Srilanka Crisis: ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు రెండు వారాల పాటు మూసివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంక సంక్షోభం కొనసాగుతూనే ఉంది. అక్కడ ప్రభుత్వం మారినా.. పరిస్థితుల్లో మార్పు రాలేదు. ఇప్పటికీ జనాలు తీవ్ర ఇంధన కొరత, నిత్యావసరాల కొరతను ఎదుర్కుంటూనే ఉన్నారు. ఇక ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఇంధనానికి డబ్బులు చెల్లించేందుకు శ్రీలంక వద్ద విదేశీ మారక నిల్వలు లేవు. దీంతో దేశంలో ట్రాన్స్ పోర్ట్ , విద్యుత్ వ్యవస్థలు దెబ్బతింటున్నాయి.
ఇదిలా ఉంటే ఇంధనానికి డబ్బులు చెల్లించేందుకు డాలర్లు లేకపోవడంతో పబ్లిక్ ట్రాన్స్ ఫోర్ట్ వ్యవస్థ దాదాపుగా నిలిచిపోయింది. శ్రీలంక అధికారులు ప్రభుత్వ కార్యాలయాలకు, స్కూళ్లకు రెండు వారాల పాటు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. పెట్రోల్, డిజిల్ కొరత తీవ్రంగా ఉండటంతో సోమవారం నుంచి అన్ని విభాగాలు, ప్రభుత్వ సంస్థలు తమ సేవలను తక్కువ చేసుకోవాలని అక్కడి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిత్వశాఖ ఆదేశించింది. ప్రభుత్వ వాహనాలు, ప్రైవేటు ట్రాన్స్ పోర్ట్ లేకపోవడంతో ఉద్యోగులు తక్కువ సంఖ్యలోనే హాజరుకావాలని ప్రభుత్వం ఆదేశించింది.
Also Read
- DUBAI: గ్లోబల్ బ్రాండ్ ఇమేజ్ సర్వనాశనం.. దుబాయ్ను నిండా ముంచేసిన ఇరాన్!
- Venezuela: ప్రాణమిచ్చి పాపను కాపాడిన తల్లి.. వెనిజులా భూకంప శిథిలాల మధ్య గుండెల్ని పిండేసే కథనం!
- Iran: "నరకం చూపిస్తాం".. అమెరికా, గల్ఫ్ దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక
- Donald Trump: "ఇకపై ఇరాన్ అనే దేశమే ఉండదు".. ట్రంప్ బిగ్ వార్నింగ్.. ఆందోళనలో ప్రపంచ దేశాలు!
1948లో బ్రిటిష్ నుంచి స్వాతంత్ర్యం పొందిన శ్రీలంక చరిత్రలో ఎప్పుడూ కనీవిని ఎరగని ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశంలో ఆహారం, ఇంధనం, ఎరువులు, మందులు ఇలా అన్నింటిలో తీవ్ర కొరతను ఎదుర్కొంటోంది. శ్రీలంకలో ప్రతీ ఐదుగురిలో నలుగురు ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే అధ్యక్షుడు గోటబయ రాజపక్స, కొత్తగా రణిల్ విక్రమసింఘేను ప్రధానిగా నియమించడంతో పాటు కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశాడు. అయినా ఇప్పటికిప్పుడు శ్రీలంక పరిస్థితిలో మార్పు వచ్చేలా కనిపించడం లేదు. ఇక ఐఎంఎఫ్ నుంచి బెయిల్ అవుట్ ప్యాకేజీ కోసం శ్రీలంక ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉంటే భారత్ క్రెడిట్ లైన్ కింద మందులు, ఇంధనం, ఎరువులు, ఆహారాన్ని శ్రీలంకకు అందిస్తోంది. ఇటీవల భారత్ చేస్తున్న సాయాన్ని చైనా కూడా పొగిడింది. శ్రీలంకలో పరిస్థితి ఇలా కావడానికి గోటబయ కుటుంబీకులే కారణం అని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు.
తాజావార్తలు
-
Vivo TWS 5 Pro: వివో కొత్త ఇయర్బడ్స్ విడుదల.. 50 గంటల ప్లేటైమ్
-
Multiplex Business: రూ.200 టికెట్ కొంటే ఎవరికెంత వెళ్తుంది?.. థియేటర్లను బతికించే అసలైన హీరో ఎవరు?
-
INDW vs AUSW: గ్రూప్-ఏలో ఉత్కంఠభరిత పోటీ.. భారత్ సెమీస్ చేరాలంటే అద్భుతమే జరగాలి!
-
Hanuman: హనుమంతుడిని కూడా నిలువరించిన ముగ్గురు యోధులు వీరేనా? ఈ కథల వెనుక ఉన్న విశేషాలేంటి?
-
DUBAI: గ్లోబల్ బ్రాండ్ ఇమేజ్ సర్వనాశనం.. దుబాయ్ను నిండా ముంచేసిన ఇరాన్!
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!