Multivitamins: రోజూ మల్టీవిటమిన్లు తీసుకున్నంత మాత్రాన ఎక్కువ కాలం జీవించరు..
- మల్టీవిటమిన్లు తీసుకోవడం వల్ల ఎక్కువ కాలం బతకరు..
- వీటికి బదులుగా ఆరోగ్యకరమైన ఆహారం మేలు..
- మల్టీవిటమిన్లు వాడే వారిలోనే మరణాల రిస్క్..
- తాజా అధ్యయనంలో సంచలన విషయాలు..
Multivitamins: కొంతమంది రోజూవారీగా మల్టీవిటమన్లను తీసుకుంటారు. దీని వల్ల అనారోగ్య సమస్యలు తగ్గుతాయని, వ్యాధుల బారిన పడమని అనుకుంటారు. అయితే ఇలా రోజు మల్టీవిటమిన్లు తీసుకోవడం వల్ల ప్రజలు ఎక్కువ కాలం జీవించడంతో సాయం చేయడని, వాస్తవానికి ముందస్తు మరణాన్ని పెంచే అవకాశం ఉందని ఒక అధ్యయనం కనుగొంది. జేఏఎంఏ నెట్వర్క్ ఓపెన్లో ప్రచురించబడిన ఈ అధ్యయనం, దాదాపుగా 4 లక్షల మంది ఆరోగ్యవంతులైన పెద్దలపై 20 ఏళ్లకు పైగా పరిశీలన జరిపి ఈ విషయాన్ని వెల్లడించింది.
దీర్ఘాయువును మెరుగుపరచడానికి మల్టీవిటమిన్లు సహాయం ఉండదని కనుగొన్నారు. ఆశ్చర్యకరంగా ఎక్కువగా జీవించే బదులు, మల్టీవిటమిన్లు తీసుకున్న వారి కన్నా తీసుకోని వారి కన్నా ముందే చనిపోయే అవకాశం 4 శాతం ఎక్కువగా ఉందని పరిశోధకులు తెలిపారు. డాక్టర్ ఎరిక్కా లాఫ్ట్ఫీల్డ్ మరియు మేరీల్యాండ్లోని నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లోని ఇతర అసోసియేట్స్ అమెరికా ఆరోగ్య అధ్యయనాల నుంచి డేటా విశ్లేషించారు. 1990 నుంచి మల్టీవిటమిన్లు తీసుకునే వారి వివరాలను సేకరించారు. 20 ఏళ్లకు పైగా దాదాపుగా 4 లక్షల మంది వివరాలను తీసుకున్నారు.
Also Read
- Food poisoning: బిర్యానీ, వాటర్మిలన్ కలిపి తింటే ప్రమాదమా..? శరీరంలో ఏం జరుగుతుంది?
- Sugarcane Juice Side Effects: వేసవిలో చెరకు రసం తాగుతున్నారా? అయితే జాగ్రత్త..!
- Kidney Stones Rising in Summer: వేసవిలో కిడ్నీల్లో పెరిగిపోతున్న రాళ్లు.. ఇలా చెక్ పెట్టండి..!
- Ragi Puri: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. రాగి పిండితో మెత్తటి పూరీలు.. ఇలా చేస్తే లొట్టలేయాల్సిందే!
Read Also: Indian Bison : నల్లమలలో 150 ఏళ్ల తర్వాత అనుకోని అతిధి.. సంబరపడిపోతున్న జంతు ప్రేమికులు..
రోజూవారీ మల్టీవిటమిన్ల వినియోగం మరణ ప్రమాదాన్ని తగ్గిస్తాయని పరిశోధన ఎలాంటి ఆధారాలను కనుగొనలేదు. వాస్తవాని ఇలా మల్టీవిటమిన్లు వాడే వారు వాడని వారి కన్నా 4 శాతం అధిక మరణ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. విటమిన్లు నిర్దిష్ట సందర్భాల్లో మాత్రమే ఉపయోగంగా ఉంటాయని పరిశోధకులు చెప్పారు. ఉదాహరణకు నావికులు స్కర్వీ నుంచి రక్షించబడటానికి విటమిన్ సీని తీసుకుంటారు. బీటా కెరోటిన్, విటమిన్ సీ, ఇ, జింక్ వంటివి వయసు సంబంధిత మచ్చలను క్షీణింపచేస్తాయి. మల్టీ విటమిన్లను తీసుకునే బదులు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలని, సాచురేటెడ్ ఫ్యాట్, కొలెస్ట్రాల్ని పరిమితం చేస్తూనే మైక్రోన్యూట్రిషియంట్స్ని, పీచు పదార్థాలను తీసుకోవాలని పరిశోధకులు సూచించారు. మన ఆహారంలో ఎక్కువగా కూరగాయలు, తృణధాన్యాలు తీసుకోవడంతో పాటు రెడ్ మీట్ని తగ్గించాలని సూచించారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో