Petrol-Diesel Price Hike: ఆ దేశంలో లీటర్ పెట్రోల్ రూ. 434, డీజిల్ రూ. 407.
- ఇరాన్ ఉద్రిక్తతలతో సంక్షోభంలో ప్రపంచ చమురు సరఫరా..
- శ్రీలంకలో భారీగా పెరిగిన ఇంధన ధరలు..
- పెట్రోల్ లీటరుకు రూ.434, డీజిల్ రూ.407..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Petrol-Diesel Price Hike: పశ్చిమాసియా సంక్షోభం, ఇరాన్ యుద్ధం ప్రపంచాన్ని ఇంధన సంక్షోభంలోకి నెట్టేసింది. ముఖ్యంగా దక్షిణాసియా దేశాలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నాయి. బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంకలతో పాటు భారత్ ఇంధన భద్రతను ఇరాన్ యుద్ధం ప్రభావితం చేసింది. ప్రపంచం చమురులో 20 శాతం అవసరాలకు కీలకమైన సముద్ర మార్గంగా ఉన్న ‘‘హార్ముజ్ జలసంధి’’లో ఇరాన్, అమెరికా ఘర్షణ పడుతున్నాయి. దీంతో గల్ఫ్ నుంచి ఆయిల్ రవాణా చాలా వరకు తగ్గిపోయింది.
ఇదిలా ఉంటే, భారత్లో ఇటీవల పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ధరలు పెరిగాయి. ఇతర దేశాలతో పోలిస్తే మన వద్ద చమురు ధరలు తక్కువగానే పెరిగాయి. కానీ శ్రీలంకలో మాత్రం పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పెట్రోల్, డీజిల్ ధరల్ని భారీ స్థాయిలో పెంచింది. శ్రీలంకలో లీటరు పెట్రోల్ ధర ఇప్పుడు రూ.434కి పెరగగా, డీజిల్ ధర లీటరుకు రూ.407కి చేరుకుంది. శ్రీలంక ప్రభుత్వ రంగ పెట్రోలియం సంస్థ సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ (సీపీఎస్) శనివారం కొత్త ధరలను ప్రకటించింది. ఇవి ఆదివారం నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రపంచ చమురు సంక్షోభం శ్రీలంకను కుదేలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇంధన వినియోగాన్ని తగ్గించాలని ఆ దేశ అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకే ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరిలో శ్రీలంకలో లీటర్ పెట్రోల్ ధర రూ. 293 ఉండగా, ఇది ఇప్పుడు రూ. 434కు పెరిగింది.
Also Read
- Turkey-Israel tensions: టర్కీ-ఇజ్రాయిల్ మధ్య యుద్ధ మేఘాలు.. సిరియా వేదికగా కొత్త ముప్పు!
- Iran-US War: ఇరాన్ కొత్త ప్లాన్.. ఈసారి టార్గెట్ ఈ దేశాలేనా..!
- Trump: ట్రంప్తో ఫొటో దిగాలని ముచ్చటపడుతున్నారా? ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
- Jammu Kashmir: పాక్కు దిమ్మతిరిగే ప్రకటన.. కాశ్మీర్పై యూఎస్ రాయబారి సెర్గియో గోర్ కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!