KTR : బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్లో తెలంగాణ బిడ్డ.. ఉదయ్ నాగరాజుకు కేటీఆర్ ఘన సన్మానం
- హౌస్ ఆఫ్ లార్డ్స్కు ఎంపికైన ఉదయ్ నాగరాజు
- ఢిల్లీలో శాలువా, సిల్వర్ ఫిలిగ్రీతో కేటీఆర్ సత్కారం
- భారత్-యూకే సంబంధాల్లో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్ష
- కేటీఆర్ రాజకీయ ప్రస్థానం తనకు స్ఫూర్తి అన్న ఉదయ్ నాగరాజు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR : తెలంగాణకు చెందిన ప్రముఖ ప్రవాస భారతీయుడు, తొలిసారిగా బ్రిటన్ ‘హౌస్ ఆఫ్ లార్డ్స్’ కు ఎంపికైన తెలుగు బిడ్డ ఉదయ్ నాగరాజును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘనంగా సత్కరించారు. న్యూఢిల్లీలో నిర్వహించిన ఒక ప్రత్యేక అభినందన సభలో దేశంలోని పలు రాష్ట్రాల నుంచి, అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేదికపై కేటీఆర్, ఉదయ్ నాగరాజును శాలువాతో సత్కరించి, కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ మాస్టర్ పీస్ అందజేసి తమ శుభాకాంక్షలు తెలిపారు.
భారత్-యూకే సంబంధాల్లో ఉదయ్ పాత్ర కీలకం: కేటీఆర్
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, హౌస్ ఆఫ్ లార్డ్స్కు ఎంపికైన ఉదయ్ నాగరాజుకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. గత రెండు దశాబ్దాలకు పైగా భారత్, బ్రిటన్ల మధ్య వివిధ రంగాల్లో సంబంధాల బలోపేతానికి ఉదయ్ నాగరాజు విశేష కృషి చేశారని కొనియాడారు. యూకే పౌరుడిగా అక్కడి స్థానిక రాజకీయాల్లో క్షేత్రస్థాయి నుంచి ఎదిగి, అత్యున్నత సభ సభ్యుడిగా ఎంపిక కావడం ఆయన పట్టుదల, సేవా నిరతికి నిదర్శనమని పేర్కొన్నారు. ఆయన ప్రస్థానం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులకు, ముఖ్యంగా యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. భవిష్యత్తులో భారత్-యూకే ద్వైపాక్షిక సంబంధాలతో పాటు తెలంగాణలో వాణిజ్యం, పెట్టుబడులు, సేవారంగాల పురోగతికి కూడా ఉదయ్ నాగరాజు తోడ్పడాలని ఆకాంక్షించారు.
Also Read
- Harish Rao : రేవంత్కు హరీష్ రావు ఓపెన్ ఛాలెంజ్.. ‘నిరూపిస్తే రాజీనామా.!’
- CM Revanth Reddy : జగ్గారెడ్డి లాంటి నాయకుడు వెయ్యి కోట్లు ఇచ్చినా దొరకడు
- CM Revanth Reddy : 70 వేల జాబ్స్ భర్తీ.. పేపర్ లీకేజీలపై బీఆర్ఎస్కు రేవంత్ కౌంటర్.!
- CM Revanth Reddy : సంగారెడ్డి సభలో రేవంత్ రెడ్డి ఫైర్.. కేసీఆర్కు సవాల్.!
కేటీఆర్ రాజకీయ ప్రయాణమే నాకు స్ఫూర్తి
సన్మానం అందుకున్న అనంతరం ఉదయ్ నాగరాజు మాట్లాడుతూ, కేసీఆర్ నాయకత్వంలో సాగిన తెలంగాణ ఉద్యమం తనకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని గుర్తుచేసుకున్నారు. అమెరికాలో ఉన్నత చదువులు పూర్తిచేసి, మంచి ఉద్యోగాన్ని వదులుకుని స్వరాష్ట్రం కోసం భారత్కు తిరిగివచ్చిన కేటీఆర్ రాజకీయ ప్రయాణం తనను ఎంతగానో ప్రభావితం చేసిందని చెప్పారు. సాధారణ కార్యకర్తగా ప్రయాణం ప్రారంభించి రాష్ట్ర మంత్రిగా, అంతర్జాతీయ గుర్తింపు పొందిన నాయకుడిగా ఎదిగిన కేటీఆర్ తీరు.. చదువుకున్న యువత రాజకీయాల్లోకి వస్తే సమాజంలో గొప్ప మార్పు తేవచ్చనే నమ్మకాన్ని కలిగించిందన్నారు. సమకాలీన రాజకీయాలు, పెట్టుబడుల సాధనపై కేటీఆర్కు ఉన్న దూరదృష్టి అభినందనీయమని చెబుతూ, ఈ కార్యక్రమానికి వచ్చి తనను అభినందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ప్రముఖుల సమక్షంలో ఘనంగా వేడుక
న్యూఢిల్లీలో జరిగిన ఈ అభినందన సభలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రతో పాటు రాజ్యసభ సభ్యుడు దామోదర్ రావు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకుడు జాన్సన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. పలువురు రాజకీయ ప్రముఖుల మధ్య ఈ వేడుక ఎంతో ఉత్సాహంగా జరిగింది.
తాజావార్తలు
-
CM Yogi: ‘మీలా పాడలేను.. బుల్డోజర్ నడపగలను’.. కళాకారులతో సీఎం యోగీ కీలక సంభాషణ
-
Trivikram Srinivas: సూర్యతో సినిమా చేయలేకపోయా.. త్వరలోనే చేస్తా: త్రివిక్రమ్ శ్రీనివాస్
-
Gen Z Lifestyle: ‘జెన్ జీ’ లైఫ్స్టైల్ వెనుక అసలు నిజం.. టూర్లు కావు.. 70% డబ్బు దేనికి పోతోందో తెలుసా..?
-
Vishal Garg: ఒక్క వీడియో కాల్తో 900 మంది ఉద్యోగాలు ఊడగొట్టాడు.. ఇప్పుడు తన CEO పదవే ఊడింది!
-
Venky Atluri: ‘‘ఫ్యామిలీ సినిమా వద్దన్నారు.. కానీ వంశీ గారు నన్ను నమ్మారు’’.. వెంకీ అట్లూరి ఎమోషనల్!
ట్రెండింగ్
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!