India And Taiwan: ఇండియాకు సెమీకండక్టర్ పరిశ్రమ.. చైనా నుంచి తరలనున్న తైవాన్ కంపెనీ
India And Taiwan: ఇండియాకు మరో టెక్ కంపెనీ రాబోతోంది. చైనాలో ఉన్న తైవాన్కు చెందిన సెమీకండక్టర్కు చెందిన టెక్ కంపెనీని ఇండియాకు తరలించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. చైనా, తైవాన్ల మధ్య సత్సంబంధాలు అంతంత మాత్రంగా కొనసాగుతున్న నేపథ్యంలో త్వరలోనే చైనాలో కొనసాగుతున్న కంపెనీలను తైవాన్ ఇతర దేశాలకు తరలించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగా చైనాలో కొనసాగుతున్న సెమీకండక్టర్ పరిశ్రమలను ఇండియాకు తరలించాలనే యోచనలో తైవాన్ ఉన్నట్టు తెలిసింది.
Read also: Gutha Sukender Reddy: పాదయాత్ర చేసిన భట్టినే ఖమ్మం సభలో పక్కకు నెట్టారు
Also Read
- Jeffrey Epstein: ఎప్స్టీన్ మిస్టరీలో మరో ట్విస్ట్.. ఏడేళ్లుగా దాచిన 'సూసైడ్ లేటర్'.. ప్రపంచ కుబేరులకు దడ!
- US: ముంచుకొస్తున్న ముప్పు.. ఇరాన్ను తుడిచిపెట్టేందుకు ట్రంప్ 'మాస్టర్ ప్లాన్' సిద్ధం!
- Imran Khan: 85% చూపు కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్.. వైద్య కారణాలతో విడుదల కోరుతూ కోర్టుకు అప్పీల్
- Mojtaba Khamenei: "సముద్ర గర్భంలో పాతిపెడతాం".. అమెరికాకు ఇరాన్ సుప్రీం లీడర్ స్ట్రాంగ్ వార్నింగ్..
తైవాన్ను .. చైనా తన ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నిస్తోంది. తైవాన్ హక్కులను చైనా అణచివేస్తోంది. దీనిపై తైవాన్ పోరాటం కొనసాగుతోంది. ఫలితంగా, తైవాన్ టెక్ దిగ్గజం బీజింగ్ నుండి భారతదేశానికి మకాం మార్చాలని నిర్ణయించుకుంది. ఇది భారత్కు లభించిన భారీ విజయంగా పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ తైవాన్ కంపెనీ సెమీకండక్టర్లతో సహా అధిక డిమాండ్ ఉన్న ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను తయారు చేస్తుంది. ఇప్పుడు ఈ కంపెనీ భారత్లో కార్యకలాపాలు ప్రారంభిస్తే సెమీకండక్టర్ చిప్స్ కొరత సమస్య పరిష్కారమవుతుంది. దాంతోపాటు వేలాది మందికి ఉపాధి కల్పించబడుతుంది. అంతే కాకుండా భారత్, తైవాన్ మధ్య సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. తైవాన్ జాతీయ అభివృద్ధి మంత్రి కావో షీన్ క్యూ ఈ విషయంలో ఒక ముఖ్యమైన సూచన ఇచ్చారు. చైనా వైఖరి తైవాన్ పట్ల వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలోనే ఈ టెక్ దిగ్గజం భారత్ వైపు మొగ్గు చూపింది. దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయని కావో షైన్ క్యూ చెప్పారు.
Read also: Gold Royal Enfield: బంగారంతో బుల్లెట్ బైక్.. స్పెషల్ అట్రాక్షన్ గా శివాజీ స్టాచ్యు
తైవాన్ కంపెనీ ప్రపంచ సరఫరా నెట్వర్క్ను బలోపేతం చేయడానికి భారతదేశం కంటే మెరుగైన మరియు సురక్షితమైన ప్రదేశం మరొకటి లేదని.. భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్. మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా అవతరిస్తోంది. ప్రపంచ సరఫరా గొలుసులో ఆధిపత్యం చెలాయించాలని చైనా సవాలు చేస్తోంది. కంపెనీ వృద్ధి అంచనాల కంటే భారత్లో వాణిజ్య స్నేహపూర్వక వాతావరణం మెరుగ్గా ఉందని తైవాన్ ఏషియన్ స్టడీస్ సెంటర్ డైరెక్టర్ క్రిస్టీ సున్ ట్జు తెలిపారు. చైనా, తైవాన్ మధ్య సైనిక ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. తైవాన్పై ఆధిపత్యం కోసం చైనా ప్రయత్నాలు గతంలో కంటే ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల చైనాలోని తైవాన్ కంపెనీల భద్రతపై ఆందోళన నెలకొంది. దాడులు, అల్లర్ల కారణంగా తైవాన్ కంపెనీలు మరింత నష్టపోయే అవకాశం ఉందని చాలా మంది తైవాన్ పరిశ్రమ నిపుణులు చైనా నుండి భారతదేశానికి వెళ్లడం సురక్షితమైనదని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే భారతదేశంలోని తైవాన్ కంపెనీలు విజయవంతంగా పనిచేస్తున్నాయి. ప్రపంచ సెమీకండక్టర్ ఉత్పత్తి వాటాలో తైవాన్ టెక్ కంపెనీలు 70 శాతం కలిగి ఉన్నాయి. ఇప్పుడు చిప్ మార్కెట్లో 90 శాతం వాటాను కలిగి ఉంది. ఈ కంపెనీలు భారత్ వైపు మొగ్గు చూపితే.. ఎలక్ట్రానిక్స్ తయారీలో భారత్ నంబర్ 1 అవుతుందని పరిశ్రమల నిపుణులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
SRH: సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్కు శుభవార్త.. జట్టులోకి మరో కాటేరమ్మ కొడుకు..
-
Cognizant: ఉద్యోగులకు షాక్ ఇవ్వనున్న కాగ్నిజెంట్.!
-
Peddi: మెగా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోండి.. జూన్ 4న ‘పెద్ది’ రిలీజ్..
-
Gutti Vankaya Recipe : కుక్కర్లో గుత్తి వంకాయ.. పదే పది నిమిషాల్లో అద్భుతమైన రుచి.!
-
Student Suicide: నిండు ప్రాణాన్ని బలితీసుకున్న నిరుద్యోగం.. కలల కొలువు దక్కకపోవడంతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!