Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవుట్..? తుది జట్టులో ఊహించని మార్పులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంకలోని దంబుల్లా వేదికగా భారత-ఏ, శ్రీలంక-ఏ, ఆఫ్ఘనిస్తాన్-ఏ జట్ల మధ్య ముక్కోణపు వన్డే సిరీస్ జరుగుతోంది. ఈ టోర్నీలో జూన్ 21 ఆదివారం రోజున భారత-ఏ, శ్రీలంక-ఏ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే, ఈ తుది పోరు 15 ఏళ్ల భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అత్యంత కీలకంగా మారింది. తన కీర్తిని, ప్రతిభను కాపాడుకుంటూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే అతను ఈ మ్యాచ్లో ఖచ్చితంగా రాణించాల్సిందే.
ఈ టోర్నీలో ఇప్పటివరకు వైభవ్ ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. 4 ఇన్నింగ్స్ల్లో కేవలం 109 పరుగులు మాత్రమే చేశాడు. అతని స్కోర్లు వరుసగా 14, 44, 21, 38 పరుగులుగా ఉన్నాయి. ఇందులో కాస్త బలహీనమైన ఆఫ్ఘనిస్తాన్-ఏ జట్టుపైనే అతను 44, 38 పరుగులు చేశాడు. కానీ, బలమైన బౌలింగ్ విభాగం ఉన్న శ్రీలంక జట్టుపై కేవలం 14, 21 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఒకవేళ ఫైనల్లో కూడా వైభవ్ విఫలమైతే.. అతను కేవలం ఐపీఎల్ పరుగుల అనుకూల పిచ్లపై, బలహీనమైన బౌలింగ్పైనే ఆడగలడనే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
Also Read
- Vaibhav Sooryavanshi: ఆల్ రౌండర్గా వైభవ్ సూర్యవంశీ.. అందుకే వైస్ కెప్టెన్సీ బాధ్యతలు..
- ICC World Cup: 2027 వరల్డ్ కప్ వేదిక నగరాల ప్రకటన.. మూడు దశల కొత్త ఫార్మాట్లో ఇలా..
- Indian Player: 33 ఏళ్ల వయస్సులో టెస్టుల్లో అరంగేట్రం.. అరుదైన రికార్డు సాధించిన ప్లేయర్..
- Asian Legends League: ప్రారంభమైన లెజెండ్స్ టీ20 లీగ్.. ఆగస్టు 2న హై ఓల్టేజ్ మ్యాచ్..
సీనియర్ క్రీడా జర్నలిస్ట్ ప్రతీక్ శ్రీవాస్తవ అభిప్రాయం ప్రకారం.. వైభవ్ ఫైనల్లో విఫలమైతే, సెలక్టర్లు అతని ఎంపికపై పునరాలోచనలో పడవచ్చు. అయితే దీని అర్థం అతని కెరీర్ ముగిసినట్లు కాదు; అతను తిరిగి దేశవాళీ క్రికెట్కు వెళ్లి, అగ్రశ్రేణి జట్లతో పోటీపడుతూ ఎరుపు, తెల్ల బంతులతో మరింత క్రికెట్ ఆడి తన సాంకేతికతను మెరుగుపరుచుకోవాలి. ఇందుకోసం ప్రధాన సెలక్టర్ అజిత్ అగార్కర్, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ అతని కోసం ఒక ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేయాల్సి ఉంటుంది.
ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శన చేశాడు. 16 మ్యాచ్ల్లో 200 పైగా స్ట్రైక్ రేట్తో 776 పరుగులు చేసి, రికార్డు స్థాయిలో 72 సిక్సర్లు బాదాడు. ఈ ప్రదర్శనతోనే అతను భారత-ఏ జట్టుతో పాటు, ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు భారత సీనియర్ టీ20 జట్టుకు కూడా ఎంపికయ్యాడు. శ్రీలంక పిచ్లు పూర్తిగా బ్యాటింగ్కు అనుకూలించవని భావిస్తున్నప్పటికీ, దంబుల్లా పిచ్పై జట్లు 300కు పైగా పరుగులు చేస్తున్నందున వైభవ్ తన అందివచ్చిన అవకాశాన్ని ఫైనల్లో సద్వినియోగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ఆల్ రౌండర్గా వైభవ్ సూర్యవంశీ.. అందుకే వైస్ కెప్టెన్సీ బాధ్యతలు..
-
ICC World Cup: 2027 వరల్డ్ కప్ వేదిక నగరాల ప్రకటన.. మూడు దశల కొత్త ఫార్మాట్లో ఇలా..
-
Dehradun: ‘అత్తింటివారి మనస్తత్వం మారదు’.. వీడియో రికార్డ్ చేసి టీచర్ ఆత్మహత్య
-
Rishab Shetty: రామాయణ ట్రైలర్కి ఫిదా అయిన రిషబ్ శెట్టి.. ఏం అన్నారంటే!
-
Rajya Sabha: యాంటీ పేపర్ లీక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
ట్రెండింగ్
-
Alien Temple: ఏలియన్కు ఆలయం.. ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే..!
-
Google Pixel 11 సిరీస్లో కొత్త ట్విస్ట్.. లాంచ్కు కీలక ఫీచర్స్ లీక్..!
-
WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!