Cancer: 40 ఏళ్లలోపు భారతీయుల్లో క్యాన్సర్ ముప్పు.. ఫుడ్, లైఫ్ స్టైల్లే కారణం..
- 40 ఏళ్లలోపు యువతలో పెరుగుతున్న క్యాన్సర్ రిస్క్..
- ఆహారం
- లైఫ్ స్టైల్ ప్రధాన కారణాలు..
- వాతావరణ కాలుష్యం కూడా సమస్యే..
- ఆరోగ్యకరమైన అలవాట్లు పెంచుకోవాలంటున్న వైద్యులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cancer: ఒక్కప్పుడు క్యాన్సర్ అనే వ్యాధిని చాలా అరుదుగా చూసేవారం. కానీ ఇప్పుడు మాత్రం పలు రకాల క్యాన్సర్లు ప్రజల్ని పట్టిపీడిస్తున్నాయి. ముఖ్యం యువత క్యాన్సర్ల బారిన పడటం ఆందోళనల్ని పెంచుతోంది. భారతదేశంలో 40 ఏళ్ల లోపు వారిలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని వైద్యులు ఆదివారం తెలిపారు. దీనికి మన ఆహార అలవాట్లు, జీవనశైలి కారణాలుగా చెబుతున్నారు.
ప్రాసెస్ చేసిన ఫుడ్, పొగాకు, ఆల్కాహాల్ అధిక వినియోగం, ఊబకాయం, ఒత్తిడి క్యాన్సర్లకు ప్రధాన కారణాల్లో ఒకటి. దీనికి తోడు పర్యావరణ కాలుష్యం కూడా మరో అంశం. భారతదేశంలోని వివిధ నగరాల్లో అధిక స్థాయి కాలుష్యం వివధ రకాల క్యాన్సర్లతో ముడిపడి ఉంది. గాలి, నీటి కాలుష్యం క్యాన్సర్ కారకాలుగా ఉన్నాయి. ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం, శ్రమ లేని జీవనశైలి భారతీయ యువతతో క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతోంది.
Also Read
- Jowar Roti: 'జొన్న రొట్టె' విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
- Bhindi Red Chilli Pachadi: వేడి వేడి అన్నంలో 'బెండకాయ పచ్చడి' వేసుకొని తింటే.. అబ్బో రుచి అదుర్స్ అంతే.!
- Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
- Chandipura virus: 22 మంది చిన్నారులు మృతి.. ఏమిటి చండీపుర వైరస్.? మెదడుపై ఎలా దాడి చేస్తుంది.?
Read Also: Removing Lice: తలలో పేనులు పోవాలంటే ఈ చిట్కాలు పాటించండి..!
అనారోగ్యకరమైన ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్య సంక్షోభాన్ని సృష్టిస్తోదని అని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లోని హెమటాలజీ మరియు BMT విభాగం డైరెక్టర్ మరియు హెడ్ డాక్టర్ రాహుల్ భార్గవ చెప్పారు. ఈ ధోరణి నుంచి బయటపడాలంటే ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు, చురుకైన జీవనశైలి చాలా అవసరమని అన్నారు. ఢిల్లీకి చెందిన క్యాన్సర్ ముక్త్ భారత్ ఫౌండేషన్ ఇటీవల అధ్యయనం ప్రకారం.. భారతదేశంలో 20 శాతం క్యాన్సర్ కేసులు ఇప్పుడు 40 ఏళ్ల లోపువారిలో నిర్ధారణ అవుతున్నాయని తేలింది. ఇందులో పురుషులు 60 శాతం ఉండగా, మహిళలు 40 శాతం ఉన్నట్లు తెలిపింది.
పొగాకు వినియోగంతో పాటు ఉద్యోగరీత్యా బయటి వాతావరణాకి ఎక్కువగా గురికవాడం, జీవనశైలి వంటి కారణాలు బాధితుల్లో పురుషులు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. స్వచ్ఛమైన గాలి మరియు నీరు, సాధారణ శారీరక శ్రమ మరియు పౌష్టికాహారానికి ప్రాప్యతను ప్రోత్సహించే విధానాలకు తప్పనిసరిగా ప్రాధాన్యత ఇవ్వాలని వైద్యులు కోరుతున్నారు.
తాజావార్తలు
-
Alluri District Tribal Bandh: అల్లూరి జిల్లాలో ఆదివాసీల బంద్.. స్వల్ప ఉద్రిక్తత.!
-
Hyderabad: స్టేడియం వద్ద కిక్కిరిసిన నిరుద్యోగులు.. హైడ్రా ఉద్యోగాల కోసం క్యూ కట్టిన వేలాది మంది!
-
Box Office Numbers: బాక్సాఫీస్ పోస్టర్లపై నాగవంశీ కామెంట్స్ వైరల్.. ‘ఇప్పటికీ నంబర్లు ఇన్ఫ్లేట్ అవుతున్నాయి’!
-
Best AI Laptops 2026: AI ల్యాప్టాప్ కొనాలనుకుంటున్నారా?.. ఈ 5 పవర్ఫుల్ ల్యాప్టాప్లు బెస్ట్ ఆప్షన్స్!
-
Vaibhav Sooryavanshi: “ఫుడ్ విషయంలో తగ్గేదేలే”.. వైభవ్ సూర్యవంశీ డైట్ సీక్రెట్ ఇదేనట..
ట్రెండింగ్
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!