Curd: వర్షాకాలంలో పెరుగు తినడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా..?
- రోజు పెరుగు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
- ఎముకలు.. కండరాలు దృఢంగా ఉంచేందుకు పెరుగు ఎంతగానో సహాయపడుతుంది..
- అతిగా పెరుగు తిన్నా కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి: వైద్య నిపుణులు
Curd: రోజు పెరుగు తినడం వల్ల అందులో ఉండే ప్రోటీన్స్, ఎస్సెన్షియల్ విటమిన్లు, ఖనిజాలు మనలో శక్తిని పెంపొందిస్తాయి. పాలలో ఉండే దాని కంటే కంటే పెరుగులో ఎక్కువప్రోటీన్స్ ని మన శరీరం త్వరగా జీర్ణం చేసుకుంటుంది. పెరుగు తిన్న తర్వాత 1 గంటలో 91 శాతం జీర్ణం అయితే అదే టైంలో పాలు 32 శాతం మాత్రమే జీర్ణం అవుతాయని పరిశోధకులు తెలిపారు. జీర్ణ వ్యవస్థ మందకొడిగా ఉండే వాళ్ళకు పెరుగు అమృతం లాంటిది అని చెప్పొచ్చు. ముఖ్యంగా పెరుగు తినడం వల్ల పిల్లలు, వయసు మళ్లిన వారిలో జీర్ణ శక్తి తొందరగా అవుతుంది.
Read Also: Waqf Bill: “వక్ఫ్ బిల్లు”పై పార్లమెంటరీ కమిటీ చైర్పర్సన్గా జగదాంబికా పాల్ నియామకం..
Also Read
- Kidney Stones Rising in Summer: వేసవిలో కిడ్నీల్లో పెరిగిపోతున్న రాళ్లు.. ఇలా చెక్ పెట్టండి..!
- Ragi Puri: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. రాగి పిండితో మెత్తటి పూరీలు.. ఇలా చేస్తే లొట్టలేయాల్సిందే!
- Weight Loss: బరువు తగ్గాలనుకునే వారికి శుభవార్త.. ఇంత వరకు ఎవరూ చెప్పని చిట్కా.. 99 శాతం సక్సెస్..
- Improve Sperm Quality: వీర్యకణాల సమస్యకు నేచురల్ సొల్యూషన్.. వీర్య నాణ్యత పెంచే ఆహారపదార్థాలు ఇవే.!
అంతే కాదు పెరుగులో ఉండే బ్యాక్టీరియా పొట్టకు చాలా మేలు చేస్తుంది. అలాగే ఎముకలను, కండరాలను ధృడంగా ఉంచేందుకు పెరుగు ఎంతగానో సహాయ పడుతుందని వైద్య నిపుణులు పేర్కొన్నారు. అందుకే చాలా మంది పెరుగును ఎంతో ఇష్టంగా తింటారు. సీజన్ తో సంబంధం లేకుండా తెగ లాగించేస్తుంటారు. మరి కొంతమంది వర్షాకాలం, చలికాలంలో పెరుగు తినడం వలన జలుబు, దగ్గు వస్తుందని భయపడతారు. అయితే, కొన్ని నివేదికల ప్రకారం.. వర్షాకాలంలోనూ పెరును తినవచ్చు.. రెయినీ సీజన్ లో ప్రతిరోజు రెండు పూటల 200 గ్రాముల పెరుగును తినడం వల్ల మలబద్ధకం ఉన్నవారికి ఆ సమస్య పోతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.
Read Also: Harish Shankar: మిస్టర్ బచ్చన్ ట్రూ ఇన్సిడెంట్.. ఎక్కడా లొంగలేదు: డైరెక్టర్ హరీష్ శంకర్ ఇంటర్వ్యూ
అలాగే, వర్షకాల సీజన్ లో పెరుగు తినడం వల్ల డయోరియా లాంటి వ్యాధులు కూడా దరిచేరవంటున్నారు. ఊబకాయం, అధిక బరువుతో బాధపడేవారికి బరువు తగ్గడానికి ఈ పెరుగు ఎంతగానో ఉపయోగపడుతుంది. చర్మం పొడిబారకుండా, గుండెను ఆరోగ్యంగా ఉంచి, గుండె పనితీరును కూడా మెరుగు పరుస్తుందని నిపుణలు అంటున్నారు. అలాగే, పెరుగులో ఉండే కాల్షియం, ప్రొటీన్, విటమిన్ డి లాంటి పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కానీ, పెరుగును ఎప్పుడూ కూడా రాత్రివేళల్లో కాకుండా ఉదయం కానీ లేదా మధ్యాహ్న సమయంలో తినాలని డాక్టర్లు చెప్పుకొస్తున్నారు. అతిగా పెరుగు తిన్నా కూడా అనారోగ్య సమస్యలు వస్తాయని పేర్కొన్నారు. అందుకే వర్షాకాలంలో పెరుగు తినే వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. ఒక వేళ రాత్రివేళల్లో పెరుగు తినే అలవాటు ఉన్నవారు తక్కువ మోతాదులో తీసుకోవాలి.. లేదంటే జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు తప్పకుండా నిపుణులను సంప్రదించగలరు..
తాజావార్తలు
-
CM Revanth Reddy : BRS ఒక చచ్చిపోయిన శవం.. దానికి భవిష్యత్తు లేదు
-
Viral: ‘మీసాల పిల్ల’ అంటూ ఎగతాళి చేశారు.. కట్ చేస్తే ప్రశంసల హోరు..
-
మరోసారి వక్రబుద్ధి బయట పెట్టిన పాకిస్తాన్.. Vaibhav Sooryavanshi బ్యాట్లో AI చిప్ అంటూ కారుకూతలు.!
-
NBK – Koratala Siva మూవీ స్టోరీ లీక్.. మాఫియా డాన్గా బాలయ్య! ఇక నందమూరి ఫ్యాన్స్కు పూనకాలే..
-
Heatwave Alert : తెలంగాణ రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!