Pakistan: పాక్లో ప్రత్యేక ‘‘సింధుదేశ్’’ డిమాండ్.. మోడీ, యూఎన్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి
- పాకిస్తాన్లో ఊపందుకున్న వేర్పాటు ఉద్యమాలు..
- ప్రత్యేక సింధ్దేశ్ కోసం ఉద్యమం..
- కరాచీలో హింసాత్మక సంఘటనలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ వ్యాప్తంగా వేర్పాటు ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. ఒక్క పంజాబ్ మినహా బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా, సింధ్, ఆక్రమిత కాశ్మీర్, గిల్గిత్ బాల్టిస్తాన్ ఇలా పలు ప్రాంతాల్లో ప్రజలు పాక్ నుంచి స్వతంత్ర దేశంగా ఏర్పాటు కావాలనే డిమాండ్లు ఉన్నాయి. తాజాగా, సింధ్ ప్రావిన్సులో ప్రత్యేక ‘‘సింధుదేశ్’’ను డిమాండ్ చేస్తూ ప్రజలు నిరసలు చేశారు. కరాచీలో పెద్ద ఎత్తున హింసాత్మక సంఘటనలు నమోదయ్యాయి. రాళ్లదాడి, విధ్వంసం, పోలీసులతో తీవ్రమైన దాడి జరిగింది. సింధి సంస్కృతి దినోత్సవం నాడు నిరసనకారులు వీధుల్లోకి వచ్చిన తర్వాత ఆదివారం హింస ప్రారంభమైంది. జియే సింధ్ ముత్తహిదా మహాజ్ (JSSM) బ్యానర్ కింద సింధీల పెద్ద ఎత్తున స్వేచ్ఛ కావాలని, ‘‘పాకిస్తాన్ ముర్దాబాద్’’ నినాదాలు చేశారు. సింధ్ విముక్తి కోసం పిలుపునిచ్చారు.
సింధు నదికి సమీపంలో ఉన్న ఈ ప్రాంతంతో 1947 విభజనకు ముందు బాంబే ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేది. ఆ తర్వాత పాకిస్తాన్లో చేరింది. ఇప్పుడు ఈ ప్రాంతంలోని ప్రజలు, పాక్ పంజాబీల అణిచివేత, దోపిడీకి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తమకు స్వతంత్ర దేశం కోసం డిమాండ్ చేస్తున్నారు. ఆదివారం, నిరసనకారుల ఆందోళన హింసాత్మకంగా మారింది. దీంతో భద్రతా సిబ్బంది టియర్ గ్యాస్ ప్రయోగించింది. ఈ ఆందోళనకు సంబంధించి 45 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read
- Iran Commander: ఇరాన్ కమాండర్ సంచలన ప్రకటన.. అమెరికా సైనికులను పట్టుకున్నా లేదా చంపినా 30,000 డాలర్ల బహుమతి
- Donald Trump: కిమ్ జోంగ్ ఉన్తో మంచి సంబంధాలు.. అమెరికా-దక్షిణ కొరియా సైనిక విన్యాసాలు తగ్గించాలని ట్రంప్ ఆదేశం
- Earthquake: ఇండోనేషియాలో వరసగా భారీ భూకంపాలు.. అసలు కారణాలేంటి.?
- Bangladesh: షేక్ హసీనాను అప్పగిస్తేనే భారత్ వస్తాడంట.. బంగ్లాదేశ్ ప్రధాని షరతు..
Read Also: Microsoft: భారత్లో మైక్రోసాఫ్ట్ రూ.1.5 లక్షల కోట్ల భారీ పెట్టుబడి.. పీఎం మోడీతో సత్య నాదెళ్ల భేటీ..
ఐక్యరాజ్యసమితి, ప్రధాని మోడీలకు విజ్ఞప్తి
చాలా కాలంగా ఈ ప్రాంతంలోని సింధీలపై రాజకీయ అణిచివేత, మానవహక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని ప్రజలు సింధుదేశ్ని డిమాండ్ చేస్తున్నారు. ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకుని సింధు దేశ్ను ప్రత్యేక దేశంగా గుర్తించాలని JSSM చైర్పర్సన్ షఫీ బర్ఫత్ అన్నారు. సింధ్, భారత్ మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను ఉటంకిస్తూ.. ప్రధాని నరేంద్రమోడీ కూడా తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. పాక్ భద్రతా బలగాలు సింధ్లో తీవ్రమైన మానవహక్కుల ఉల్లంఘనలకు పాల్పడ్డాయని, బలవంతపు అదృశ్యాలు, హింస, కార్యకర్తల్ని, జర్నలిస్టుల్ని చట్టవిరుద్ధంగా హత్య చేస్తున్నారని అక్కడి ప్రజలు చెబుతున్నారు.
1971 నాటి డిమాండ్
సింధ్ ప్రావిన్సు, భారతదేశంలో కలవాలని డిమాండ్ లేదు కానీ తమను స్వతంత్ర దేశంగా గుర్తించాలనే డిమాండ్ మాత్రం ఉంది. బ్రిటీష్ ఇండియాలో సింధ్ విలీనం కావడానికి ముందు సింధ్ ప్రత్యేక పరిపాలన ప్రాంతంగా ఉంది. 1936 వరకు బాంబే ప్రెసిడెన్సీలో భాగంగా ఉంది, ఆ తర్వాత భారత విభజన జరిగే 1947 వరకు ప్రత్యేక పరిపాలన ప్రాంతంగా ఉంది. విభజన తర్వాత ఇది పాకిస్తాన్ లో భాగమైంది. స్వతంత్ర దేశానికి మద్దతుగా జీఎం సయ్యద్, పిర్ అలీ మొహమ్మద్ రష్ది నాయకత్వంలో 1967లో ప్రత్యేక సింధ్ దేశ్ డిమాండ్ ప్రారంభమైంది. 1971లో బంగ్లాదేశ్ విముక్తి తర్వాత, ఈ ఉద్యమం మరింత ఊపందుకుంది.
తాజావార్తలు
-
Explainer: ఆంధ్రప్రదేశ్లో దారుణ పరిస్థితులు..వర్షపు నీరు లేక రైతుల కంట కన్నీరు.. దేశంలోనే టాప్!
-
Mahesh Babu : ‘డీసీ’ చిత్రంపై సూపర్ స్టార్ మహేశ్ బాబు ట్వీట్.. ఒరిజినల్ అండ్ అవుట్స్టాండింగ్
-
AP Assembly Sessions: నేటి నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు.. తొలి రోజు కీలక బిల్లులు, ఎల్నినోపై చర్చ!
-
Bihar Temple Stampede: బిహార్ ఆలయంలో విషాదం.. అశోక్ధామ్ ఆలయంలో తొక్కిసలాట, ఏడుగురు భక్తులు మృతి
-
Jasmin Bhasin: స్టంట్ చేస్తూ జ్ఞాపకశక్తి కోల్పోయిన నటి.. బిత్తరపోయిన షో నిర్వాహకులు!
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?