Petrol-Diesel Price Hike: ఆ దేశంలో లీటర్ పెట్రోల్ రూ. 434, డీజిల్ రూ. 407.
- ఇరాన్ ఉద్రిక్తతలతో సంక్షోభంలో ప్రపంచ చమురు సరఫరా..
- శ్రీలంకలో భారీగా పెరిగిన ఇంధన ధరలు..
- పెట్రోల్ లీటరుకు రూ.434, డీజిల్ రూ.407..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Petrol-Diesel Price Hike: పశ్చిమాసియా సంక్షోభం, ఇరాన్ యుద్ధం ప్రపంచాన్ని ఇంధన సంక్షోభంలోకి నెట్టేసింది. ముఖ్యంగా దక్షిణాసియా దేశాలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నాయి. బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంకలతో పాటు భారత్ ఇంధన భద్రతను ఇరాన్ యుద్ధం ప్రభావితం చేసింది. ప్రపంచం చమురులో 20 శాతం అవసరాలకు కీలకమైన సముద్ర మార్గంగా ఉన్న ‘‘హార్ముజ్ జలసంధి’’లో ఇరాన్, అమెరికా ఘర్షణ పడుతున్నాయి. దీంతో గల్ఫ్ నుంచి ఆయిల్ రవాణా చాలా వరకు తగ్గిపోయింది.
ఇదిలా ఉంటే, భారత్లో ఇటీవల పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ధరలు పెరిగాయి. ఇతర దేశాలతో పోలిస్తే మన వద్ద చమురు ధరలు తక్కువగానే పెరిగాయి. కానీ శ్రీలంకలో మాత్రం పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పెట్రోల్, డీజిల్ ధరల్ని భారీ స్థాయిలో పెంచింది. శ్రీలంకలో లీటరు పెట్రోల్ ధర ఇప్పుడు రూ.434కి పెరగగా, డీజిల్ ధర లీటరుకు రూ.407కి చేరుకుంది. శ్రీలంక ప్రభుత్వ రంగ పెట్రోలియం సంస్థ సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ (సీపీఎస్) శనివారం కొత్త ధరలను ప్రకటించింది. ఇవి ఆదివారం నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రపంచ చమురు సంక్షోభం శ్రీలంకను కుదేలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇంధన వినియోగాన్ని తగ్గించాలని ఆ దేశ అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకే ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరిలో శ్రీలంకలో లీటర్ పెట్రోల్ ధర రూ. 293 ఉండగా, ఇది ఇప్పుడు రూ. 434కు పెరిగింది.
Also Read
- Trump-Iran: ఇరాన్తో ఒప్పందం ముగిసింది.. ఇక దాడులే.. ట్రంప్ ప్రకటనతో మళ్లీ ఉద్రిక్తతలు
- Pakistan Cargo Plane Missing: ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న పాకిస్తానీ కార్గో విమానం.. అరేబియా సముద్రంపై గల్లంతు
- Crude Oil: ఇరాన్పై అమెరికా వార్.. చమురు ధరలు క్రాష్! భారత్లో లీటర్ పెట్రోల్ రేట్ ఎంతంటే?
- US Airstrikes on Iran: ఆపండ్రోయ్.. ఖేష్మ్ ద్వీపం, బందర్ అబ్బాస్పై అమెరికా బాంబులు, పేలుళ్లతో వణికిన ఇరాన్
తాజావార్తలు
-
Trump-Iran: ఇరాన్తో ఒప్పందం ముగిసింది.. ఇక దాడులే.. ట్రంప్ ప్రకటనతో మళ్లీ ఉద్రిక్తతలు
-
TTD: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. ఈ రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
-
Garuda Puranam: ఈ 5 రకాల వ్యక్తులతో స్నేహం చేస్తే జీవితమే నరకం.. గరుడ పురాణం హెచ్చరిక కూడా ఇదే!
-
Harish Rao: మెచ్చుకోవాల్సింది పోయి.. ఏంటి ఈ చిల్లర రాజకీయాలు.?
-
EPFO EPF Interest: పీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్.. జూలై 15 నాటికి వడ్డీ జమ.. రూ.1.44 లక్షల కోట్లు క్రెడిట్!
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..