Srilanka Crisis: శ్రీలంక అధ్యక్ష భవనంలో బయటపడిన కరెన్సీ కట్టలు.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంకలో అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో శనివారం అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఇంటిని ముట్టడించిన నిరసనకారులు భవనం నుండి పెద్ద మొత్తంలో కరెన్సీ కట్టలను స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక మీడియా నివేదించింది. ఇప్పటికీ నిరసనకారులు ఆ భవనాన్ని విడిచి వెళ్లలేదు. శ్రీలంక దినపత్రిక, డైలీ మిర్రర్ ప్రకారం, రికవరీ చేసిన డబ్బును భద్రతా విభాగాలకు అప్పగించినట్లు తెలిసింది. శనివారం నాటి తిరుగుబాటు తర్వాత అనేక నాటకీయ వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అక్కడ వేలాది మంది నిరసనకారులు కొలంబోలోని అధ్యక్ష అధికారిక నివాసంపై దాడి చేయగా.. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స పారిపోయిన సంగతి తెలిసిందే. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేయాలనే డిమాండ్తో, వారు అధ్యక్షుడి ఇంటిలోకి ప్రవేశించి, పోలీసులు ఉంచిన భద్రతా వలయాలను కూల్చివేసి, స్విమ్మింగ్ పూల్లో స్నానం చేసి, అతని వంటగది మరియు ఇంటిని చుట్టుముట్టారు.
ఆందోళనకారులు అధ్యక్షుడి నివాసంలో పెద్ద ఎత్తున నగదును గుర్తించారు. నగదును లెక్కిస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతోంది. స్వాధీనం చేసుకున్న 17.8 మిలియన్ల నోట్లను సెక్యూరిటీ సిబ్బందికి అప్పగించినట్టు తెలుస్తోంది. దీనిపై దర్యాప్తు తర్వాతే తాము వాస్తవాలను తెలుసుకోగలమని పోలీసులు ప్రకటించారు. దేశంలో శాంతిని నెలకొల్పడానికి పౌరులందరూ సాయుధ దళాలకు, పోలీసులకు తమ మద్దతు ఇవ్వాలని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ శవేంద్ర సిల్వా కోరారు. త్రివిధ దళాల కమాండర్లతో కలిసి ప్రత్యేక ప్రకటనలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read
- Iran Political Crisis: ఇరాన్లో తిరుగుబాటు.. ఆ దేశ రాజకీయాల్లో కలకలం!
- Zohran Mamdani: నెతన్యాహూను అరెస్ట్ చేస్తాం.. న్యూయార్క్ మేయర్ హెచ్చరిక..
- Two US Soldiers Killed: ఇరాన్ దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు మృతి.. "మరచిపోలేని గుణపాఠం చెబుతాం" అంటూ ఖమేనీ హెచ్చరిక
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
Srilanka Crisis: మహోగ్ర లంక.. నలుగురు మంత్రులు రాజీనామా
శ్రీలంక పర్యాటక శాఖ మంత్రి హరీన్ ఫెర్నాండో, కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మానుషా నానయక్కరా తక్షణమే తమ మంత్రిత్వ శాఖల నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఆర్థిక సంక్షోభంతో ఆగ్రహానికి గురైన శ్రీలంక నిరసనకారులు శనివారం ప్రధాని రణిల్ విక్రమసింఘే వ్యక్తిగత నివాసంలోకి కూడా చొరబడి నిప్పంటించారు. పలువురు జర్నలిస్టులు, భద్రతా బలగాలపై కూడా దాడిచేశారు. ఆగ్రహించిన ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు వాటర్ క్యానన్లను ప్రయోగించారు. పోలీసులు ఆందోళనకారులపై భాష్పవాయువు ప్రయోగించారు, అయినప్పటికీ వారు ప్రధానమంత్రి ఇంట్లోకి ప్రవేశించి ఇంటికి నిప్పు పెట్టారు. మేలో ప్రధానమంత్రిగా నియమితులైన విక్రమసింఘే పౌరులందరి భద్రత కోసం తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స కూడా బుధవారం తన పదవికి రాజీనామా చేసేందుకు అంగీకరించారు.
https://twitter.com/SJIMYAKUS/status/1546005772920066049
తాజావార్తలు
-
Missing Girls: హైదరాబాద్లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం
-
Jagga Reddy : కేటీఆర్ రక్తంలో నిజాయితీ, కృతజ్ఞత లేదు
-
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!