Srilanka Crisis: శ్రీలంక అధ్యక్ష భవనంలో బయటపడిన కరెన్సీ కట్టలు.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంకలో అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో శనివారం అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఇంటిని ముట్టడించిన నిరసనకారులు భవనం నుండి పెద్ద మొత్తంలో కరెన్సీ కట్టలను స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక మీడియా నివేదించింది. ఇప్పటికీ నిరసనకారులు ఆ భవనాన్ని విడిచి వెళ్లలేదు. శ్రీలంక దినపత్రిక, డైలీ మిర్రర్ ప్రకారం, రికవరీ చేసిన డబ్బును భద్రతా విభాగాలకు అప్పగించినట్లు తెలిసింది. శనివారం నాటి తిరుగుబాటు తర్వాత అనేక నాటకీయ వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అక్కడ వేలాది మంది నిరసనకారులు కొలంబోలోని అధ్యక్ష అధికారిక నివాసంపై దాడి చేయగా.. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స పారిపోయిన సంగతి తెలిసిందే. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేయాలనే డిమాండ్తో, వారు అధ్యక్షుడి ఇంటిలోకి ప్రవేశించి, పోలీసులు ఉంచిన భద్రతా వలయాలను కూల్చివేసి, స్విమ్మింగ్ పూల్లో స్నానం చేసి, అతని వంటగది మరియు ఇంటిని చుట్టుముట్టారు.
ఆందోళనకారులు అధ్యక్షుడి నివాసంలో పెద్ద ఎత్తున నగదును గుర్తించారు. నగదును లెక్కిస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతోంది. స్వాధీనం చేసుకున్న 17.8 మిలియన్ల నోట్లను సెక్యూరిటీ సిబ్బందికి అప్పగించినట్టు తెలుస్తోంది. దీనిపై దర్యాప్తు తర్వాతే తాము వాస్తవాలను తెలుసుకోగలమని పోలీసులు ప్రకటించారు. దేశంలో శాంతిని నెలకొల్పడానికి పౌరులందరూ సాయుధ దళాలకు, పోలీసులకు తమ మద్దతు ఇవ్వాలని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ శవేంద్ర సిల్వా కోరారు. త్రివిధ దళాల కమాండర్లతో కలిసి ప్రత్యేక ప్రకటనలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read
- Afghan Women: ‘అమ్మాయి మౌనం పెళ్లికి అంగీకారమే’.. తాలిబన్ కొత్త చట్టంపై ఆగ్రహజ్వాలలు
- Oil Companies: పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచినా.. ఇంకా నష్టాల్లోనే చమురు సంస్థలు.. కారణం ఇదే..
- PM Modi: మోడీకి అరుదైన గౌరవం.. నార్వే అత్యున్నత పురస్కారం అందజేత
- Pakistan-Saudi Arabia: సౌదీ అరేబియా రక్షణకు పాకిస్తాన్ కిరాయి సైన్యం..
Srilanka Crisis: మహోగ్ర లంక.. నలుగురు మంత్రులు రాజీనామా
శ్రీలంక పర్యాటక శాఖ మంత్రి హరీన్ ఫెర్నాండో, కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మానుషా నానయక్కరా తక్షణమే తమ మంత్రిత్వ శాఖల నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఆర్థిక సంక్షోభంతో ఆగ్రహానికి గురైన శ్రీలంక నిరసనకారులు శనివారం ప్రధాని రణిల్ విక్రమసింఘే వ్యక్తిగత నివాసంలోకి కూడా చొరబడి నిప్పంటించారు. పలువురు జర్నలిస్టులు, భద్రతా బలగాలపై కూడా దాడిచేశారు. ఆగ్రహించిన ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు వాటర్ క్యానన్లను ప్రయోగించారు. పోలీసులు ఆందోళనకారులపై భాష్పవాయువు ప్రయోగించారు, అయినప్పటికీ వారు ప్రధానమంత్రి ఇంట్లోకి ప్రవేశించి ఇంటికి నిప్పు పెట్టారు. మేలో ప్రధానమంత్రిగా నియమితులైన విక్రమసింఘే పౌరులందరి భద్రత కోసం తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స కూడా బుధవారం తన పదవికి రాజీనామా చేసేందుకు అంగీకరించారు.
https://twitter.com/SJIMYAKUS/status/1546005772920066049
తాజావార్తలు
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
-
CM Chandrababu: ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగాలి.. పారదర్శక పాలనతో ముందుకు వెళ్లాలి..!
-
The Red Bag : రాశీ కీలక పాత్రలో ‘ది రెడ్ బ్యాగ్’
-
Maharashtra: పెళ్లింట తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!