Honeymoon Murder Case: సోనమ్కు షాక్.. ఎన్ని పేజీల ఛార్జిషీట్ దాఖలు చేశారంటే..!
- హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్కు షాక్
- నిందితులపై ఛార్జిషీట్ దాఖలు చేసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన హనీమూన్ మర్డర్ కేసు అందరికీ గుర్తుండే ఉంటుంది. అంత తర్వగా మరిచిపోయే కేసే కాదు. యావత్తు దేశాన్నే కలవరపాటుకు గురి చేసిన కేసు ఇది. తాజాగా ఈ కేసులో 790 పేజీల ఛార్జిషీట్ను సోహ్రా సబ్-డివిజన్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టులో సమర్పించారు. ఈ మేరకు మేఘాలయ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇండోర్కు చెందిన వ్యాపారవేత్త రాజా రఘువంశీ హత్యకు భార్య సోనమ్ రఘువంశీ, ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహా.. మరో ముగ్గురిపై హత్య అభియోగాలు మోపింది. మొత్తం ఛార్జిషీట్లో ఐదుగురు పేర్లను చేర్చారు. సోనమ్, రాజ్ కుష్వాహాతో పాటు ఆకాష్ రాజ్పుత్, ఆనంద్ కుర్మి, విశాల్ సింగ్ చౌహాన్లపై అభియోగాలు మోపారు. నిందితులందరిపై భారతీయ న్యాయ సంహిత కింద సెక్షన్ 103 (I) హత్య, 238 (a) నేరానికి సంబంధించిన సాక్ష్యాలను అదృశ్యం చేయడం, 61 (2) నేరపూరిత కుట్ర కింద అభియోగాలు మోపారు. ఈ కేసును మేఘాలయ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణ చేసింది.
ఇది కూడా చదవండి: Trump: మోడీ ఎప్పుడూ మంచి స్నేహితుడే.. గంటకో మాట మాట్లాడుతున్న ట్రంప్
Also Read
ఇక సాక్ష్యాలను ధ్వంసం చేయడం, దాచడం వంటి ఆరోపణలపై అరెస్టయిన జేమ్స్, తోమర్, అహిర్బార్ ప్రస్తుతం బెయిల్పై ఉన్నారు. అదనపు ఫోరెన్సిక్ నివేదికలు వెలువడిన తర్వాత మరో ముగ్గురు సహ నిందితులపై అనుబంధ చార్జిషీట్ సమర్పించబడుతుందని తూర్పు ఖాసీ హిల్స్ పోలీసు సూపరింటెండెంట్ వివేక్ సయీమ్ తెలిపారు. ఆస్తి డీలర్ సిలోమ్ జేమ్స్, నేరం చేసిన తర్వాత సోనమ్ దాక్కున్న భవనం యజమాని లోకేంద్ర తోమర్, ఆ ప్రాంత సెక్యూరిటీ గార్డు బల్బీర్ అహిర్బార్పై కూడా దాఖలు చేస్తామని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Imran Khan: జైలు దగ్గర ఇమ్రాన్ఖాన్ సోదరిపై కోడిగుడ్డు దాడి.. వీడియో వైరల్
యూపీకి చెందిన సోనమ్ రఘువంశీ-ఇండోర్కు చెందిన రాజా రఘువంశీకి మే 11, 2025న వివాహం జరిగింది. వివాహం అనంతరం హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లారు. మే 23న జంట అదృశ్యమయ్యారంటూ కలకలం రేపింది. మేఘాలయ పోలీసులు సీరియస్గా తీసుకుని దర్యాప్తు చేపట్టారు. జూన్ 2న కొండల్లో రాజా మృతదేహం లభించింది. రాజా హత్యకు గురైనట్లు నిర్ధారించారు. ఇక సోనమ్ ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులకు అనుమానం బలపడింది. ఏదో జరిగిందని దర్యాప్తు కొనసాగిస్తుండగా జూన్ 8న యూపీలో సోనమ్ ప్రత్యక్షమైంది. ప్రియుడు రాజ్ కుష్వాహా.. మరో ముగ్గురి సాయంతో భర్తను చంపేనట్లుగా సోనమ్ తెలిపింది. దీంతో యావత్తు దేశమంతా ఉలిక్కిపాటుకు గురైంది. అనంతరం నిందితులను జైలుకు తరలించారు.
ఈ ఘటన తర్వాత సోనమ్ సోదరుడు గోవింద్.. బాధిత కుటుంబానికి అండగా నిలిచాడు. సోనమ్తో అన్ని రకాల బంధాలను తెంచుకున్నట్లు ప్రకటించారు. రాజా కుటుంబానికి తోడుగా ఉంటామని వెల్లడించారు. అత్తింటి వారి సొత్తు తిరిగి ఇచ్చేశాడు. ప్రస్తుతం ఈ హత్యపై ఓ దర్శకుడు సినిమా కూడా తీస్తున్నాడు. త్వరలోనే థియేటర్లోకి రానుంది.
Raja Raghuvanshi murder case | A 790-page chargesheet against the five arrested accused, along with substantial material evidence and enclosures, filed in the court of the Judicial Magistrate 1st Class, Sohra Sub-division Court in Shillong, Meghalaya. pic.twitter.com/8w2J8blxSg
— ANI (@ANI) September 6, 2025
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!