All Eyes On Rafah: అప్పుడు మీ అందరి కళ్లు ఎక్కడున్నాయి.. ‘‘ఆల్ ఐస్ ఆన్ రఫా’’పై ఇజ్రాయిల్ ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
All Eyes On Rafah: ఇజ్రాయిల్-గాజా మధ్య యుద్ధ తీవ్రత మరింత పెరిగింది. ఇటీవల దక్షిణ గాజాలోని రఫా నగరంలో ఇజ్రాయిల్ జరిపిన దాడిలో శరణార్థి శిబిరంలోని చిన్నారులతో పాటు కనీసం 45 మంది మరణించారు. ఈ దృశ్యాలు ప్రపంచాన్ని కదిలించాయి. దీంతో ప్రపంచంలోని ప్రముఖులు, క్రీడాకారులు మిలియన్ల సంఖ్యలో సోషల్ మీడియాలో ‘ఆల్ ఐస్ ఆన్ రఫా’’ అనే హ్యాష్ట్యాగ్ని ట్రెండ్ చేశారు. ఈ దాడి ఘటన అంతర్జాతీయంగా ఇజ్రాయిల్ని మరింత ఒంటరి చేసే ప్రయత్నం చేసింది. అమెరికా కూడా ఈ దాడి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
అయితే, దీనికి ప్రతిస్పందనగా ఇజ్రాయిల్ కూడా అంతే ధీటుగా స్పందించింది. రఫాపై కన్నీరు కారుస్తున్న వారంతా ఇజ్రాయిల్పై హమాస్ మిలిటెంట్లు దాడి చేసి, అభంశుభం తెలియని చిన్నారులను చంపినప్పుడు ఎక్కడున్నారంటూ ప్రశ్నించింది. దీనికి సంబంధించి ఓ సోషల్ మీడియా పోస్టుని ఇజ్రాయిల్ పంచుకుంది. గన్ పట్టుకున్న హమాస్ ఉగ్రవాది ముందు ఓ చిన్న పిల్లాడు ఉన్న ఫోటోని ట్వీట్ చేసింది. అక్టోబర్ 7 దాడిలో హమాస్ ఉగ్రవాదులు చేతిలో 1200 మంది మరణించడంతో పాటు 240 మందిని బందీలుగా గాజాలోకి పట్టుకెళ్లారు. ప్రస్తుతం ఉగ్రవాదుల చేలితో 99 మంది బందీలు సజీవంగా ఉన్నారని, 31 మంది మరణించారని ఇజ్రాయిల్ భావిస్తోంది.
Also Read
Read Also: PM Modi: 45 గంటల పాటు ధ్యానం చేసేందుకు సిద్దమవుతున్న ప్రధాని మోడీ.. వివరాలు ఇలా..
హమాస్ దాడి తర్వాత ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్పై విరుచుకుపడుతోంది. అయితే, ఉత్తరాన ఉన్న గాజా నగరాన్ని జల్లెడ పట్టినప్పటికీ అక్కడ ఇజ్రాయిల్ బందీలు లేకపోవడంతో, హమాస్కి మరో స్థావరంగా ఉన్న దక్షిణాన ఉన్న రఫాని టార్గెట్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన దాడిలో 45 మంది మరణించారు.
ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఎక్స్ వేదికగా, రఫాపై పోస్టు పెడుతున్న వారిని ఉద్దేశించి ట్వీట్ చేశారు. ‘‘ అక్టోబర్ 7న మీ కళ్లు ఎక్కడ ఉన్నాయి. మేమే అక్టోబర్ 7 గురించి మాట్లాడటం ఆపము, మేము బందీల కోసం పోరాటాన్ని ఎప్పటికీ ఆపము’’ అని ఆయన స్పష్టం చేశారు. దాదాపుగా 45 మిలియన్ల మంది యూజర్లు ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో ‘‘ ఆల్ ఐస్ ఆన్ రఫా’’ వైరల్ చేశారు. “ఆల్ ఐస్ ఆన్ రఫా” చిత్రాన్ని పోస్ట్ చేసిన భారతీయ ప్రముఖుల్లో కొందరు ప్రియాంక చోప్రా జోనాస్, అలియా భట్, కరీనా కపూర్ ఖాన్, మాధురీ దీక్షిత్ నేనే, వరుణ్ ధావన్ మరియు సమంతా రూత్ ప్రభు ఉన్నారు.
We will NEVER stop talking about October 7th.
We will NEVER stop fighting for the hostages. pic.twitter.com/XoFqAf1IjM
— Israel ישראל (@Israel) May 29, 2024
తాజావార్తలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
-
Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!