Curd: వర్షాకాలంలో పెరుగు తినడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా..?
- రోజు పెరుగు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
- ఎముకలు.. కండరాలు దృఢంగా ఉంచేందుకు పెరుగు ఎంతగానో సహాయపడుతుంది..
- అతిగా పెరుగు తిన్నా కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి: వైద్య నిపుణులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Curd: రోజు పెరుగు తినడం వల్ల అందులో ఉండే ప్రోటీన్స్, ఎస్సెన్షియల్ విటమిన్లు, ఖనిజాలు మనలో శక్తిని పెంపొందిస్తాయి. పాలలో ఉండే దాని కంటే కంటే పెరుగులో ఎక్కువప్రోటీన్స్ ని మన శరీరం త్వరగా జీర్ణం చేసుకుంటుంది. పెరుగు తిన్న తర్వాత 1 గంటలో 91 శాతం జీర్ణం అయితే అదే టైంలో పాలు 32 శాతం మాత్రమే జీర్ణం అవుతాయని పరిశోధకులు తెలిపారు. జీర్ణ వ్యవస్థ మందకొడిగా ఉండే వాళ్ళకు పెరుగు అమృతం లాంటిది అని చెప్పొచ్చు. ముఖ్యంగా పెరుగు తినడం వల్ల పిల్లలు, వయసు మళ్లిన వారిలో జీర్ణ శక్తి తొందరగా అవుతుంది.
Read Also: Waqf Bill: “వక్ఫ్ బిల్లు”పై పార్లమెంటరీ కమిటీ చైర్పర్సన్గా జగదాంబికా పాల్ నియామకం..
Also Read
- Blood Sugar Test Timing: తిన్న ఎంతసేపటి తర్వాత షుగర్ చెక్ చేయాలి? చాలామంది చేసే పెద్ద తప్పు ఇదే!
- Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే 'ఫ్లఫీ ఆమ్లెట్' చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
- Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
- Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ 'బ్రెడ్ పకోడా'.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
అంతే కాదు పెరుగులో ఉండే బ్యాక్టీరియా పొట్టకు చాలా మేలు చేస్తుంది. అలాగే ఎముకలను, కండరాలను ధృడంగా ఉంచేందుకు పెరుగు ఎంతగానో సహాయ పడుతుందని వైద్య నిపుణులు పేర్కొన్నారు. అందుకే చాలా మంది పెరుగును ఎంతో ఇష్టంగా తింటారు. సీజన్ తో సంబంధం లేకుండా తెగ లాగించేస్తుంటారు. మరి కొంతమంది వర్షాకాలం, చలికాలంలో పెరుగు తినడం వలన జలుబు, దగ్గు వస్తుందని భయపడతారు. అయితే, కొన్ని నివేదికల ప్రకారం.. వర్షాకాలంలోనూ పెరును తినవచ్చు.. రెయినీ సీజన్ లో ప్రతిరోజు రెండు పూటల 200 గ్రాముల పెరుగును తినడం వల్ల మలబద్ధకం ఉన్నవారికి ఆ సమస్య పోతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.
Read Also: Harish Shankar: మిస్టర్ బచ్చన్ ట్రూ ఇన్సిడెంట్.. ఎక్కడా లొంగలేదు: డైరెక్టర్ హరీష్ శంకర్ ఇంటర్వ్యూ
అలాగే, వర్షకాల సీజన్ లో పెరుగు తినడం వల్ల డయోరియా లాంటి వ్యాధులు కూడా దరిచేరవంటున్నారు. ఊబకాయం, అధిక బరువుతో బాధపడేవారికి బరువు తగ్గడానికి ఈ పెరుగు ఎంతగానో ఉపయోగపడుతుంది. చర్మం పొడిబారకుండా, గుండెను ఆరోగ్యంగా ఉంచి, గుండె పనితీరును కూడా మెరుగు పరుస్తుందని నిపుణలు అంటున్నారు. అలాగే, పెరుగులో ఉండే కాల్షియం, ప్రొటీన్, విటమిన్ డి లాంటి పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కానీ, పెరుగును ఎప్పుడూ కూడా రాత్రివేళల్లో కాకుండా ఉదయం కానీ లేదా మధ్యాహ్న సమయంలో తినాలని డాక్టర్లు చెప్పుకొస్తున్నారు. అతిగా పెరుగు తిన్నా కూడా అనారోగ్య సమస్యలు వస్తాయని పేర్కొన్నారు. అందుకే వర్షాకాలంలో పెరుగు తినే వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. ఒక వేళ రాత్రివేళల్లో పెరుగు తినే అలవాటు ఉన్నవారు తక్కువ మోతాదులో తీసుకోవాలి.. లేదంటే జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు తప్పకుండా నిపుణులను సంప్రదించగలరు..
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!