Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Violence Erupts In Karachi As Sindhudesh Demand Surges On Sindhi Culture Day

Pakistan: పాక్‌లో ప్రత్యేక ‘‘సింధుదేశ్’’ డిమాండ్.. మోడీ, యూఎన్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి

Published Date :December 9, 2025 , 8:11 pm
By Venu Goapl Reddy
  • పాకిస్తాన్‌లో ఊపందుకున్న వేర్పాటు ఉద్యమాలు..
  • ప్రత్యేక సింధ్‌దేశ్‌ కోసం ఉద్యమం..
  • కరాచీలో హింసాత్మక సంఘటనలు..
Pakistan: పాక్‌లో ప్రత్యేక ‘‘సింధుదేశ్’’ డిమాండ్.. మోడీ, యూఎన్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Pakistan: పాకిస్తాన్ వ్యాప్తంగా వేర్పాటు ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. ఒక్క పంజాబ్ మినహా బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా, సింధ్, ఆక్రమిత కాశ్మీర్, గిల్గిత్ బాల్టిస్తాన్ ఇలా పలు ప్రాంతాల్లో ప్రజలు పాక్ నుంచి స్వతంత్ర దేశంగా ఏర్పాటు కావాలనే డిమాండ్లు ఉన్నాయి. తాజాగా, సింధ్ ప్రావిన్సులో ప్రత్యేక ‘‘సింధుదేశ్’’ను డిమాండ్ చేస్తూ ప్రజలు నిరసలు చేశారు. కరాచీలో పెద్ద ఎత్తున హింసాత్మక సంఘటనలు నమోదయ్యాయి. రాళ్లదాడి, విధ్వంసం, పోలీసులతో తీవ్రమైన దాడి జరిగింది. సింధి సంస్కృతి దినోత్సవం నాడు నిరసనకారులు వీధుల్లోకి వచ్చిన తర్వాత ఆదివారం హింస ప్రారంభమైంది. జియే సింధ్ ముత్తహిదా మహాజ్ (JSSM) బ్యానర్ కింద సింధీల పెద్ద ఎత్తున స్వేచ్ఛ కావాలని, ‘‘పాకిస్తాన్ ముర్దాబాద్’’ నినాదాలు చేశారు. సింధ్ విముక్తి కోసం పిలుపునిచ్చారు.

సింధు నదికి సమీపంలో ఉన్న ఈ ప్రాంతంతో 1947 విభజనకు ముందు బాంబే ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేది. ఆ తర్వాత పాకిస్తాన్‌లో చేరింది. ఇప్పుడు ఈ ప్రాంతంలోని ప్రజలు, పాక్ పంజాబీల అణిచివేత, దోపిడీకి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తమకు స్వతంత్ర దేశం కోసం డిమాండ్ చేస్తున్నారు. ఆదివారం, నిరసనకారుల ఆందోళన హింసాత్మకంగా మారింది. దీంతో భద్రతా సిబ్బంది టియర్ గ్యాస్ ప్రయోగించింది. ఈ ఆందోళనకు సంబంధించి 45 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Also Read

  • Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
  • Pakistan Medicine Crisis: పిండి, గ్యాస్ తర్వాత పాకిస్తాన్‌లో మరో సంక్షోభం.. ప్రజల ప్రాణాలకు ముప్పు..
  • Bangladesh: బెంగాల్‌లో బీజేపీ గెలుపుతో సంతోషంలో బంగ్లాదేశ్ ప్రధాని.. కారణం ఇదే..
  • Project Freedom: అమెరికా, ఇరాన్‌ల మధ్య వివాదంలో కీలక మలుపు.. 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్'కు ట్రంప్ బ్రేక్
Add as a preferred
source on google

Read Also: Microsoft: భారత్‌లో మైక్రోసాఫ్ట్ రూ.1.5 లక్షల కోట్ల భారీ పెట్టుబడి.. పీఎం మోడీతో సత్య నాదెళ్ల భేటీ..

ఐక్యరాజ్యసమితి, ప్రధాని మోడీలకు విజ్ఞప్తి

చాలా కాలంగా ఈ ప్రాంతంలోని సింధీలపై రాజకీయ అణిచివేత, మానవహక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని ప్రజలు సింధుదేశ్‌ని డిమాండ్ చేస్తున్నారు. ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకుని సింధు దేశ్‌ను ప్రత్యేక దేశంగా గుర్తించాలని JSSM చైర్‌పర్సన్ షఫీ బర్ఫత్ అన్నారు. సింధ్, భారత్ మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను ఉటంకిస్తూ.. ప్రధాని నరేంద్రమోడీ కూడా తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. పాక్ భద్రతా బలగాలు సింధ్‌లో తీవ్రమైన మానవహక్కుల ఉల్లంఘనలకు పాల్పడ్డాయని, బలవంతపు అదృశ్యాలు, హింస, కార్యకర్తల్ని, జర్నలిస్టుల్ని చట్టవిరుద్ధంగా హత్య చేస్తున్నారని అక్కడి ప్రజలు చెబుతున్నారు.

1971 నాటి డిమాండ్

సింధ్ ప్రావిన్సు, భారతదేశంలో కలవాలని డిమాండ్ లేదు కానీ తమను స్వతంత్ర దేశంగా గుర్తించాలనే డిమాండ్ మాత్రం ఉంది. బ్రిటీష్ ఇండియాలో సింధ్ విలీనం కావడానికి ముందు సింధ్ ప్రత్యేక పరిపాలన ప్రాంతంగా ఉంది. 1936 వరకు బాంబే ప్రెసిడెన్సీలో భాగంగా ఉంది, ఆ తర్వాత భారత విభజన జరిగే 1947 వరకు ప్రత్యేక పరిపాలన ప్రాంతంగా ఉంది. విభజన తర్వాత ఇది పాకిస్తాన్ లో భాగమైంది. స్వతంత్ర దేశానికి మద్దతుగా జీఎం సయ్యద్, పిర్ అలీ మొహమ్మద్ రష్ది నాయకత్వంలో 1967లో ప్రత్యేక సింధ్ దేశ్ డిమాండ్ ప్రారంభమైంది. 1971లో బంగ్లాదేశ్ విముక్తి తర్వాత, ఈ ఉద్యమం మరింత ఊపందుకుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Karachi
  • Karachi violence
  • Pakistan
  • Pakistan human rights violations
  • Pakistan Sindh unrest

తాజావార్తలు

  • NBK 111 : రొమాంటిక్ సింహం.. బాలయ్యతో బాలీవుడ్ హీరోయిన్ ఐటం సాంగ్

  • TVK: కర్ణాటకలో కుదిరినప్పుడు.. తమిళనాడులో ఎందుకు కుదరదు.. గవర్నర్‌పై ఆగ్రహంతో టీవీకే కార్యకర్తలు..

  • Vaibhav Suryavanshi: అది బుడ్డోడి రేంజ్.. వైభవ్ సూర్యవంశీ కోసం వేలం వ్యూహాన్ని మార్చుకున్న రాజస్థాన్..!

  • Age Relaxation: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాలకు పదేళ్లు వయోపరిమితి పెంపు..?

  • Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions