US: మరో డ్రగ్స్ నౌకను పేల్చేసిన అమెరికా.. ముగ్గురు చనిపోయినట్లు ట్రంప్ ప్రకటన
- మరో డ్రగ్స్ నౌకను పేల్చేసిన అమెరికా
- ముగ్గురు చనిపోయినట్లు ట్రంప్ ప్రకటన
- ఈనెలలో 3 నౌకలను పేల్చేసిన అమెరికా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై అమెరికా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. సముద్రం ద్వారా దేశంలోకి ప్రవేశించే డ్రగ్స్పై అమెరికా వేట సాగిస్తోంది. తాజా దాడిలో ముగ్గురు చనిపోయినట్లు ట్రంప్ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా విడుదల చేశారు. వీడియోలో వేగంగా దూసుకుపోతున్న బోటుపై ఒక్కసారిగా బాంబ్ దాడి జరగడంతో ధ్వంసమైంది.
ఇది కూడా చదవండి: Tejashwi Yadav: ఆ పరిస్థితి వస్తే ఎన్నికల్లో పోటీ చేయను.. తేజస్వి యాదవ్ హెచ్చరిక
Also Read
- Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
- Vladimir Putin: "మోడీపై ఒత్తిడి తేవడం ఎవరి తరం కాదు".. భారత్కు రష్యా అధ్యక్షుడు పుతిన్ గట్టి మద్దతు
- Donald Trump: మోడీ నాకు మంచి స్నేహితుడు.. భారత్తో త్వరలో వాణిజ్య ఒప్పందం..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
అమెరికాలోకి మాదకద్రవ్యాల ప్రవేశించకుండా అరికట్టేందుకు ట్రంప్ ప్రభుత్వం ప్రత్యేకంగా సైన్యాన్ని నియమించింది. ఇందులో భాగంగానే ఇప్పటికే వెనిజులా నుంచి వచ్చిన రెండు బోట్లను అమెరికా సైన్యం పేల్చేసింది. సెప్టెంబర్ 2న జరిపిన దాడిలో 11 మంది మరణించారు. ట్రెన్ డి అరగువా ముఠా ఈ పడవను నడుపుతోందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ వారం ప్రారంభంలో కూడా ఒక బోటును పేల్చడంతో ముగ్గురు చనిపోయారు.
ఇది కూడా చదవండి: H 1B Visa Fees: భారతీయులపై ట్రంప్ పిడుగు.. H-1B వీసా కొత్త దరఖాస్తులకు రూ. 88 లక్షలు
మాదకద్రవ్యాల అక్రమ రవాణా పడవపై అమెరికా జరిపిన తాజా దాడిలో ముగ్గురు మరణించారని ట్రంప్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ‘‘నౌక అక్రమ మాదకద్రవ్యాలను రవాణా చేస్తోందని, అమెరికన్లకు విషం ఇవ్వడానికి మాదకద్రవ్యాల అక్రమ రవాణా జరుగుతోందని నిఘా వర్గాలు నిర్ధారించాయి.’’ అని ట్రంప్ పేర్కొన్నారు. ఈనెలలో 3 ప్రాణాంతక దాడులు జరిగినట్లు ట్రంప్ చెప్పుకొచ్చారు. అయితే తాజా దాడి ఎక్కడ జరిగిందో మాత్రం కచ్చితమైన సమాచారం ఇవ్వలేదు. వైట్హౌస్ కూడా స్పష్టత ఇవ్వలేదు.
అయితే వెనిజులాలో అధ్యక్షుడు నికోలస్ మదురోను పడగొట్టే ప్రయత్నంలో భాగంగా ఈ దాడులు జరుగుతున్నాయని కొందరు ఊహాగానాలు చేస్తున్నారు. అయితే ఉద్దేశ పూర్వకంగానే దాడులు జరుగుతున్నాయని వెనిజులా ఆరోపిస్తోంది. నౌకలో ఉన్నది ఎవరో నిర్ధారించకుండానే ఎలా దాడులు చేస్తారంటూ ఆరోపించింది. బెదిరిపులు, పాలన మార్పు కోసమే అమెరికా ఈ చర్యలకు పాల్పడుతోందని పేర్కొంది.
ON VIDEO: U.S. Military Forces conducted a strike against a designated terrorist organization engaged in narcotrafficking. Intelligence confirmed the vessel was trafficking illicit narcotics and was en route to poison Americans. The strike killed three male narcoterrorists. pic.twitter.com/wjxRRMrxwB
— The White House (@WhiteHouse) September 20, 2025
తాజావార్తలు
-
INDIA alliance: INDIA కూటమికి వరుస షాకులు.. డీఎంకే తర్వాత ఉద్ధవ్ సేన కూడా దూరం?
-
Bolla Brahmanayudu : గండిపేట భూముల స్కామ్లో బిగ్ ట్విస్ట్.. ప్రధాన నిందితుడు బ్రహ్మనాయుడు అరెస్ట్!
-
Defence Powers: సైన్యాధిపతులకు భారీగా ఆర్థిక అధికారాలు.. ఎంత వరకు ఖర్చు చేయొచ్చంటే..!
-
AP Govt: ఏటా రూ.28,000 కోట్ల ఎగుమతులు.. ఆక్వా రంగంలో ఏపీ నయా రికార్డ్..
-
Su-57 fighter jet: భారత్కు పుతిన్ బిగ్ ఆఫర్.. Su-57 స్టెల్త్ ఫైటర్పై కీలక ప్రతిపాదన..
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!