం.. కరంటు ఉచితంగా ఇచ్చేలా చేస్తాం అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఇంకా ఆయన ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్ చేయండి..
తాజావార్తలు
-
Santosh Goyal Story: విధి వంచించిన మేధావి.. ఈ పీహెచ్డీ స్కాలర్ పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు..
-
AP Liquor Scam Case: లిక్కర్ స్కామ్లో కీలక మలుపు.. రంగంలోకి దిగిన ఐటీ అధికారులు
-
iQOO Z11 & Z11x: ఐకూ Z11 సిరీస్ గ్లోబల్ లాంచ్ కన్ఫర్మ్.. ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ వివరాలు
-
Vijay: ఆలయాల బాట పట్టిన విజయ్.. టీవీకే శ్రేణుల్లో నూతనోత్సాహం
-
Minister Gottipati Ravikumar: విద్యుత్ కోతలకు నో.. నిరంతర సరఫరా ఉండాల్సిందే.. మంత్రి గొట్టిపాటి ఆదేశాలు
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!