Donald Trump: ఆలస్యమైతే మీకే నష్టం.. హమాస్కు ట్రంప్ వార్నింగ్..
- శాంతి ప్రణాళికను ప్రారంభించండి..
- లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి..
- హమాస్ను హెచ్చరించిన ట్రంప్..
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్కు హెచ్చరికలు జారీ చేశారు. శాంతి ఒప్పందానికి త్వరగా అంగీకరించాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన వార్నింగ్ ఇచ్చారు. శాంతి ఒప్పందానికి మరింత ఆలస్యమైతే, ఇంకా విధ్వంసం జరగొచ్చని అన్నారు. హమాస్ తక్షణమే స్పందించాలని, లేకపోతే అన్నీ మారిపోతాయని, ఆలస్యం అంగీకారమవ్వదని, గాజా మళ్లీ ప్రమాదంలో పడే అవకాశం ఉందని ట్రంప్ తన ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు.
ఇప్పటికే ఇజ్రాయిల్ తాత్కాలికంగా దాడులు నిలిపేసిందని, బందీలను హమాస్ త్వరగా విడుదల చేసి, శాంతి ఒప్పందానికి అవకాశం ఇవ్వాలని చెప్పారు. మరోవైపు, గాజా ప్రభుత్వం శనివారం తెల్లవారుజామున ఇజ్రాయిల్ తమపై దాడి చేసిందని ఆరోపించింది. ఈ దాడిలో 57 మంది మరణించినట్లు చెప్పింది. బందీల విడుదలపై చర్చలు జరిపేందుకు ట్రంప్ కుమారుడు జరెడ్ కుష్నర్, మిడిల్ ఈస్ట్ రాయబారి స్టీవ్ విట్కాఫ్ ఈజిప్ట్ వెళ్లుతున్నట్లు వైట్ హౌజ్ తెలిపింది.
Also Read
- Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్పై ఇరాన్ దాడులు!
- Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
- Trump: ‘‘ఆ..చెత్తంతా చదవొద్దు’’.. జర్నలిస్ట్పై ట్రంప్ ఆగ్రహం
- Sheikh Yusuf Afridi: ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో దుండగుల కాల్పులు.. లష్కర్-ఎ-తోయిబా అగ్ర కమాండర్ షేక్ అఫ్రిది హతం
Read Also: TSRTC: ఆర్టీసీ ప్రయాణికులకు బిగ్షాక్.. మరోసారి పెరగనున్న బస్ ఛార్జీలు..
గత రెండేళ్లుగా జరుగుతున్న యుద్ధానికి ముగింపు ఇవ్వాలని అమెరికా ప్రణాళికపై హమాస్ సానుకూలంగా స్పందించింది. బందీలందర్ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. ఒప్పంద వివరాలపై చర్చలకు తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. అయితే, గాజాలో ఇజ్రాయిల్ ఇంకా గాజాలో సైనిక కార్యకలాపాలనున కొనసాగిస్తూనే ఉంది. ఇజ్రాయిల్ ఇది భద్రతా కారణాల వల్ల దాడులు కొనసాగిస్తున్నట్లు చెప్పింది.
ట్రంప్ ఇజ్రాయిల్-హమాస్ మధ్య శాంతి ఒప్పందానికి 20- పాయింట్ల ప్రణాళిక రూపొందించారు. ఇందులో తక్షణ కాల్పుల విరమణ, బందీలు-ఖైదీల మార్పిడి, దశల వారీగా ఇజ్రాయిల్ ఉపసంహరణ, హమాస్ ఆయుధాలను విడిచిపెట్టడం, గాజాలో పరిపాలన కోసం అంతర్జాతీయ పర్యవేక్షణలో తాత్కలిక ప్రభుత్వం ఏర్పాటు కీలక అంశఆలుగా ఉన్నాయి. హమాస్ వద్ద ప్రస్తుతం 48 మంది బందీలుగా ఉన్నారు, ఇందులో సుమారు 20 మంది మాత్రమే జీవించి ఉంటారని భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Sorakaya Garelu Recipe: కరకరలాడే కమ్మని సొరకాయ గారెలు.. 10 నిమిషాల్లో ఇలా రెడీ చేసేయండి.!
-
Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!
-
వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
-
Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
-
KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!