Russia: ఫ్రిజ్, వాషింగ్ మెషిన్ల భాగాలతో మిస్సైళ్లు.. రష్యాపై ఆంక్షలే కారణం..
Russia: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం రష్యాను ఆర్థికంగా దెబ్బతీస్తోంది. ఇప్పటికే అమెరికా, యూరప్ దేశాలతో పాటు మరికొన్ని దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో యుద్ధానికి అవసరమయ్యే ఆయుధాల విడిభాగాల్లో కూడా కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. చివరకు గృహాల్లో వాడుకునే ఫ్రిజ్, వాషింగ్ మెషిన్ల నుంచి విడి భాగాలను తీసుకుని ఆయుధాలు, మిస్సైళ్లలో వాడుతున్నట్లు యూఎస్ వాణిజ్య కార్యదర్శి గినా రైమోండో వెల్లడించారు. గతేడాది ఫిబ్రవరిలో రష్యా, ఉక్రెయిన్ పై యుద్ధాన్ని ప్రారంభించింది. ఇప్పటికీ యుద్దం మొదలై 15 నెలలు గడుస్తోంది. అప్పటి నుంచి రష్యాపై పాశ్యాత్యదేశాలు ఆంక్షలు విధించాయి.
Read Also: K. Vasu: ఇండస్ట్రీలో విషాదం.. చిరంజీవి మొదటి సినిమా డైరెక్టర్ మృతి..
Also Read
- RBI Gold Reserves: భారత్కు రాబోతున్న 104 టన్నుల బంగారం.. కీలక నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ
- Himanta Sarma: హిమంత వ్యాఖ్యలతో బంగ్లాదేశ్లో కలకలం..
- UAE: 48 గంటల్లో దేశం విడిచి వెళ్లండి.. పాకిస్తానీ ఉద్యోగులకు యూఏఈ షాక్..
- Jeffrey Epstein: ఎప్స్టీన్ మిస్టరీలో మరో ట్విస్ట్.. ఏడేళ్లుగా దాచిన 'సూసైడ్ లేటర్'.. ప్రపంచ కుబేరులకు దడ!
రష్యా ఇతర దేశాల నుంచి అక్రమ వ్యాపారాల ద్వారా చాలా వనరులను పొందుతున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. వాషింగ్ మిషన్లు, రిఫ్రిజ్ రేటర్లలో వాడే సెమీకండక్టర్లను మిస్సైళ్లలో వాడుతున్నట్లు యూనివర్శిటీ ఆఫ్ బ్రైటన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అండ్ లాలో సీనియర్ లెక్చరర్ అయిన డాక్టర్ లారెన్స్ హార్ తెలిపారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యాకు అమెరికా నుంచి సాంకేతిక ఎగుమతులు 70 శాతం క్షీణించాయి. యూకే కూడా రష్యాకు సాంకేతిక బదిలీపై ఆంక్షలు అమలు చేస్తోంది. రష్యా ఆర్థిక వ్యవస్థపై రోజురోజుకు భారం పెరుగుతోందని హార్ అన్నారు.
రష్యా క్షీణిస్తున్న వనరులను భర్తీ చేయడానికి ప్రయత్నిస్తున్నా కూడా ప్రస్తుత పరిస్థితి దీర్ఘకాలంలో నిలకడలేనిదిగా తయారవుతుందని అమెరికా ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. రష్యా నుంచి భారత్, చైనా, టర్కీకి క్రూడ్ ఆయిల్ ప్రవహిస్తోందని హార్ అన్నారు. భారత్ నుంచి రష్యా ఆయిల్ యూరప్ చేరుతుందని వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Property Law India: తల్లిదండ్రుల ఆస్తిపై పిల్లలకు హక్కు ఉందని అనుకుంటున్నారా? ఈ నిజం తెలిస్తే షాక్ అవుతారు!
-
Pawan Kalyan : ఇది కూటమి ప్రభుత్వం తీసుకువస్తున్న విప్లవాత్మక మార్పులకు నిదర్శనం
-
Pension Hike: పెన్షనర్లకు కేంద్రం శుభవార్త.. రూ. 7,500లకు పెరగనున్న కనీస పెన్షన్..?
-
Bengal Elections: ఎన్నికల కౌంటింగ్ ముందు సుప్రీంకోర్టుకు తృణమూల్..
-
Polavaram Project : పోలవరం ప్రాజెక్ట్పై కేంద్రం మెగా ప్లాన్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!