Multivitamins: రోజూ మల్టీవిటమిన్లు తీసుకున్నంత మాత్రాన ఎక్కువ కాలం జీవించరు..
- మల్టీవిటమిన్లు తీసుకోవడం వల్ల ఎక్కువ కాలం బతకరు..
- వీటికి బదులుగా ఆరోగ్యకరమైన ఆహారం మేలు..
- మల్టీవిటమిన్లు వాడే వారిలోనే మరణాల రిస్క్..
- తాజా అధ్యయనంలో సంచలన విషయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Multivitamins: కొంతమంది రోజూవారీగా మల్టీవిటమన్లను తీసుకుంటారు. దీని వల్ల అనారోగ్య సమస్యలు తగ్గుతాయని, వ్యాధుల బారిన పడమని అనుకుంటారు. అయితే ఇలా రోజు మల్టీవిటమిన్లు తీసుకోవడం వల్ల ప్రజలు ఎక్కువ కాలం జీవించడంతో సాయం చేయడని, వాస్తవానికి ముందస్తు మరణాన్ని పెంచే అవకాశం ఉందని ఒక అధ్యయనం కనుగొంది. జేఏఎంఏ నెట్వర్క్ ఓపెన్లో ప్రచురించబడిన ఈ అధ్యయనం, దాదాపుగా 4 లక్షల మంది ఆరోగ్యవంతులైన పెద్దలపై 20 ఏళ్లకు పైగా పరిశీలన జరిపి ఈ విషయాన్ని వెల్లడించింది.
దీర్ఘాయువును మెరుగుపరచడానికి మల్టీవిటమిన్లు సహాయం ఉండదని కనుగొన్నారు. ఆశ్చర్యకరంగా ఎక్కువగా జీవించే బదులు, మల్టీవిటమిన్లు తీసుకున్న వారి కన్నా తీసుకోని వారి కన్నా ముందే చనిపోయే అవకాశం 4 శాతం ఎక్కువగా ఉందని పరిశోధకులు తెలిపారు. డాక్టర్ ఎరిక్కా లాఫ్ట్ఫీల్డ్ మరియు మేరీల్యాండ్లోని నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లోని ఇతర అసోసియేట్స్ అమెరికా ఆరోగ్య అధ్యయనాల నుంచి డేటా విశ్లేషించారు. 1990 నుంచి మల్టీవిటమిన్లు తీసుకునే వారి వివరాలను సేకరించారు. 20 ఏళ్లకు పైగా దాదాపుగా 4 లక్షల మంది వివరాలను తీసుకున్నారు.
Also Read
- Eating on Banana Leaves: అరిటాకులో భోజనం.. సంప్రదాయం వెనుక దాగి ఉన్న అద్భుత ఆరోగ్య రహస్యాలు..!
- Cancer Injection: భారత్లో 7 నిమిషాల్లో క్యాన్సర్ ఇంజెక్షన్.. కానీ ధర వింటే షాక్.
- Red Poha Upma: బరువు తగ్గాలని ప్లాన్ చేస్తున్నారా? ఉదయాన్నే కేవలం 10 నిమిషాల్లో తయారయ్యే ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ ట్రై చేయండి!
- Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ 'రాగి మిక్సర్'.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
Read Also: Indian Bison : నల్లమలలో 150 ఏళ్ల తర్వాత అనుకోని అతిధి.. సంబరపడిపోతున్న జంతు ప్రేమికులు..
రోజూవారీ మల్టీవిటమిన్ల వినియోగం మరణ ప్రమాదాన్ని తగ్గిస్తాయని పరిశోధన ఎలాంటి ఆధారాలను కనుగొనలేదు. వాస్తవాని ఇలా మల్టీవిటమిన్లు వాడే వారు వాడని వారి కన్నా 4 శాతం అధిక మరణ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. విటమిన్లు నిర్దిష్ట సందర్భాల్లో మాత్రమే ఉపయోగంగా ఉంటాయని పరిశోధకులు చెప్పారు. ఉదాహరణకు నావికులు స్కర్వీ నుంచి రక్షించబడటానికి విటమిన్ సీని తీసుకుంటారు. బీటా కెరోటిన్, విటమిన్ సీ, ఇ, జింక్ వంటివి వయసు సంబంధిత మచ్చలను క్షీణింపచేస్తాయి. మల్టీ విటమిన్లను తీసుకునే బదులు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలని, సాచురేటెడ్ ఫ్యాట్, కొలెస్ట్రాల్ని పరిమితం చేస్తూనే మైక్రోన్యూట్రిషియంట్స్ని, పీచు పదార్థాలను తీసుకోవాలని పరిశోధకులు సూచించారు. మన ఆహారంలో ఎక్కువగా కూరగాయలు, తృణధాన్యాలు తీసుకోవడంతో పాటు రెడ్ మీట్ని తగ్గించాలని సూచించారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!