Health Tips for Bloating Problem: కడుపు ఉబ్బరంగా ఉందా? ఈ ఫుడ్స్ ట్రై చేయండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈమధ్యకాలంలో వివిధ అనారోగ్య సమస్యలు తరచూ వేధిస్తున్నాయి. కడుపు ఉబ్బరంగా ఉందని చాలామంది అంటుంటారు. కడుపు ఉబ్బరం సమస్య తలెత్తడానికి మలబద్ధకం, గాలిని మింగడం, సరిగ్గా లేదా సరైన సమయానికి తినకపోవడం వంటి చాలా కారణాలు ఉంటాయి. వీటితోపాటు మనం తరచూ తినే ఆహార పదార్థాలు కూడా బ్లోటింగ్ సమస్యకు దారితీస్తాయి. చాలా మంది తాము ఆ ఫుడ్ తింటే పడడం లేదని, కడుపు బరువుగా ఉంటోందని ఫిర్యాదు చేస్తుంటారు. తమకు కొన్ని ఆహార పదార్థాలు పడవని తెలిసినా తీసుకుంటూ ఉంటారు. ఫలితంగా కడుపు ఉబ్బినట్లుగా ఉంటుంది. ఎందరు ఏం తినకపోయినా గ్యాస్ సమస్యలతో బాధపడుతుంటారు.
Read Also: Astrology: జనవరి 09, సోమవారం దినఫలాలు
Also Read
- Idol Cleaning Tips : గణేష్ చతుర్థికి ఇంట్లోనే విగ్రహాలకు ఇలా కొత్త మెరుపు
- Breakup: బ్రేకప్ తర్వాత కొన్ని రోజులకే ప్రేమ పుడుతుందా?
- Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
- Jowar Roti to Ragi Roti: రొట్టెల్లో వెరైటీ కావాలా?.. జొన్న నుంచి రాగి వరకు.. ఆరోగ్యకరమైన 6 రకాల రొట్టెలు ఇవే!
వివిధ రకాల ఆహారాలు తినడం వల్ల ఎసిడిటీ, మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు వస్తుంటాయి. ఒకవైపు, కొన్ని పదార్థాలు తినడం వల్ల కడుపు నొప్పి వస్తుంటుంది. జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను కొన్ని వంటింటి చిట్కాలతో నయం చేసుకోవచ్చు. ఈ చిట్కాల వల్ల మీ ఆరోగ్యం కుదుట పడడమే కాదు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ దరిచేరవు.
*ఉదయం లేచిన వెంటనే టీ, కాఫీలు తాగకుండా ఒక గ్లాసు వేడి నీరు తాగండి. ఇలా చేయడం వల్ల బాడీలో మలినాలు తొలగిపోతాయి.
* అలాగే పెరుగు, మజ్జిగ ఎక్కువగా తీసుకోవడం మంచిది. పెరుగు కడుపుకు మేలు చేస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. పెరుగులో ఉండే లక్షణాలు జీర్ణక్రియను పెంచుతాయి. ఇందులో ఉండే మంచి బ్యాక్టీరియా పేగులను ఆరోగ్యంగా ఉంచి, జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను దూరం చేస్తుంది.
* మజ్జిగలో ఉండే ఎంజైమ్లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. మజ్జిగలో జీలకర్ర, పెసరపప్పు, నల్ల ఉప్పు వేసి కడుపులో మంట ఉంటే తాగాలి. ఈ విధంగా, తక్షణ ఉపశమనం కలుగుతుంది.
* కడుపు ఉబ్బరం ఉన్నపుడు జీలకర్ర పొడిని పెరుగులో కలిపి తింటే సమస్య నుంచి బయటపడొచ్చు.
* సోంపు జీర్ణక్రియకు బాగా ఉపయోగకరంగా ఉంటుంది. చాలామంది సోంపుగింజలను భోజనం తర్వాత తీసుకుంటుంటారు. సోంపును నీటిని తాగితే జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. కడుపు ఉబ్బిన తర్వాత నీళ్లలో నానబెట్టిన సోంపు వాటర్ను తాగితే గ్యాస్, మలబద్ధకం సమస్యలు మీ నుంచి దూరం అవుతాయి.
* మీకు ఫ్రూట్స్ తినే అలవాటు ఉంటే.. బొప్పాయి తినండి. అది జీర్ణక్రియకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. బొప్పాయిలో ఉండే పపైన్ జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను దూరం చేస్తుంది. బొప్పాయి తినడం వల్ల గ్యాస్, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వుండవు. బొప్పాయిలో నల్ల ఉప్పు కలిపి తింటే ఇంకా మేలు జరుగుతుంది.
* వామ్ము తిన్నా కూడా కడుపు ఉబ్బరం సమస్యలు దూరం అవుతాయని డాక్టర్లు సూచిస్తున్నారు.
Read Also: Cold Wave: తెలంగాణపై చలి పులి పంజా.. సంగారెడ్డి జిల్లాలో అత్యల్పం
తాజావార్తలు
-
Modi-Xi Jinping: ‘ఈజ్ ఇట్ ఓకే?’.. షీ జిన్పింగ్ను చూసి ప్రసంగం ఆపిన మోడీ.. అసలేం జరిగిందంటే?
-
Glaciers: వేడెక్కుతున్న భూమితో ఏం జరగబోతోంది?
-
BRICS Currency: బ్రిక్స్ కరెన్సీపై భారత్ కీలక ప్రకటన.. కామన్ కరెన్సీపై ఫుల్ క్లారిటీ..!
-
Khairatabad Bada Ganesh : ఖైరతాబాద్ బడా గణేష్ రెడీ.. ఈసారి పంచముఖ రూపంలో దర్శనం!
-
Kashi Majili OTT: ‘కాశీ మజిలీ’తో రీఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్.. ‘ఈటీవీ విన్’లో ఎమోషనల్ లవ్ స్టోరీ!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!