Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
- FSSAI కొత్త నిబంధనలు అమల్లోకి
- తుప్పు కత్తులపై పూర్తి నిషేధం
- ఫుడ్ గ్రేడ్ పరికరాలే తప్పనిసరి
- నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Food Grade Knives : మీరు హోటల్, రెస్టారెంట్, రోడ్సైడ్ ధాబా, స్వీట్ షాప్, ఫుడ్ ఫ్యాక్టరీ , చిన్న టిఫిన్ సెంటర్ లాంటి ఎలాంటి ఆహార వ్యాపారాన్ని (FBO) నడుపుతున్నా ఈ వార్త ఖచ్చితంగా మీ కోసమే. దేశవ్యాప్తంగా ఉన్న ఆహార వ్యాపార నిర్వాహకులందరూ తమ వంటశాలలలో కేవలం ‘ఫుడ్ గ్రేడ్’ , తుప్పు పట్టని కత్తులు, బ్లేడ్లు, కోసే పరికరాలను మాత్రమే ఉపయోగించాలని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) కఠినమైన ఆదేశాలు జారీ చేసింది.
Also Read
- Gas Lighter Cleaning Tips: గ్యాస్ లైటర్పై మొండి మురికి పోవట్లేదా?.. ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్
- Ragi Bellam Cake: చిన్న గిన్నెల్లోనే ఎగ్లెస్ రాగి బెల్లం కప్ కేక్స్.. హెల్తీ అండ్ టేస్టీగా ఇలా చేసుకోండి!
- Touching Elders Feet: పెద్దల కాళ్లకు నమస్కారం చేయడం.. కేవలం సంప్రదాయమేనా.! శాస్త్రీయ కోణం కూడా ఉందా.?
- Papaya Seeds Health Benefits: బొప్పాయి గింజలను పారేస్తున్నారా..? ఈ రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
అనేక ప్రాంతాలలో ఇప్పటికీ తుప్పు పట్టిన, విరిగిన , పాడైపోయిన కత్తులతో ఆహార పదార్థాలను కోసి ప్రాసెస్ చేస్తున్నారని తనిఖీలలో వెల్లడైంది. ఇది ఆహార నాణ్యతను దెబ్బతీయడమే కాకుండా ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు కలిగిస్తోందని FSSAI ఆందోళన వ్యక్తం చేసింది.
ఆరోగ్యానికి ముప్పు తెచ్చే పాత పరికరాలు
ఆహార భద్రతా సంస్థ నిర్వహించిన తనిఖీల నివేదికల ప్రకారం.. కొన్ని ఆహార వ్యాపారాలలో పగుళ్లు వచ్చినవి, రంగు ఊడిపోతున్న , తుప్పు పట్టిన పరికరాలను యథేచ్ఛగా వాడుతున్నారు. ఇలాంటి లోపభూయిష్టమైన వస్తువులను ఉపయోగించడం వల్ల వాటిలోని లోహ కణాలు, రసాయనాలు , హానికరమైన బ్యాక్టీరియా ఆహారంలోకి సులభంగా ప్రవేశిస్తాయి. ఇది ఆహారాన్ని కలుషితం చేసి, వినియోగదారులకు అనేక రకాల ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. అందుకే వంట , ఆహార తయారీ కోసం తుప్పు పట్టిన, రంగు మారిన, పాడైపోయిన కత్తులు, పాత్రల వాడకాన్ని తక్షణమే నిలిపివేయాలని స్పష్టం చేసింది.
FSSAI జారీ చేసిన నాలుగు ముఖ్యమైన సూచనలు
ఫుడ్-గ్రేడ్ సాధనాలు మాత్రమే: ఆహారాన్ని కత్తిరించడానికి, తొక్క తీయడానికి , ప్రాసెస్ చేయడానికి కేవలం ఫుడ్-గ్రేడ్ , తుప్పు-నిరోధక పదార్థాలతో (స్టెయిన్లెస్ స్టీల్ వంటివి) తయారు చేసిన కత్తులు, బ్లేడ్లను మాత్రమే వాడాలి.
పరికరాల పరిశుభ్రత: అన్ని కోత పనిముట్లను ఎల్లప్పుడూ శుభ్రంగా , పరిశుభ్రమైన స్థితిలో ఉంచాలి. వాటిపై ఎలాంటి తుప్పు, పగుళ్లు, అరుగుదల , రంగు ఊడిపోయే లోపాలు ఉండకూడదు.
లోపభూయిష్టమైన వాటి తొలగింపు: ఏదైనా కత్తి , బ్లేడు తుప్పు పట్టినట్లు, విరిగినట్లు , దెబ్బతిన్నట్లు గుర్తిస్తే దానిని వెంటనే వాడకం నుండి తొలగించి, దాని స్థానంలో కొత్తదాన్ని ఏర్పాటు చేసుకోవాలి.
క్రమం తప్పకుండా క్రిమిసంహారక ప్రక్రియ: ఆహార పదార్థాలు కలుషితం కాకుండా ఉండటానికి కత్తులు, కత్తెరలు, చాపింగ్ బోర్డులను వేడి నీటిలో కడిగి, క్రిమిసంహారక ద్రవంతో , సబ్బు ద్రావణంతో క్రమం తప్పకుండా క్లీన్ చేయడం ఎంతో అవసరం.
కత్తులను శుభ్రంగా ఉంచుకునే చిట్కాలు
వంటగదిలోని కత్తులు ఎక్కువ కాలం మన్నికగా, తుప్పు పట్టకుండా ఉండటానికి కొన్ని సులువైన చిట్కాలను పాటించవచ్చు. కత్తుల నుండి మొండి మరకలను, తుప్పును వదిలించడానికి గోరువెచ్చని నీరు , నిమ్మరసం మిశ్రమాన్ని ఉపయోగించి కొద్దిసేపు నాననివ్వాలి. ఆ తర్వాత స్పాంజితో రుద్దితే అవి సులభంగా క్లీన్ అవుతాయి. ప్రతిసారి కూరగాయలు , మాంసం కోసిన వెంటనే, ఆలస్యం చేయకుండా కత్తిని గోరువెచ్చని నీరు, గిన్నెలు కడిగే సబ్బుతో కడిగి శుభ్రమైన పొడి గుడ్డతో తుడవాలి. కత్తులను ఎప్పుడూ తడిగా ఉన్నప్పుడు , ఇతర పాత్రలతో కలిపి పడేయకూడదు. వాటిని ఎల్లప్పుడూ బాగా ఆరబెట్టిన తర్వాతే ప్రత్యేకమైన కత్తుల పెట్టెలో (నైఫ్ బాక్స్) భద్రపరుచుకోవాలి.
తాజావార్తలు
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
MK Stalin: రాహుల్గాంధీకి వెరైటీగా బర్త్డే విషెస్ చెప్పిన స్టాలిన్
-
Gas Lighter Cleaning Tips: గ్యాస్ లైటర్పై మొండి మురికి పోవట్లేదా?.. ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్
-
Iran: ప్రపంచ దేశాలకు ఇరాన్ బిగ్ షాక్.. హార్ముజ్ మళ్లీ మూసివేత
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవుట్..? తుది జట్టులో ఊహించని మార్పులు..
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?