Imran Khan: రణరంగంగా పాకిస్తాన్.. ఇంటర్నెట్ బ్లాక్.. ఆర్మీ ఆధీనంలోకి పంజాబ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ(పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ తో పాకిస్తాన్ భగ్గుమంది. నిన్న ఇస్లామాబాద్ లో ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ తర్వాత నుంచి ఆ దేశంలోని అన్ని నగరాల్లో, పట్టణాల్లో పీటీఐ కార్యకర్తలు, ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు తీవ్ర ఆందోళనలు చేస్తున్నారు. లాహోర్, ఇస్లామాబాద్, క్వెట్టాలోని ఆర్మీ కంటోన్మెంట్లపై దాడులు చేశారు. ఇదిలా ఉంటే అల్లర్లను అణిచివేయడానికి పాక్ ప్రభుత్వం అక్కడ ఇంటర్నెట్, సోషల్ మీడియాను బ్లాక్ చేసింది. ఇదిలా ఉంటే పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్సును సైన్యం తన ఆధీనంలోకి తీసుకున్నట్లు పాక్ మీడియా చెబుతోంది. పంజాబ్ ఇమ్రాన్ ఖాన్ సొంత రాష్ట్రం. అల్లర్లను అణిచివేసేందుకు భద్రతా బలగాలు జరిపిన దాడుల్లో ఆరుగురు మరణించారు.
Read Also: Matrimonial frauds: మ్యాట్రిమోని వెబ్సైట్ ద్వారా పరిచయమ్యాడు.. నగలతో ఉడాయించాడు..
Also Read
- Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
- PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
- Donald Trump : ‘మేక్ అమెరికా క్రిస్టియన్’.. అమెరికా రాజకీయాల్లో కొత్త ట్రెండ్.?
అయితే ఇంటర్నెట్, సోషల్ మీడియాను ఉపయోగించుకునేలా పునరుద్దరించాలని ‘‘పాకిస్తాన్ టెలీకమ్యూనికేషన్ అథారిటీ’’కి అంతర్జాతీయ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ విజ్ఞప్తి చేసింది. శాంతియుతంగా కొనసాగుతున్న నిరసన ప్రదర్శనలు హింసాత్మక రూపు దాల్చేలా కొన్ని దుష్ట శక్తులు ప్రయత్నాలు చేసే అవకాశం ఉందని పీటీఐ నేతలు ఆరోపిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ పై తమ తదుపరి కార్యాచరణ కోసం పార్టీ ఉపాధ్యక్షుడు షా మొహమ్మద్ ఖురేషి నేతృత్వంలోని ఆరుగురు సీనియర్ నేతలతో కమిటీ ఏర్పాటైంది.
ఇస్లామాబాద్, రావల్పిండి, లాహోర్, కరాచీ, ఫైసలాబాద్, గుజ్రాన్ వాలా, ముల్తాన్, పెషావర్, మర్దాన్ నగరాల్లో ఆందోళనలు మిన్నంటాయి. రాజధాని ఇస్లామాబాద్ లో పెద్ద ఎత్తున పీటీఐ కార్యకర్తలు ఆందోళల్ని నిర్వహిస్తున్నారు. నిరసనల్లో భాగంగా 25 పోలీసుల వాహనాలు, 14 ప్రభుత్వ భవనాలను ధ్వంసం అయ్యాయి. 130 మంది పోలీసులు గాయపడ్డారు. ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రాబీబీ పేరున ఉన్న ‘‘ అల్ ఖదీర్ ట్రస్ట్’’లో అవినీతి ఆరోపణలపై ‘నేషనల్ అకౌంటబులిటీ బ్యూరో’ ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేసింది.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!