Curd: వర్షాకాలంలో పెరుగు తినడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా..?
- రోజు పెరుగు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
- ఎముకలు.. కండరాలు దృఢంగా ఉంచేందుకు పెరుగు ఎంతగానో సహాయపడుతుంది..
- అతిగా పెరుగు తిన్నా కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి: వైద్య నిపుణులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Curd: రోజు పెరుగు తినడం వల్ల అందులో ఉండే ప్రోటీన్స్, ఎస్సెన్షియల్ విటమిన్లు, ఖనిజాలు మనలో శక్తిని పెంపొందిస్తాయి. పాలలో ఉండే దాని కంటే కంటే పెరుగులో ఎక్కువప్రోటీన్స్ ని మన శరీరం త్వరగా జీర్ణం చేసుకుంటుంది. పెరుగు తిన్న తర్వాత 1 గంటలో 91 శాతం జీర్ణం అయితే అదే టైంలో పాలు 32 శాతం మాత్రమే జీర్ణం అవుతాయని పరిశోధకులు తెలిపారు. జీర్ణ వ్యవస్థ మందకొడిగా ఉండే వాళ్ళకు పెరుగు అమృతం లాంటిది అని చెప్పొచ్చు. ముఖ్యంగా పెరుగు తినడం వల్ల పిల్లలు, వయసు మళ్లిన వారిలో జీర్ణ శక్తి తొందరగా అవుతుంది.
Read Also: Waqf Bill: “వక్ఫ్ బిల్లు”పై పార్లమెంటరీ కమిటీ చైర్పర్సన్గా జగదాంబికా పాల్ నియామకం..
Also Read
- వృద్ధాప్యాన్ని తిప్పికొట్టే 'ER-100' ఇంజెక్షన్.. తొలి రోగికి డోస్ సక్సెస్! ఇక మానవులు అమరులు అవుతారా?
- Soya Manchurian: పిల్లలు లొట్టలేసుకుంటూ తినే 'మిల్ మేకర్ మంచూరియా'.. టేస్టీగా, హెల్తీగా ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి!
- Sleep Disorder : రాత్రి 8 గంటలు నిద్రపోయినా అలసట ఎందుకు పోదు? చాలా మంది తెలుసుకోవాల్సిన నిజాలు!
- Kerala Parotta : కేరళ స్టైల్ పరోటా ఇష్టమా.? తినే ముందు ఇవి తెలుసుకోండి..!
అంతే కాదు పెరుగులో ఉండే బ్యాక్టీరియా పొట్టకు చాలా మేలు చేస్తుంది. అలాగే ఎముకలను, కండరాలను ధృడంగా ఉంచేందుకు పెరుగు ఎంతగానో సహాయ పడుతుందని వైద్య నిపుణులు పేర్కొన్నారు. అందుకే చాలా మంది పెరుగును ఎంతో ఇష్టంగా తింటారు. సీజన్ తో సంబంధం లేకుండా తెగ లాగించేస్తుంటారు. మరి కొంతమంది వర్షాకాలం, చలికాలంలో పెరుగు తినడం వలన జలుబు, దగ్గు వస్తుందని భయపడతారు. అయితే, కొన్ని నివేదికల ప్రకారం.. వర్షాకాలంలోనూ పెరును తినవచ్చు.. రెయినీ సీజన్ లో ప్రతిరోజు రెండు పూటల 200 గ్రాముల పెరుగును తినడం వల్ల మలబద్ధకం ఉన్నవారికి ఆ సమస్య పోతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.
Read Also: Harish Shankar: మిస్టర్ బచ్చన్ ట్రూ ఇన్సిడెంట్.. ఎక్కడా లొంగలేదు: డైరెక్టర్ హరీష్ శంకర్ ఇంటర్వ్యూ
అలాగే, వర్షకాల సీజన్ లో పెరుగు తినడం వల్ల డయోరియా లాంటి వ్యాధులు కూడా దరిచేరవంటున్నారు. ఊబకాయం, అధిక బరువుతో బాధపడేవారికి బరువు తగ్గడానికి ఈ పెరుగు ఎంతగానో ఉపయోగపడుతుంది. చర్మం పొడిబారకుండా, గుండెను ఆరోగ్యంగా ఉంచి, గుండె పనితీరును కూడా మెరుగు పరుస్తుందని నిపుణలు అంటున్నారు. అలాగే, పెరుగులో ఉండే కాల్షియం, ప్రొటీన్, విటమిన్ డి లాంటి పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కానీ, పెరుగును ఎప్పుడూ కూడా రాత్రివేళల్లో కాకుండా ఉదయం కానీ లేదా మధ్యాహ్న సమయంలో తినాలని డాక్టర్లు చెప్పుకొస్తున్నారు. అతిగా పెరుగు తిన్నా కూడా అనారోగ్య సమస్యలు వస్తాయని పేర్కొన్నారు. అందుకే వర్షాకాలంలో పెరుగు తినే వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. ఒక వేళ రాత్రివేళల్లో పెరుగు తినే అలవాటు ఉన్నవారు తక్కువ మోతాదులో తీసుకోవాలి.. లేదంటే జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు తప్పకుండా నిపుణులను సంప్రదించగలరు..
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!