Red Sea: 10 మంది ఇరాన్-మద్దతు హౌతీలను హతమార్చిన అమెరికా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Red Sea: ప్రపంచ నౌకా వాణిజ్యానికి ఎంతో కీలకమైన ఎర్ర సముద్రం రణరంగాన్ని తలపిస్తోంది. ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో హమాస్ మిలిటెంట్లకు మద్దతుగా యెమెన్ లోని హౌతీ తిరుగుబాటుదారులు వాణిజ్య నౌకలపై దాడులకు తెగబడుతున్నారు. ఇజ్రాయిల్ ఆర్థిక వ్యవస్థను పతనం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇజ్రాయిల్ నుంచి వచ్చే నౌకలతో పాటు, రెడ్ సీలో ఇతర దేశాలకు చెందిన నౌకలపై కూడా రాకెట్లు, డ్రోన్లతో దాడులకు తెగబడుతున్నారు.
ఇదిలా ఉంటే ఆదివారం డెన్మార్క్కి చెందిన ఓ కంటైనర్ షిప్పై హౌతీ రెబల్స్ దాడులు చేశారు. వెంటనే ఈ ప్రాంతంలో గస్తీ కాస్తున్న అమెరికా నేవీ తన హెలికాప్టర్లో హైతీలు ఉన్న బోట్లపై దాడులు జరిపి, నాలుగు బోట్లలో మూడు బోట్లను సముద్రంలో ముంచేసినట్లు అమెరికా కమాండ్ కంట్రోల్ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఈ దాడుల్లో 10 మంది హౌతీలను అమెరికా నేవీ హతమార్చినట్లు యెమెన్ లోని హైడైడా పోర్టులోని రెండు సోర్సెస్ తెలిపాయి.
Also Read
- US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన కుటుంబం మృతి
- Russia: పుతిన్ దేశంలో పెట్రోల్ బంకులు ఖాళీ! రష్యాకు పెట్రోల్ అమ్ముతున్న భారత్..
- Iran - Israel: ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ గురి.. ట్రంప్ వార్నింగ్ను నెతన్యాహు బ్రేక్ చేస్తారా?
- Russian Couple: ప్రేమ కోసం ప్రాణాలనే పణంగా పెట్టిన జంట.. 1,454 అడుగుల ఎత్తులో ప్రపోజ్!
Read Also: Vladimir Putin: “వెనక్కి తగ్గేదే లేదు”.. పుతిన్ న్యూ ఇయర్ ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు..
అమెరికా దాడి తర్వాత గాయపడిన హౌతీలను రెస్క్యూ చేసినట్లు కొందరు తెలుపగా.. మరో నలుగురు ప్రాణాలతో ఉన్నారని యెమెన్ వర్గాలు తెలిపాయి. అయితే అమెరికా నేవీ దాడిలో 10 మంది హౌతీ తిరుగుబాటుదారులు మరణించగా.. ఇద్దరు గాయపడినట్లు తెలుస్తోంది.
ఆదివారం రోజు సింగపూర్ ఫ్లాగ్ తో డెన్మార్క్కి చెందిన కంటైనర్ షిప్ మార్క్స్ హాంగ్జౌ నుంచి తాము దాడికి గురవుతున్నట్లు సందేశం వెళ్లింది. వెంటనే ఆ ప్రాంతంలో ఉన్న అమెరికన్ నేవీ స్పందించి, హౌతీలపై కాల్పులు జరిపింది. కంటైనర్ షిప్కి 20 మీటర్ల దూరంలో ఉన్న నాలుగు చిన్న పడవల్లో మూడింటిపై దాడి చేసి ముంచేయగా.. నాలుగో పడవ తప్పించుకున్నట్లు యూఎస్ నేవీ చెప్పింది.
తాజావార్తలు
-
CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
-
Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
-
Telangana Police : మాజీ డీజీపీలకు షాక్.. బుల్లెట్ప్రూఫ్ కార్లు వెనక్కి.!
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!