Srilanka Crisis: శ్రీలంక అధ్యక్ష భవనంలో బయటపడిన కరెన్సీ కట్టలు.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంకలో అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో శనివారం అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఇంటిని ముట్టడించిన నిరసనకారులు భవనం నుండి పెద్ద మొత్తంలో కరెన్సీ కట్టలను స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక మీడియా నివేదించింది. ఇప్పటికీ నిరసనకారులు ఆ భవనాన్ని విడిచి వెళ్లలేదు. శ్రీలంక దినపత్రిక, డైలీ మిర్రర్ ప్రకారం, రికవరీ చేసిన డబ్బును భద్రతా విభాగాలకు అప్పగించినట్లు తెలిసింది. శనివారం నాటి తిరుగుబాటు తర్వాత అనేక నాటకీయ వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అక్కడ వేలాది మంది నిరసనకారులు కొలంబోలోని అధ్యక్ష అధికారిక నివాసంపై దాడి చేయగా.. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స పారిపోయిన సంగతి తెలిసిందే. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేయాలనే డిమాండ్తో, వారు అధ్యక్షుడి ఇంటిలోకి ప్రవేశించి, పోలీసులు ఉంచిన భద్రతా వలయాలను కూల్చివేసి, స్విమ్మింగ్ పూల్లో స్నానం చేసి, అతని వంటగది మరియు ఇంటిని చుట్టుముట్టారు.
ఆందోళనకారులు అధ్యక్షుడి నివాసంలో పెద్ద ఎత్తున నగదును గుర్తించారు. నగదును లెక్కిస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతోంది. స్వాధీనం చేసుకున్న 17.8 మిలియన్ల నోట్లను సెక్యూరిటీ సిబ్బందికి అప్పగించినట్టు తెలుస్తోంది. దీనిపై దర్యాప్తు తర్వాతే తాము వాస్తవాలను తెలుసుకోగలమని పోలీసులు ప్రకటించారు. దేశంలో శాంతిని నెలకొల్పడానికి పౌరులందరూ సాయుధ దళాలకు, పోలీసులకు తమ మద్దతు ఇవ్వాలని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ శవేంద్ర సిల్వా కోరారు. త్రివిధ దళాల కమాండర్లతో కలిసి ప్రత్యేక ప్రకటనలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read
- DUBAI: గ్లోబల్ బ్రాండ్ ఇమేజ్ సర్వనాశనం.. దుబాయ్ను నిండా ముంచేసిన ఇరాన్!
- Venezuela: ప్రాణమిచ్చి పాపను కాపాడిన తల్లి.. వెనిజులా భూకంప శిథిలాల మధ్య గుండెల్ని పిండేసే కథనం!
- Iran: "నరకం చూపిస్తాం".. అమెరికా, గల్ఫ్ దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక
- Donald Trump: "ఇకపై ఇరాన్ అనే దేశమే ఉండదు".. ట్రంప్ బిగ్ వార్నింగ్.. ఆందోళనలో ప్రపంచ దేశాలు!
Srilanka Crisis: మహోగ్ర లంక.. నలుగురు మంత్రులు రాజీనామా
శ్రీలంక పర్యాటక శాఖ మంత్రి హరీన్ ఫెర్నాండో, కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మానుషా నానయక్కరా తక్షణమే తమ మంత్రిత్వ శాఖల నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఆర్థిక సంక్షోభంతో ఆగ్రహానికి గురైన శ్రీలంక నిరసనకారులు శనివారం ప్రధాని రణిల్ విక్రమసింఘే వ్యక్తిగత నివాసంలోకి కూడా చొరబడి నిప్పంటించారు. పలువురు జర్నలిస్టులు, భద్రతా బలగాలపై కూడా దాడిచేశారు. ఆగ్రహించిన ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు వాటర్ క్యానన్లను ప్రయోగించారు. పోలీసులు ఆందోళనకారులపై భాష్పవాయువు ప్రయోగించారు, అయినప్పటికీ వారు ప్రధానమంత్రి ఇంట్లోకి ప్రవేశించి ఇంటికి నిప్పు పెట్టారు. మేలో ప్రధానమంత్రిగా నియమితులైన విక్రమసింఘే పౌరులందరి భద్రత కోసం తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స కూడా బుధవారం తన పదవికి రాజీనామా చేసేందుకు అంగీకరించారు.
https://twitter.com/SJIMYAKUS/status/1546005772920066049
తాజావార్తలు
-
HYDRAA: వర్షం పడితే మునిగిపోవడానికి అసలు కారణం ఇదే.. కాలువల్లో లారీల కొద్దీ సోఫాలు, పరుపులు..రంగంలోకి ‘హైడ్రా’!
-
Shivam Dube: శివమ్ దూబేకు సరైన గుర్తింపు రాలేదా?.. సోషల్ మీడియాలో వైరల్గా స్టాట్స్!
-
Weight Loss Tips: బరువు తగ్గాలని అనుకుంటున్నారా? ముందుగా ఈ నిజాలు తెలుసుకోండి!
-
Vivo TWS 5 Pro: వివో కొత్త ఇయర్బడ్స్ విడుదల.. 50 గంటల ప్లేటైమ్
-
Multiplex Business: రూ.200 టికెట్ కొంటే ఎవరికెంత వెళ్తుంది?.. థియేటర్లను బతికించే అసలైన హీరో ఎవరు?
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!