Health Tips for Bloating Problem: కడుపు ఉబ్బరంగా ఉందా? ఈ ఫుడ్స్ ట్రై చేయండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈమధ్యకాలంలో వివిధ అనారోగ్య సమస్యలు తరచూ వేధిస్తున్నాయి. కడుపు ఉబ్బరంగా ఉందని చాలామంది అంటుంటారు. కడుపు ఉబ్బరం సమస్య తలెత్తడానికి మలబద్ధకం, గాలిని మింగడం, సరిగ్గా లేదా సరైన సమయానికి తినకపోవడం వంటి చాలా కారణాలు ఉంటాయి. వీటితోపాటు మనం తరచూ తినే ఆహార పదార్థాలు కూడా బ్లోటింగ్ సమస్యకు దారితీస్తాయి. చాలా మంది తాము ఆ ఫుడ్ తింటే పడడం లేదని, కడుపు బరువుగా ఉంటోందని ఫిర్యాదు చేస్తుంటారు. తమకు కొన్ని ఆహార పదార్థాలు పడవని తెలిసినా తీసుకుంటూ ఉంటారు. ఫలితంగా కడుపు ఉబ్బినట్లుగా ఉంటుంది. ఎందరు ఏం తినకపోయినా గ్యాస్ సమస్యలతో బాధపడుతుంటారు.
Read Also: Astrology: జనవరి 09, సోమవారం దినఫలాలు
Also Read
- Vitamin Guide for Every Organ: మెదడు నుంచి ఎముకల వరకు.. ఏ అవయవానికి ఏ విటమిన్ కీలకం..?
- Gas Burner Cleaning: గ్యాస్ బర్నర్ మంట పసుపు రంగులో వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో క్లీన్..
- Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
- Hair Care Tips: గుండు చేయించుకుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుందా? ఇది నిజమా లేక అపోహా?
వివిధ రకాల ఆహారాలు తినడం వల్ల ఎసిడిటీ, మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు వస్తుంటాయి. ఒకవైపు, కొన్ని పదార్థాలు తినడం వల్ల కడుపు నొప్పి వస్తుంటుంది. జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను కొన్ని వంటింటి చిట్కాలతో నయం చేసుకోవచ్చు. ఈ చిట్కాల వల్ల మీ ఆరోగ్యం కుదుట పడడమే కాదు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ దరిచేరవు.
*ఉదయం లేచిన వెంటనే టీ, కాఫీలు తాగకుండా ఒక గ్లాసు వేడి నీరు తాగండి. ఇలా చేయడం వల్ల బాడీలో మలినాలు తొలగిపోతాయి.
* అలాగే పెరుగు, మజ్జిగ ఎక్కువగా తీసుకోవడం మంచిది. పెరుగు కడుపుకు మేలు చేస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. పెరుగులో ఉండే లక్షణాలు జీర్ణక్రియను పెంచుతాయి. ఇందులో ఉండే మంచి బ్యాక్టీరియా పేగులను ఆరోగ్యంగా ఉంచి, జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను దూరం చేస్తుంది.
* మజ్జిగలో ఉండే ఎంజైమ్లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. మజ్జిగలో జీలకర్ర, పెసరపప్పు, నల్ల ఉప్పు వేసి కడుపులో మంట ఉంటే తాగాలి. ఈ విధంగా, తక్షణ ఉపశమనం కలుగుతుంది.
* కడుపు ఉబ్బరం ఉన్నపుడు జీలకర్ర పొడిని పెరుగులో కలిపి తింటే సమస్య నుంచి బయటపడొచ్చు.
* సోంపు జీర్ణక్రియకు బాగా ఉపయోగకరంగా ఉంటుంది. చాలామంది సోంపుగింజలను భోజనం తర్వాత తీసుకుంటుంటారు. సోంపును నీటిని తాగితే జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. కడుపు ఉబ్బిన తర్వాత నీళ్లలో నానబెట్టిన సోంపు వాటర్ను తాగితే గ్యాస్, మలబద్ధకం సమస్యలు మీ నుంచి దూరం అవుతాయి.
* మీకు ఫ్రూట్స్ తినే అలవాటు ఉంటే.. బొప్పాయి తినండి. అది జీర్ణక్రియకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. బొప్పాయిలో ఉండే పపైన్ జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను దూరం చేస్తుంది. బొప్పాయి తినడం వల్ల గ్యాస్, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వుండవు. బొప్పాయిలో నల్ల ఉప్పు కలిపి తింటే ఇంకా మేలు జరుగుతుంది.
* వామ్ము తిన్నా కూడా కడుపు ఉబ్బరం సమస్యలు దూరం అవుతాయని డాక్టర్లు సూచిస్తున్నారు.
Read Also: Cold Wave: తెలంగాణపై చలి పులి పంజా.. సంగారెడ్డి జిల్లాలో అత్యల్పం
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!