Tejashwi Yadav: ఆ పరిస్థితి వస్తే ఎన్నికల్లో పోటీ చేయను.. తేజస్వి యాదవ్ హెచ్చరిక
- ఆ పరిస్థితి వస్తే ఎన్నికల్లో పోటీ చేయను
- ముఖ్యమంత్రి అభ్యర్థిపై తేజస్వి యాదవ్ హెచ్చరిక
ముఖ్యమంత్రి అభ్యర్థి లేకుండా ఇండియా కూటమి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయదని ఆర్జేడీ నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ తేల్చి చెప్పారు. ఒక జాతీయ మీడియాకు తేజస్వి యాదవ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ముఖం లేకుండా కూటమి ఎన్నికల్లో పోటీ చేయడమేంటి? అని ప్రశ్నించారు. అయినా ముఖాలు లేని బీజేపీ వాళ్లమా? ముఖ్యమంత్రి అభ్యర్థి లేకుండా ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తామంటూ పేర్కొన్నారు. గత నెలలో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ ఓటర్ అధికార్ యాత్ర చేపట్టారు. దానికి అనుబంధంగా.. రాహుల్గాంధీ తిరగని ప్రాంతాల్లో తేజస్వి యాదవ్ యాత్ర కొనసాగిస్తున్నారు.
ఇది కూడా చదవండి: H 1B Visa Fees: భారతీయులపై ట్రంప్ పిడుగు.. H-1B వీసా కొత్త దరఖాస్తులకు రూ. 88 లక్షలు
Also Read
- Pune: పెళ్లి కోసం యువకుడి ఆరాటం.. ఏకంగా పోలీస్ శాఖలో ఉద్యోగం వచ్చినట్లు పోస్టర్లతో ప్రచారం..
- Earthquake: గుజరాత్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
- PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
- Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. 'మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం'.. అంటూ ఆగ్రహం!
ఆ మధ్య కాలంలో రాహుల్ గాంధీ-తేజస్వి యాదవ్ కలిసి ప్రెస్మీట్ నిర్వహించారు. ఆ సందర్భంగా తేజస్వి యాదవ్.. వచ్చే ఎన్నికల్లో రాహుల్గాంధీని ప్రధాని అభ్యర్థిగా నిలబెట్టి ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. కానీ రాహుల్గాంధీ మాత్రం.. తేజస్వి యాదవ్ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి అని మాత్రం ప్రకటించలేదు. నోరు మెదపలేదు. ఈ అంశంపై మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. ‘‘కొంచెం ఆగండి.. ముఖ్యమంత్రిని నిర్ణయించేది ప్రజలే. ముఖ్యమంత్రి లేదా ప్రభుత్వం ఉండటం ప్రధానం కాదు. మనం బీహార్ను నిర్మించాలి.’’ అని తేజస్వి యాదవ్ కవర్ చేశారు. సీట్ల పంపకం పూర్తయ్యాక ఈ సమస్యను కూడా పరిష్కరించుకుంటామని.. ముఖ్యమంత్రి అభ్యర్థి లేకుండా మాత్రం తాను పోటీ చేయబోనని నొక్కి చెప్పారు.
ఇది కూడా చదవండి: Poker Players: ఒరేయ్ ఆజాము లగెత్తరోయ్.. చెట్ల పొదల్లో పేకాటరాయుళ్లు.. డ్రోన్ ను చూసి..
త్వరలో బీహార్ ఎన్నికల షెడ్యూల్ రానుంది. వచ్చే నెలలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇందుకోసం ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. 2-3 దశల్లో పోలింగ్ జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీపావళి నాటికి మాత్రం ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి.
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?