All Eyes On Rafah: అప్పుడు మీ అందరి కళ్లు ఎక్కడున్నాయి.. ‘‘ఆల్ ఐస్ ఆన్ రఫా’’పై ఇజ్రాయిల్ ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
All Eyes On Rafah: ఇజ్రాయిల్-గాజా మధ్య యుద్ధ తీవ్రత మరింత పెరిగింది. ఇటీవల దక్షిణ గాజాలోని రఫా నగరంలో ఇజ్రాయిల్ జరిపిన దాడిలో శరణార్థి శిబిరంలోని చిన్నారులతో పాటు కనీసం 45 మంది మరణించారు. ఈ దృశ్యాలు ప్రపంచాన్ని కదిలించాయి. దీంతో ప్రపంచంలోని ప్రముఖులు, క్రీడాకారులు మిలియన్ల సంఖ్యలో సోషల్ మీడియాలో ‘ఆల్ ఐస్ ఆన్ రఫా’’ అనే హ్యాష్ట్యాగ్ని ట్రెండ్ చేశారు. ఈ దాడి ఘటన అంతర్జాతీయంగా ఇజ్రాయిల్ని మరింత ఒంటరి చేసే ప్రయత్నం చేసింది. అమెరికా కూడా ఈ దాడి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
అయితే, దీనికి ప్రతిస్పందనగా ఇజ్రాయిల్ కూడా అంతే ధీటుగా స్పందించింది. రఫాపై కన్నీరు కారుస్తున్న వారంతా ఇజ్రాయిల్పై హమాస్ మిలిటెంట్లు దాడి చేసి, అభంశుభం తెలియని చిన్నారులను చంపినప్పుడు ఎక్కడున్నారంటూ ప్రశ్నించింది. దీనికి సంబంధించి ఓ సోషల్ మీడియా పోస్టుని ఇజ్రాయిల్ పంచుకుంది. గన్ పట్టుకున్న హమాస్ ఉగ్రవాది ముందు ఓ చిన్న పిల్లాడు ఉన్న ఫోటోని ట్వీట్ చేసింది. అక్టోబర్ 7 దాడిలో హమాస్ ఉగ్రవాదులు చేతిలో 1200 మంది మరణించడంతో పాటు 240 మందిని బందీలుగా గాజాలోకి పట్టుకెళ్లారు. ప్రస్తుతం ఉగ్రవాదుల చేలితో 99 మంది బందీలు సజీవంగా ఉన్నారని, 31 మంది మరణించారని ఇజ్రాయిల్ భావిస్తోంది.
Also Read
Read Also: PM Modi: 45 గంటల పాటు ధ్యానం చేసేందుకు సిద్దమవుతున్న ప్రధాని మోడీ.. వివరాలు ఇలా..
హమాస్ దాడి తర్వాత ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్పై విరుచుకుపడుతోంది. అయితే, ఉత్తరాన ఉన్న గాజా నగరాన్ని జల్లెడ పట్టినప్పటికీ అక్కడ ఇజ్రాయిల్ బందీలు లేకపోవడంతో, హమాస్కి మరో స్థావరంగా ఉన్న దక్షిణాన ఉన్న రఫాని టార్గెట్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన దాడిలో 45 మంది మరణించారు.
ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఎక్స్ వేదికగా, రఫాపై పోస్టు పెడుతున్న వారిని ఉద్దేశించి ట్వీట్ చేశారు. ‘‘ అక్టోబర్ 7న మీ కళ్లు ఎక్కడ ఉన్నాయి. మేమే అక్టోబర్ 7 గురించి మాట్లాడటం ఆపము, మేము బందీల కోసం పోరాటాన్ని ఎప్పటికీ ఆపము’’ అని ఆయన స్పష్టం చేశారు. దాదాపుగా 45 మిలియన్ల మంది యూజర్లు ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో ‘‘ ఆల్ ఐస్ ఆన్ రఫా’’ వైరల్ చేశారు. “ఆల్ ఐస్ ఆన్ రఫా” చిత్రాన్ని పోస్ట్ చేసిన భారతీయ ప్రముఖుల్లో కొందరు ప్రియాంక చోప్రా జోనాస్, అలియా భట్, కరీనా కపూర్ ఖాన్, మాధురీ దీక్షిత్ నేనే, వరుణ్ ధావన్ మరియు సమంతా రూత్ ప్రభు ఉన్నారు.
We will NEVER stop talking about October 7th.
We will NEVER stop fighting for the hostages. pic.twitter.com/XoFqAf1IjM
— Israel ישראל (@Israel) May 29, 2024
తాజావార్తలు
-
Rama Nandana: యూట్యూబర్స్ ‘గలీజ్ దందా’ స్కామ్.. రంగంలోకి దిగిన తెలంగాణ పోలీస్..
-
Dimple Choudhary: ప్రముఖ డ్యాన్సర్తో అనుచిత ప్రవర్తన.. స్టేజ్పై కీచకుడి చెంపపగలగొట్టిన నర్తకి
-
Hyderabad Rains : హైదరాబాద్లో దంచికొడుతున్న వర్షం.. జలమయమైన రోడ్లు..!
-
Vijay: విజయ్కు భారీ బూస్ట్.. టీవీకేలో చేరిన అన్నాడీఎంకే మాజీ మంత్రులు..
-
Cooking Oil: 850, 900 గ్రాముల ప్యాకింగ్కు బ్రేక్.. వంట నూనెల దోపిడీపై కేంద్రం సంచలన నిర్ణయం..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!