Indonesia: మాదకద్రవ్యాల కేసులో ముగ్గురు భారతీయులకు మరణశిక్ష
- మాదకద్రవ్యాల కేసులో ముగ్గురు భారతీయులకు మరణశిక్ష
- కేంద్ర సాయం కోరుతూ ఢిల్లీ హైకోర్టులో భార్యలు పిటిషన్లు
ఇండోనేషియాలో ముగ్గురు భారతీయులకు మరణశిక్ష పడింది. 106 కిలోల మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేసిన కేసులో ముగ్గురు భారతీయులకు న్యాయస్థానం మరణశిక్ష విధించింది. మరణశిక్షపై కేంద్రం తక్షణమే స్పందించాలని ఢిల్లీ హైకోర్టులో ముగ్గురు వ్యక్తుల జీవిత భాగస్వాములు పిటిషన్ దాఖలు చేశారు. మరణశిక్ష పడిన వారిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఇండోనేషియా కోర్టు తీర్పు కాపీని ఏప్రిల్ 29న పిటిషనర్లు అందుకున్నారని, ఈ కేసు మే 6న విచారణకు వస్తుందని పిటిషన్లో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Nani: ది ప్యారడైజ్లోకి అడుగు పెట్టేది అప్పుడే!
Also Read
- RBI Gold Reserves: భారత్కు రాబోతున్న 104 టన్నుల బంగారం.. కీలక నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ
- Himanta Sarma: హిమంత వ్యాఖ్యలతో బంగ్లాదేశ్లో కలకలం..
- UAE: 48 గంటల్లో దేశం విడిచి వెళ్లండి.. పాకిస్తానీ ఉద్యోగులకు యూఏఈ షాక్..
- Jeffrey Epstein: ఎప్స్టీన్ మిస్టరీలో మరో ట్విస్ట్.. ఏడేళ్లుగా దాచిన 'సూసైడ్ లేటర్'.. ప్రపంచ కుబేరులకు దడ!
లెజెండ్ అక్వేరియస్ కార్గో నౌకలో 106 కిలోగ్రాముల క్రిస్టల్ మెత్ను అక్రమంగా రవాణా చేశారనే ఆరోపణలతో గత ఏడాది జూలైలో తమిళనాడుకు చెందిన రాజు ముత్తుకుమరన్, సెల్వదురై దినకరన్, గోవిందసామి విమల్కందన్ అనే ముగ్గురు వ్యక్తులు అరెస్టు అయ్యారు. తాజాగా ఈ కేసులో ఇండోనేషియాలో మరణశిక్ష విధించబడింది. మాదకద్రవ్యాల చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఇండోనేషియాలోని జిల్లా కోర్టు గత నెలలో ముగ్గురికి మరణశిక్ష విధించింది.
ఇది కూడా చదవండి: Army Jobs: ఫేక్ సర్టిఫికెట్లతో ఆర్మీ ఉద్యోగాలు.. కొనసాగుతున్న విచారణ..
పిటిషన్ విచారించిన ఢిల్లీ హైకోర్టు.. మరణశిక్ష పడిన ముగ్గురు భారతీయులకు సాయం చేయాలంటూ ఇండోనేషియాలోని భారత కాన్సులేట్ను ఢిల్లీ ధర్మాసనం కోరింది. తగిన న్యాయ సహాయం అందేలా చూడాలని కోరిందని నివేదిక పేర్కొంది. దోషులుగా తేలిన భారతీయుల జీవిత భాగస్వాములు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు ఈ నోటీసు జారీ చేసింది. ఈ విషయాన్ని దౌత్య స్థాయిలో కొనసాగించాలని విదేశాంగ మంత్రిత్వ శాఖను ఆదేశించింది. అలాగే దోషులు-వారి కుటుంబాల మధ్య కమ్యూనికేషన్ను కూడా సులభతరం చేయాలని కోర్టు అధికారులను కోరిందని నివేదిక పేర్కొంది.
తాజావార్తలు
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
-
Riyan parag: బీసీసీఐ జరిమానా విధించిన మరుసటి రోజే.. విశ్వరూపం చూపించిన రియాన్ పరాగ్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!