US Tariffs: 2 నెలల్లో భారత్ క్షమాపణలు చెబుతుంది.. అమెరికా అధికారి ప్రేలాపనలు
- 2 నెలల్లో భారత్ క్షమాపణలు చెబుతుంది
- వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ ప్రేలాపనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సుంకాలు కారణంగా భారత్-అమెరికా మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ప్రస్తుతం సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో అమెరికా అధికారులు మరింత ఆజ్యం పోస్తున్నారు. పుండి మీద కారం చల్లినట్లుగా రెచ్చగొట్టే ప్రేలాపనలు చేస్తున్నారు. ఇప్పటికే ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో ఇష్టానురీతిగా మాట్లాడుతుంటుంటే.. ఈయనకు మరో అమెరికా అధికారి తోడయ్యారు. వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ కూడా భారత్పై పరుష వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: Honeymoon Murder Case: సోనమ్కు షాక్.. ఎన్ని పేజీల ఛార్జిషీట్ దాఖలు చేశారంటే..!
Also Read
- Donald Trump: ట్రంప్ గోల్ఫ్ కోర్స్ సమీపంలో లోడెడ్ గన్తో వ్యక్తి అరెస్ట్.. మరో హత్యాయత్నం కుట్రపై అనుమానాలు?
- India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
- Country Name Changed: తమ దేశం పేరు మార్చుకున్న ‘నౌరు’.. కొత్త పేరు ఇదే..
- US-Iran: హార్ముజ్ తెరుచుకుంటుందా? అమెరికా కీలక ప్రకటన
బ్లూమ్బెర్గ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ టారిఫ్లపై హోవార్డ్ లుట్నిక్ మాట్లాడుతూ.. భారత్ ఒక నెల లేదా రెండు నెలల్లో భారతదేశం.. అమెరికాకు క్షమాపణ చెబుతుందని వ్యాఖ్యానించారు. భారతదేశమే చర్చలకు దిగొస్తుందని పేర్కొన్నారు.
రష్యా దగ్గర చైనా, యూరోపియన్ దేశాలు చమురు కొనుగోలు చేస్తుంటే.. భారత్పైనే ఎందుకు ఎక్కువ టారిఫ్ వేశారని ప్రశ్నించగా.. ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి ముందు భారత్.. 2 శాతమే రష్యా దగ్గర చమురు కొనుగోలు చేసేదని.. ఇప్పుడు 40 శాతం కొనుగోలు చేస్తుందని చెప్పుకొచ్చారు. దీంతో రష్యాకు బాగా డబ్బు వస్తుందని.. అందుకే రష్యా శాంతి ఒప్పందానికి రావడం లేదని లుట్నిక్ వివరించారు.
ఇది కూడా చదవండి: Imran Khan: జైలు దగ్గర ఇమ్రాన్ఖాన్ సోదరిపై కోడిగుడ్డు దాడి.. వీడియో వైరల్
ఒక విషయం ఏంటంటే చైనీయులు.. భారతీయులు మనకు అమ్ముతారు.. కానీ వారు మాత్రం ఒకరికొకరు అమ్ముకోరని తెలిపారు. కస్టమర్ ఎల్లప్పుడూ సరైనవాడని మనందరికీ తెలుసు.. అందుకే ఎప్పటికైనా భారత్.. యూఎస్ మార్కెట్కు తిరిగి రావాల్సి ఉంటుందని తేల్చిచెప్పారు. అందుకే రెండు నెలల్లో భారత్ క్షమాపణ చెప్పి.. ట్రంప్తో ఒప్పందాలు చేసుకుంటారని చెప్పుకొచ్చారు. ఒకవేళ చర్చలకు రాకపోతే మాత్రం 50 శాతం సుంకం భరించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇదిలా ఉంటే రష్యా దగ్గరే చమురు కొనుగోలు చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తేల్చి చెప్పేశారు.
Lutnick to #India: Drop Dead
Moments ago on @business: pic.twitter.com/Xik8HsaghM— Joel Lawson (@JoelLawsonDC) September 5, 2025
తాజావార్తలు
-
Tollywood: ఫేక్ హౌస్ఫుల్స్… డమ్మీ కలెక్షన్స్! టాలీవుడ్లో కొత్త “మైండ్ గేమ్”!
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు కేంద్రం సిద్ధం.. ఆగస్టు 17న ప్రత్యేక పార్లమెంట్ సమావేశం.?
-
Plastic Currency Notes: ఆర్బీఐ కీలక నిర్ణయం.. మార్కెట్లోకి ప్లాస్టిక్ రూ.10, రూ.20 నోట్లు..! మరి పాత నోట్ల పరిస్థితి ఏంటి..?
-
Modi-Meta: మెటాకు కేంద్రం 3 రోజులు డెడ్లైన్.. క్షమాపణ చెప్పకుంటే..!
-
Buchi Babu: డైరెక్టర్ నుంచి నిర్మాతగా ‘పెద్ది’ దర్శకుడు.. కొత్త హీరోను పరిచయం చేసే ప్లాన్?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!