Srilanka Crisis: శ్రీలంక అధ్యక్ష భవనంలో బయటపడిన కరెన్సీ కట్టలు.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంకలో అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో శనివారం అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఇంటిని ముట్టడించిన నిరసనకారులు భవనం నుండి పెద్ద మొత్తంలో కరెన్సీ కట్టలను స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక మీడియా నివేదించింది. ఇప్పటికీ నిరసనకారులు ఆ భవనాన్ని విడిచి వెళ్లలేదు. శ్రీలంక దినపత్రిక, డైలీ మిర్రర్ ప్రకారం, రికవరీ చేసిన డబ్బును భద్రతా విభాగాలకు అప్పగించినట్లు తెలిసింది. శనివారం నాటి తిరుగుబాటు తర్వాత అనేక నాటకీయ వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అక్కడ వేలాది మంది నిరసనకారులు కొలంబోలోని అధ్యక్ష అధికారిక నివాసంపై దాడి చేయగా.. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స పారిపోయిన సంగతి తెలిసిందే. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేయాలనే డిమాండ్తో, వారు అధ్యక్షుడి ఇంటిలోకి ప్రవేశించి, పోలీసులు ఉంచిన భద్రతా వలయాలను కూల్చివేసి, స్విమ్మింగ్ పూల్లో స్నానం చేసి, అతని వంటగది మరియు ఇంటిని చుట్టుముట్టారు.
ఆందోళనకారులు అధ్యక్షుడి నివాసంలో పెద్ద ఎత్తున నగదును గుర్తించారు. నగదును లెక్కిస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతోంది. స్వాధీనం చేసుకున్న 17.8 మిలియన్ల నోట్లను సెక్యూరిటీ సిబ్బందికి అప్పగించినట్టు తెలుస్తోంది. దీనిపై దర్యాప్తు తర్వాతే తాము వాస్తవాలను తెలుసుకోగలమని పోలీసులు ప్రకటించారు. దేశంలో శాంతిని నెలకొల్పడానికి పౌరులందరూ సాయుధ దళాలకు, పోలీసులకు తమ మద్దతు ఇవ్వాలని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ శవేంద్ర సిల్వా కోరారు. త్రివిధ దళాల కమాండర్లతో కలిసి ప్రత్యేక ప్రకటనలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read
- China halts J10CE Delivery: భారత్ రఫేల్పై ఏడ్చి.. చైనా ముందు నవ్వుల పాలైన పాక్! 16 యుద్ధ విమానాల డెలివరీని ఆపేసిన చైనా..
- Israel Lebanon Ceasefire: బిగ్ రిలీఫ్.. కాల్పుల విరమణకు ఇజ్రాయెల్, లెబనాన్ గ్రీన్ సిగ్నల్!
- Snakes Living in Groups: షాకింగ్ నిజాలు.. ఒక పాము కనిపిస్తే జాగ్రత్త..! దాని గుంపు మొత్తం సమీపంలోనే..!
- North Korea: ఫుట్బాల్ టోర్నమెంట్లో చరిత్ర సృష్టించిన ఉత్తర కొరియా జట్టు.. షేక్ హ్యాండిచ్చి అభినందించిన కిమ్.. సెలబ్రేషన్స్ వైరల్!
Srilanka Crisis: మహోగ్ర లంక.. నలుగురు మంత్రులు రాజీనామా
శ్రీలంక పర్యాటక శాఖ మంత్రి హరీన్ ఫెర్నాండో, కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మానుషా నానయక్కరా తక్షణమే తమ మంత్రిత్వ శాఖల నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఆర్థిక సంక్షోభంతో ఆగ్రహానికి గురైన శ్రీలంక నిరసనకారులు శనివారం ప్రధాని రణిల్ విక్రమసింఘే వ్యక్తిగత నివాసంలోకి కూడా చొరబడి నిప్పంటించారు. పలువురు జర్నలిస్టులు, భద్రతా బలగాలపై కూడా దాడిచేశారు. ఆగ్రహించిన ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు వాటర్ క్యానన్లను ప్రయోగించారు. పోలీసులు ఆందోళనకారులపై భాష్పవాయువు ప్రయోగించారు, అయినప్పటికీ వారు ప్రధానమంత్రి ఇంట్లోకి ప్రవేశించి ఇంటికి నిప్పు పెట్టారు. మేలో ప్రధానమంత్రిగా నియమితులైన విక్రమసింఘే పౌరులందరి భద్రత కోసం తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స కూడా బుధవారం తన పదవికి రాజీనామా చేసేందుకు అంగీకరించారు.
https://twitter.com/SJIMYAKUS/status/1546005772920066049
తాజావార్తలు
-
Vaibhav-MS Dhoni: ఎంఎస్ ధోనీ కాదు బిహార్కు గుర్తింపు వైభవ్ వల్లే.. ప్రముఖ స్పోర్ట్స్ ప్రజెంటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Bank Account: ఒక వ్యక్తికి ఎన్ని బ్యాంక్ ఖాతాలు ఉండొచ్చు? ఎక్కువ ఖాతాలు ఉంటే లాభమా? నష్టమా?
-
Aadhaar Mobile Number Update: ఆధార్లో మొబైల్ నంబర్ మార్పు.. ఎన్ని సార్లు అప్డేట్ చేసుకోవచ్చు? పూర్తి వివరాలు ఇవే
-
PEDDI : పెద్ది ఓవర్శీస్ టాక్.. కొంచం ఇష్టం.. కొంచం కష్టం
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతి అభివృద్ధి, కీలక సంక్షేమ నిర్ణయాలపై చర్చ!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!