Srilanka Crisis: శ్రీలంక అధ్యక్ష భవనంలో బయటపడిన కరెన్సీ కట్టలు.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంకలో అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో శనివారం అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఇంటిని ముట్టడించిన నిరసనకారులు భవనం నుండి పెద్ద మొత్తంలో కరెన్సీ కట్టలను స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక మీడియా నివేదించింది. ఇప్పటికీ నిరసనకారులు ఆ భవనాన్ని విడిచి వెళ్లలేదు. శ్రీలంక దినపత్రిక, డైలీ మిర్రర్ ప్రకారం, రికవరీ చేసిన డబ్బును భద్రతా విభాగాలకు అప్పగించినట్లు తెలిసింది. శనివారం నాటి తిరుగుబాటు తర్వాత అనేక నాటకీయ వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అక్కడ వేలాది మంది నిరసనకారులు కొలంబోలోని అధ్యక్ష అధికారిక నివాసంపై దాడి చేయగా.. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స పారిపోయిన సంగతి తెలిసిందే. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేయాలనే డిమాండ్తో, వారు అధ్యక్షుడి ఇంటిలోకి ప్రవేశించి, పోలీసులు ఉంచిన భద్రతా వలయాలను కూల్చివేసి, స్విమ్మింగ్ పూల్లో స్నానం చేసి, అతని వంటగది మరియు ఇంటిని చుట్టుముట్టారు.
ఆందోళనకారులు అధ్యక్షుడి నివాసంలో పెద్ద ఎత్తున నగదును గుర్తించారు. నగదును లెక్కిస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతోంది. స్వాధీనం చేసుకున్న 17.8 మిలియన్ల నోట్లను సెక్యూరిటీ సిబ్బందికి అప్పగించినట్టు తెలుస్తోంది. దీనిపై దర్యాప్తు తర్వాతే తాము వాస్తవాలను తెలుసుకోగలమని పోలీసులు ప్రకటించారు. దేశంలో శాంతిని నెలకొల్పడానికి పౌరులందరూ సాయుధ దళాలకు, పోలీసులకు తమ మద్దతు ఇవ్వాలని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ శవేంద్ర సిల్వా కోరారు. త్రివిధ దళాల కమాండర్లతో కలిసి ప్రత్యేక ప్రకటనలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read
- Donald Trump: సుప్రీంకోర్టు తీర్పుతో ఆగని ట్రంప్.. బర్త్రైట్ సిటిజన్షిప్పై మరోసారి సంచలన నిర్ణయం
- Donald Trump: 'మీరు వైట్ హౌస్ యజమాని కాదు'.. ట్రంప్కు అమెరికా కోర్టు బిగ్ షాక్..
- Doctors Continue Surgery: హ్యాట్సాఫ్.. భూకంపం వణికించినా.. పేషెంట్ ప్రాణాల కోసం కదలని వైద్యులు! వీడియో వైరల్..
- Tariff Risk: ట్రంప్ మరో షాక్.. భారత వస్తువులపై 100 శాతం టారిఫ్లు విధించేలా చట్టం
Srilanka Crisis: మహోగ్ర లంక.. నలుగురు మంత్రులు రాజీనామా
శ్రీలంక పర్యాటక శాఖ మంత్రి హరీన్ ఫెర్నాండో, కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మానుషా నానయక్కరా తక్షణమే తమ మంత్రిత్వ శాఖల నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఆర్థిక సంక్షోభంతో ఆగ్రహానికి గురైన శ్రీలంక నిరసనకారులు శనివారం ప్రధాని రణిల్ విక్రమసింఘే వ్యక్తిగత నివాసంలోకి కూడా చొరబడి నిప్పంటించారు. పలువురు జర్నలిస్టులు, భద్రతా బలగాలపై కూడా దాడిచేశారు. ఆగ్రహించిన ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు వాటర్ క్యానన్లను ప్రయోగించారు. పోలీసులు ఆందోళనకారులపై భాష్పవాయువు ప్రయోగించారు, అయినప్పటికీ వారు ప్రధానమంత్రి ఇంట్లోకి ప్రవేశించి ఇంటికి నిప్పు పెట్టారు. మేలో ప్రధానమంత్రిగా నియమితులైన విక్రమసింఘే పౌరులందరి భద్రత కోసం తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స కూడా బుధవారం తన పదవికి రాజీనామా చేసేందుకు అంగీకరించారు.
https://twitter.com/SJIMYAKUS/status/1546005772920066049
తాజావార్తలు
-
Box Office Numbers: బాక్సాఫీస్ పోస్టర్లపై నాగవంశీ కామెంట్స్ వైరల్.. ‘ఇప్పటికీ నంబర్లు ఇన్ఫ్లేట్ అవుతున్నాయి’!
-
Best AI Laptops 2026: AI ల్యాప్టాప్ కొనాలనుకుంటున్నారా?.. ఈ 5 పవర్ఫుల్ ల్యాప్టాప్లు బెస్ట్ ఆప్షన్స్!
-
Vaibhav Sooryavanshi: “ఫుడ్ విషయంలో తగ్గేదేలే”.. వైభవ్ సూర్యవంశీ డైట్ సీక్రెట్ ఇదేనట..
-
Best Horror Movies: వెన్నులో వణుకు పుట్టించే ‘హర్రర్ సినిమాలు’ చూడాలని ఉందా.? అయితే వీటిపై ఒక లుక్ వేయండి.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
ట్రెండింగ్
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!