పోర్చుగల్ లో ఎన్నికలు.. మెజారిటీ దిశగా సోషలిస్టు పార్టీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకవైపు కరోనా మహమ్మారి , మరోవైపు ఆర్థిక సవాళ్లు ..ఈనేపథ్యంలో పోర్చుగల్లోని సోషలిస్ట్ పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా మూడోమారు విజయపరంపర కొనసాగిస్తోంది. కోవిడ్తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పోర్చుగల్ ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు యూరోపియన్ యూనియన్ వందల కోట్ల యూరోల సాయాన్ని అందించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సోషలిస్టుపార్టీ మరోమారు విజయం సాధించడంతో అంతా ఊపిరిపీల్చుకుంటున్నారు. 230 సీట్లున్న పార్లమెంటులో సోషలిస్టులు 106 సీట్లు గెలుచుకున్నారు. మరికొన్ని సీట్లు వస్తే పూర్తి మెజారిటీ సాధ్యం అవుతుంది.
ఈ ఎన్నికల్లో 98.5 శాతం ఓట్లను లెక్కించగా ఇందులో సోషలిస్టులు 41 శాతం ఓట్లు సాధించారు. సోషలిస్టుల ప్రధాన ప్రత్యర్థి సెంటర్–రైట్ సోషల్ డెమోక్రటిక్ పార్టీకి 28 శాతం ఓట్లు వచ్చాయి. ఈ పార్టీ 65 పార్లమెంటరీ స్థానాలను గెలుచుకుంది. దేశంలోని 1.08 కోట్ల అర్హులైన ఓటర్లలో ఈ దఫా విదేశాల్లో నివసిస్తూ మెయిల్ ద్వారా ఓటు వేసే 15 లక్షల మందిని అంగీకరించలేదు.
Also Read
- Iran: ఖమేనీ అంత్యక్రియలకు కుమారుడు మొజ్తబా గైర్హాజరు? కారణమిదే!
- US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన కుటుంబం మృతి
- Russia: పుతిన్ దేశంలో పెట్రోల్ బంకులు ఖాళీ! రష్యాకు పెట్రోల్ అమ్ముతున్న భారత్..
- Iran - Israel: ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ గురి.. ట్రంప్ వార్నింగ్ను నెతన్యాహు బ్రేక్ చేస్తారా?
మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు ప్రధాని ఆంటినో కోస్టా. ఈ సందర్భంగా ఆయనకు భారత ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. పోర్చుగల్తో బలమైన బంధాన్ని కావాలని భారత్ కోరుకుంటోందన్నారు. ప్రస్తుతానికి 106 సీట్లు తెచ్చుకున్న సోషలిస్టు పార్టీ మరికొన్ని చిన్నపార్టీల సాయం తీసుకుంటుందని భావిస్తున్నారు.
కీలకమయిన సంక్షోభ సమయంలో కొత్త ప్రభుత్వంపై అంచనాలు ఎక్కువగానే వున్నాయని చెప్పాలి. పేదదేశం అయిన పోర్చుగల్ కి ఈయూ 5000 కోట్ల డాలర్ల సాయం అందించేందుకు ముందుకు వచ్చింది. వీటిలో ఎక్కువభాగం మౌలిక సదుపాయాలు కోసం ఉద్దేశించారు. మిగిలిన మొత్తాన్ని ప్రైవేట్ కంపెనీలకు అందిస్తారు. 2015లో అధికారంలోకి వచ్చింది సోషలిస్టు పార్టీ. అయితే బడ్జెట్ను ఆమోదింప చేసుకునేందుకు మిత్రపక్షాలైన లెఫ్ట్ బ్లాక్, పోర్చుగీస్ కమ్యూనిస్ట్ పార్టీలపై సోషలిస్టు పార్టీ ఆధారపడుతోంది.
సోషలిస్టు పార్టీతో పాటు దేశంలో ఈసార చేగా అనే పార్టీ సత్తా చూపింది. మూడేళ్ళ క్రితం దేశంలో ఆవిర్భవించిన ప్రజాకర్షక మరియు జాతీయవాద పార్టీ చేగా ఈ ఎన్నికల్లో 5– 8 శాతం ఓట్లను సాధించింది. గత ఎన్నికల్లో ఈ పార్టీ కేవలం ఒక్క సీటు సాధించింది. ఈ ఎన్నికల్లో 46– 51 శాతం మధ్య పోలింగ్ నమోదైంది. గతంలో కంటే పోలింగ్ శాతం తగ్గింది.
తాజావార్తలు
-
Jailer 2 Release: హుకుం.. రజనీకాంత్ ఫ్యాన్స్కు పండుగ.. ‘జైలర్ 2’ రిలీజ్ డేట్ కన్ఫామ్.!
-
Iran: ఖమేనీ అంత్యక్రియలకు కుమారుడు మొజ్తబా గైర్హాజరు? కారణమిదే!
-
Ganja Racket : మెడిసిన్ పేరుతో గంజాయి.. పోస్టులో డోర్ డెలివరీ.!
-
Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
ట్రెండింగ్
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?