US: మరో డ్రగ్స్ నౌకను పేల్చేసిన అమెరికా.. ముగ్గురు చనిపోయినట్లు ట్రంప్ ప్రకటన
- మరో డ్రగ్స్ నౌకను పేల్చేసిన అమెరికా
- ముగ్గురు చనిపోయినట్లు ట్రంప్ ప్రకటన
- ఈనెలలో 3 నౌకలను పేల్చేసిన అమెరికా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై అమెరికా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. సముద్రం ద్వారా దేశంలోకి ప్రవేశించే డ్రగ్స్పై అమెరికా వేట సాగిస్తోంది. తాజా దాడిలో ముగ్గురు చనిపోయినట్లు ట్రంప్ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా విడుదల చేశారు. వీడియోలో వేగంగా దూసుకుపోతున్న బోటుపై ఒక్కసారిగా బాంబ్ దాడి జరగడంతో ధ్వంసమైంది.
ఇది కూడా చదవండి: Tejashwi Yadav: ఆ పరిస్థితి వస్తే ఎన్నికల్లో పోటీ చేయను.. తేజస్వి యాదవ్ హెచ్చరిక
Also Read
అమెరికాలోకి మాదకద్రవ్యాల ప్రవేశించకుండా అరికట్టేందుకు ట్రంప్ ప్రభుత్వం ప్రత్యేకంగా సైన్యాన్ని నియమించింది. ఇందులో భాగంగానే ఇప్పటికే వెనిజులా నుంచి వచ్చిన రెండు బోట్లను అమెరికా సైన్యం పేల్చేసింది. సెప్టెంబర్ 2న జరిపిన దాడిలో 11 మంది మరణించారు. ట్రెన్ డి అరగువా ముఠా ఈ పడవను నడుపుతోందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ వారం ప్రారంభంలో కూడా ఒక బోటును పేల్చడంతో ముగ్గురు చనిపోయారు.
ఇది కూడా చదవండి: H 1B Visa Fees: భారతీయులపై ట్రంప్ పిడుగు.. H-1B వీసా కొత్త దరఖాస్తులకు రూ. 88 లక్షలు
మాదకద్రవ్యాల అక్రమ రవాణా పడవపై అమెరికా జరిపిన తాజా దాడిలో ముగ్గురు మరణించారని ట్రంప్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ‘‘నౌక అక్రమ మాదకద్రవ్యాలను రవాణా చేస్తోందని, అమెరికన్లకు విషం ఇవ్వడానికి మాదకద్రవ్యాల అక్రమ రవాణా జరుగుతోందని నిఘా వర్గాలు నిర్ధారించాయి.’’ అని ట్రంప్ పేర్కొన్నారు. ఈనెలలో 3 ప్రాణాంతక దాడులు జరిగినట్లు ట్రంప్ చెప్పుకొచ్చారు. అయితే తాజా దాడి ఎక్కడ జరిగిందో మాత్రం కచ్చితమైన సమాచారం ఇవ్వలేదు. వైట్హౌస్ కూడా స్పష్టత ఇవ్వలేదు.
అయితే వెనిజులాలో అధ్యక్షుడు నికోలస్ మదురోను పడగొట్టే ప్రయత్నంలో భాగంగా ఈ దాడులు జరుగుతున్నాయని కొందరు ఊహాగానాలు చేస్తున్నారు. అయితే ఉద్దేశ పూర్వకంగానే దాడులు జరుగుతున్నాయని వెనిజులా ఆరోపిస్తోంది. నౌకలో ఉన్నది ఎవరో నిర్ధారించకుండానే ఎలా దాడులు చేస్తారంటూ ఆరోపించింది. బెదిరిపులు, పాలన మార్పు కోసమే అమెరికా ఈ చర్యలకు పాల్పడుతోందని పేర్కొంది.
ON VIDEO: U.S. Military Forces conducted a strike against a designated terrorist organization engaged in narcotrafficking. Intelligence confirmed the vessel was trafficking illicit narcotics and was en route to poison Americans. The strike killed three male narcoterrorists. pic.twitter.com/wjxRRMrxwB
— The White House (@WhiteHouse) September 20, 2025
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!