Ukraine Crisis Ukraine Crisis: దారుణం.. సమాధులు తవ్వుతున్న ప్రజలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉక్రెయిన్ -రష్యా యుద్ధం తీవ్ర దశలో వేలాదిమంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.. అక్కడి ప్రజలకు ఎప్పుడు ఎక్కడినుంచి ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని ఆ భయానక పరిస్థితుల్లో, అనేక మంది తమవారికి సక్రమంగా తుది వీడ్కోలు పలకలేని నిస్సహాయ స్థితిలో మిగిలిపోయారు. ఈనేపథ్యంలో.. ప్రస్తుతం పరిస్థితులు కాస్త మెరుగుపడటం వల్ల లుహాన్స్క్ రీజియన్లోని రూబిజ్నే పట్టణ ప్రజలు యుద్ధం తారస్థాయిలో ఉన్నప్పుడు హడావుడిగా మృతదేహాలను ఖననం చేయించారు. ఇప్పుడు ఆ మృతదేహాలను వెలికితీస్తున్నారట. ఆ మృతదేహాలను మళ్లీ వాటికి గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే.. అక్కడ దాదాపు 50 వేల జనాభా ఉన్న ఈ పట్టణం ప్రస్తుతం రష్యా మద్దతుకలిగిన లుహాన్స్క్ పీపుల్స్ రిపబ్లిక్ (ఎల్పీఆర్) ఆధీనంలో ఉంది.
ఉక్రెయిన్ -రష్యా యుద్ధ సమయంలో ధ్వంసమైన ఓ అపార్ట్మెంట్ బ్లాక్ వెలుపల ఇటీవల ఓ కందకాన్ని (గుంతను) తిరిగి తవ్వారు. దానిలోంచి ఆరు మృతదేహాలను వెలికితీశారు. దీంతో లిలియా అనే స్థానికురాలు తన తల్లి మృతదేహానికి చుట్టిన దుప్పటి ఆధారంగా ఆమెను గుర్తుపట్టారు. యుద్ధ దాడుల సమయంలో 10 రోజులపాటు తన తల్లిదండ్రుల అపార్ట్మెంట్కు చేరుకోలేకపోయానని, ఆమె అప్పటికే మరణానికి చేరువైందని, చేతులు నీలి రంగులోకి మారాయని, ముఖం వాడిపోయిందని, మరుసటి రోజే ఆమె మరణించిందని ఆమె కన్నీరుపెట్టుకున్నారు. ఈనేపథ్యంలో.. ఎడతెగని దాడులతో అంత్యక్రియలు సరిగ్గా నిర్వహించలేని దుస్థితి ఏర్పడిందని భావోద్వేగానికి గురైంది. ఆపరిస్థితుల్లోనే తన తల్లి మృతదేహాన్ని బహిరంగ కందకంలో ఖననం చేయాల్సి వచ్చిందని తెలిపారు. అయితే.. ఇప్పుడు ఆమె మృతదేహాన్ని శ్మశానవాటికలో పూడ్చుతాఅని వివరించారు.
Also Read
- Explainer: చరిత్రలోనే అత్యంత క్రూరమైన ఉగ్రవాద దాడి..41ఏళ్ల తర్వాత బయటపడ్డ కనిష్క విమాన పేలుడు నిజం!
- Earthquake Threat: భారత్కు భూకంప అలర్ట్.. సైంటిస్టుల పరిశోధనలో ఏం తేలింది?
- Shoaib Akhtar: ఉగ్రవాదులతో క్రికెటర్కి సంబంధం ఏంటి? అదీ 26/11 ముంబై, పహల్గామ్ దాడుల సూత్రధారుతో..
- Donald Trump: భారత్ పర్యటనకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. ఎప్పుడంటే..?
దీంతో తూర్పు ఉక్రెయిన్లో రష్యా మద్దతుగల లుహాన్స్క్ పీపుల్స్ రిపబ్లిక్ ప్రస్తుతం మృతదేహాల వెలికితీత ప్రక్రియ కొనసాగుతుంది. ఈసందర్భంగా.. ఎల్పీఆర్ అధికారి అన్నా సోరోకినా మాట్లాడుతూ ఇటీవల ఒక బృందం రూబిజ్నేలో 10 రోజుల వ్యవధిలో 104 మృతదేహాలను వెలికితీసినట్లు, ఇలా నగరంలో దాదాపు 500 వరకు సామూహిక సమాధులు ఉన్నట్లు అంచనా వేశారు. కాగా.. ఇప్పటివరకు బయటపడిన మృతదేహాలకు చాలావరకు క్షిపణి.. బాంబు దాడుల గాయాలున్నాయని తెలిపారు. కొన్నింటికి బుల్లెట్ గాయాలు కూడా ఉన్నాయని, మరొకొన్ని గుర్తుతెలియని మృతదేహాలను గుర్తించేందుకు డీఎన్ఏ నమూనాలు సేకరిస్తున్నట్లు అన్నా సోరోకినా వెల్లడించారు.
Vijayendra Prasad: ‘బాహుబలి’ రచయితనే స్టార్ హీరోలు పక్కన పెట్టేస్తున్నారట..?
తాజావార్తలు
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Pawan Kalyan: సంక్షేమ పథకాలపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. దానికి వైసీపీనే ఉదాహరణ..!
-
Wedding Rumours: హార్దిక్ పాండ్యా రహస్యంగా పెళ్లి చేసుకున్నాడా? వైరల్ ఫోటోపై నిజమేంటి?
-
Harish Rao: కర్ణాటకలో ముగ్గురు సీఎంల చీకటి ఒప్పందాలేంటి? భేటీపై హరీష్రావు ఫైర్..
-
Prithviraj Sukumaran: మోహన్లాల్ను తాతను చేసిన పృథ్వీరాజ్.. అసలు కథ ఇదే!
ట్రెండింగ్
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..