Mu*rder Case: వేములపల్లిలో పరువు హత్య.. సొంత చెల్లెలిపై కక్ష కట్టిన సోదరులు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Murder Case: పరువు కోసం ప్రాణిలిస్తాం అనేది పాత సామెత.. ఇప్పుడు పరువు కోసం ప్రాణాలు తీస్తామంటున్నారు కొంత మంది. కులపిచ్చితో రగిలిపోతూ.. పచ్చని జీవితాలను మోడుగా చేసుకుంటున్నారు. అంతే కాదు.. తమ పరువు కోసం సొంత వాళ్ల జీవితాలను సైతం అంధకారంలోకి నెట్టేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. కులాంతర వివాహం చేసుకున్న సొంత చెల్లెలిపై సోదరులు కక్ష కట్టారు. పెళ్లి చేసుకున్న రెండో రోజే బావను రాళ్లతో కొట్టి చంపేశారు.
T20 World Cup 2026: భారత్ సెమీస్ చేరితే.. ఎదుర్కోబోయే ప్రత్యర్థి ఎవరంటే?
Also Read
- Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
- Ganja Smuggling : శంషాబాద్లో అంతర్రాష్ట్ర గంజాయి రాకెట్ గుట్టురట్టు..
- Rajasthan: 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. రాజస్థాన్ను కుదిపేస్తున్న ఘటన..
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
తూర్పుగోదావరి జిల్లా మండపేటలో ఒక్కసారిగా అలజడి రేగింది. నడిరోడ్డుపై ఓ వ్యక్తిని ఇద్దరు వ్యక్తులు రాళ్లతో కొట్టి చంపేశారు. ఇందుకు సంబంధించిన విజువల్స్ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడి శివారు వేములపల్లిలో ఈ దారుణం జరిగింది. కడియం మండలం జేగురుపాడుకు చెందిన అయినవిల్లి సంధ్య రాయవరం డిప్యూటీ తహశీల్దార్గా పనిచేస్తున్నారు. వేములపల్లికి చెందిన సూర్యప్రకాష్ రావు అనే యువకుడిని ఆమె ప్రేమిస్తున్నారు. ఇంట్లో ఒప్పుకోకపోవడంతో.. అన్నవరంలో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. రాత్రి 11 గంటల సమయంలో నవ దంపతులిద్దరూ పెళ్లి కుమారుడి ఇంటికి వచ్చారు.
IPL 2026: ఐపీఎల్ వాయిదా.. ప్రారంభ మ్యాచ్ అప్పుడే..!
అదే సమయంలో అక్కడికి చేరుకున్న సంధ్య సోదరులైన గిరిబాబు, చంద్రపాల్ పెళ్లి కొడుకు సూర్య ప్రకాశరావును ఇంటి నుంచి బయటికి తీసుకువచ్చారు. రోడ్డుపైనే అతనితో గొడవ పడ్డారు. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఇద్దరూ.. అతనిపై రాళ్లతో దాడి చేసి చంపేశారు. ఈ దారుణాన్ని చూసిన స్థానికులు అన్నదమ్ములు ఇద్దరినీ పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కులాంతర వివాహం చేసుకోవడంతోనే పరువు కోసం హత్య చేసినట్లు వారిద్దరూ వెల్లడించారు. ప్రభుత్వ అధికారిగా ఉన్న సంధ్య పెళ్లి చేసుకుని వెళ్లిపోతే కుటుంబానికి ఆదాయం ఉండదని సోదరులు ఇద్దరు చెల్లి భర్తను హత్య చేసినట్లుగా భావిస్తున్నారు. మొత్తానికి అన్నదమ్ముల కులపిచ్చి కాస్తా.. ఆమె పచ్చని కాపురంలో చిచ్చు పెట్టింది. కనీసం కాళ్ల పారాణి ఆరకముందే.. ప్రేమించిన భర్తను కోల్పోయి విలపిస్తోంది.
తాజావార్తలు
-
Kakanmath Temple: ఈ ఆలయాన్ని దెయ్యాలు నిర్మించాయా? వెయ్యేళ్లుగా చెక్కుచెదరని రహస్యం ఇదేనా?
-
RaviTeja : మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్
-
Suriya : కరుప్పు బ్లాక్ బస్టర్ జోష్..నెక్ట్స్ సినిమాలో పాట పడబోతున్న సూర్య
-
Mustard Oil Ban in US: భారత్లో హెల్దీ.. అమెరికాలో నిషేధం.. ఆవ నూనెపై నిజాలు ఇవే..!
-
Harshad Chopra: 43 ఏళ్ల వయసులోనూ ఎందుకు పెళ్లి చేసుకోలేదు?.. ప్రముఖ టీవీ నటుడు ఎమోషనల్ కామెంట్స్
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!