Srilanka Crisis: ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు రెండు వారాల పాటు మూసివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంక సంక్షోభం కొనసాగుతూనే ఉంది. అక్కడ ప్రభుత్వం మారినా.. పరిస్థితుల్లో మార్పు రాలేదు. ఇప్పటికీ జనాలు తీవ్ర ఇంధన కొరత, నిత్యావసరాల కొరతను ఎదుర్కుంటూనే ఉన్నారు. ఇక ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఇంధనానికి డబ్బులు చెల్లించేందుకు శ్రీలంక వద్ద విదేశీ మారక నిల్వలు లేవు. దీంతో దేశంలో ట్రాన్స్ పోర్ట్ , విద్యుత్ వ్యవస్థలు దెబ్బతింటున్నాయి.
ఇదిలా ఉంటే ఇంధనానికి డబ్బులు చెల్లించేందుకు డాలర్లు లేకపోవడంతో పబ్లిక్ ట్రాన్స్ ఫోర్ట్ వ్యవస్థ దాదాపుగా నిలిచిపోయింది. శ్రీలంక అధికారులు ప్రభుత్వ కార్యాలయాలకు, స్కూళ్లకు రెండు వారాల పాటు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. పెట్రోల్, డిజిల్ కొరత తీవ్రంగా ఉండటంతో సోమవారం నుంచి అన్ని విభాగాలు, ప్రభుత్వ సంస్థలు తమ సేవలను తక్కువ చేసుకోవాలని అక్కడి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిత్వశాఖ ఆదేశించింది. ప్రభుత్వ వాహనాలు, ప్రైవేటు ట్రాన్స్ పోర్ట్ లేకపోవడంతో ఉద్యోగులు తక్కువ సంఖ్యలోనే హాజరుకావాలని ప్రభుత్వం ఆదేశించింది.
Also Read
- Iran Political Crisis: ఇరాన్లో తిరుగుబాటు.. ఆ దేశ రాజకీయాల్లో కలకలం!
- Zohran Mamdani: నెతన్యాహూను అరెస్ట్ చేస్తాం.. న్యూయార్క్ మేయర్ హెచ్చరిక..
- Two US Soldiers Killed: ఇరాన్ దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు మృతి.. "మరచిపోలేని గుణపాఠం చెబుతాం" అంటూ ఖమేనీ హెచ్చరిక
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
1948లో బ్రిటిష్ నుంచి స్వాతంత్ర్యం పొందిన శ్రీలంక చరిత్రలో ఎప్పుడూ కనీవిని ఎరగని ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశంలో ఆహారం, ఇంధనం, ఎరువులు, మందులు ఇలా అన్నింటిలో తీవ్ర కొరతను ఎదుర్కొంటోంది. శ్రీలంకలో ప్రతీ ఐదుగురిలో నలుగురు ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే అధ్యక్షుడు గోటబయ రాజపక్స, కొత్తగా రణిల్ విక్రమసింఘేను ప్రధానిగా నియమించడంతో పాటు కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశాడు. అయినా ఇప్పటికిప్పుడు శ్రీలంక పరిస్థితిలో మార్పు వచ్చేలా కనిపించడం లేదు. ఇక ఐఎంఎఫ్ నుంచి బెయిల్ అవుట్ ప్యాకేజీ కోసం శ్రీలంక ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉంటే భారత్ క్రెడిట్ లైన్ కింద మందులు, ఇంధనం, ఎరువులు, ఆహారాన్ని శ్రీలంకకు అందిస్తోంది. ఇటీవల భారత్ చేస్తున్న సాయాన్ని చైనా కూడా పొగిడింది. శ్రీలంకలో పరిస్థితి ఇలా కావడానికి గోటబయ కుటుంబీకులే కారణం అని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు.
తాజావార్తలు
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Prabhas: ఒకేసారి మూడు భారీ సినిమాలు.. మూడు డిఫరెంట్ పాత్రలు.. ఇదే డార్లింగ్ స్టామినా!
-
Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించడం సరైనదే: ఢిల్లీ హైకోర్టు
-
Team India: జస్ప్రీత్ బుమ్రాకు ఏమైంది.. టీమిండియాలో మూడు మార్పులు..
-
Harish Rao : నన్ను కోస్తావా కోయ్.. కానీ కాళేశ్వరం మోటర్లు ఆన్ చెయ్.. రేవంత్కు హరీష్ సవాల్.!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!