Ukraine Crisis Ukraine Crisis: దారుణం.. సమాధులు తవ్వుతున్న ప్రజలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉక్రెయిన్ -రష్యా యుద్ధం తీవ్ర దశలో వేలాదిమంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.. అక్కడి ప్రజలకు ఎప్పుడు ఎక్కడినుంచి ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని ఆ భయానక పరిస్థితుల్లో, అనేక మంది తమవారికి సక్రమంగా తుది వీడ్కోలు పలకలేని నిస్సహాయ స్థితిలో మిగిలిపోయారు. ఈనేపథ్యంలో.. ప్రస్తుతం పరిస్థితులు కాస్త మెరుగుపడటం వల్ల లుహాన్స్క్ రీజియన్లోని రూబిజ్నే పట్టణ ప్రజలు యుద్ధం తారస్థాయిలో ఉన్నప్పుడు హడావుడిగా మృతదేహాలను ఖననం చేయించారు. ఇప్పుడు ఆ మృతదేహాలను వెలికితీస్తున్నారట. ఆ మృతదేహాలను మళ్లీ వాటికి గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే.. అక్కడ దాదాపు 50 వేల జనాభా ఉన్న ఈ పట్టణం ప్రస్తుతం రష్యా మద్దతుకలిగిన లుహాన్స్క్ పీపుల్స్ రిపబ్లిక్ (ఎల్పీఆర్) ఆధీనంలో ఉంది.
ఉక్రెయిన్ -రష్యా యుద్ధ సమయంలో ధ్వంసమైన ఓ అపార్ట్మెంట్ బ్లాక్ వెలుపల ఇటీవల ఓ కందకాన్ని (గుంతను) తిరిగి తవ్వారు. దానిలోంచి ఆరు మృతదేహాలను వెలికితీశారు. దీంతో లిలియా అనే స్థానికురాలు తన తల్లి మృతదేహానికి చుట్టిన దుప్పటి ఆధారంగా ఆమెను గుర్తుపట్టారు. యుద్ధ దాడుల సమయంలో 10 రోజులపాటు తన తల్లిదండ్రుల అపార్ట్మెంట్కు చేరుకోలేకపోయానని, ఆమె అప్పటికే మరణానికి చేరువైందని, చేతులు నీలి రంగులోకి మారాయని, ముఖం వాడిపోయిందని, మరుసటి రోజే ఆమె మరణించిందని ఆమె కన్నీరుపెట్టుకున్నారు. ఈనేపథ్యంలో.. ఎడతెగని దాడులతో అంత్యక్రియలు సరిగ్గా నిర్వహించలేని దుస్థితి ఏర్పడిందని భావోద్వేగానికి గురైంది. ఆపరిస్థితుల్లోనే తన తల్లి మృతదేహాన్ని బహిరంగ కందకంలో ఖననం చేయాల్సి వచ్చిందని తెలిపారు. అయితే.. ఇప్పుడు ఆమె మృతదేహాన్ని శ్మశానవాటికలో పూడ్చుతాఅని వివరించారు.
Also Read
- Iran: పాక్, టర్కీతో ఒప్పందాలు రక్షించలేవు.. సౌదీకి ఇరాన్ వార్నింగ్..
- Trump: యుద్ధంపై ట్రంప్ మరోసారి కీలక ప్రకటన.. ఇరాన్ రియాక్షన్ ఇదే!
- Bangladesh: బంగ్లాదేశ్లో సంచలనం.. అవామీలీగ్ విలీనానికి BNP ఎంపీ పిలుపు
- Sheikh Hasina: షేక్ హసీనా వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు.. బంగ్లాదేశ్కు స్పష్టం చేసిన భారత్..
దీంతో తూర్పు ఉక్రెయిన్లో రష్యా మద్దతుగల లుహాన్స్క్ పీపుల్స్ రిపబ్లిక్ ప్రస్తుతం మృతదేహాల వెలికితీత ప్రక్రియ కొనసాగుతుంది. ఈసందర్భంగా.. ఎల్పీఆర్ అధికారి అన్నా సోరోకినా మాట్లాడుతూ ఇటీవల ఒక బృందం రూబిజ్నేలో 10 రోజుల వ్యవధిలో 104 మృతదేహాలను వెలికితీసినట్లు, ఇలా నగరంలో దాదాపు 500 వరకు సామూహిక సమాధులు ఉన్నట్లు అంచనా వేశారు. కాగా.. ఇప్పటివరకు బయటపడిన మృతదేహాలకు చాలావరకు క్షిపణి.. బాంబు దాడుల గాయాలున్నాయని తెలిపారు. కొన్నింటికి బుల్లెట్ గాయాలు కూడా ఉన్నాయని, మరొకొన్ని గుర్తుతెలియని మృతదేహాలను గుర్తించేందుకు డీఎన్ఏ నమూనాలు సేకరిస్తున్నట్లు అన్నా సోరోకినా వెల్లడించారు.
Vijayendra Prasad: ‘బాహుబలి’ రచయితనే స్టార్ హీరోలు పక్కన పెట్టేస్తున్నారట..?
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!