Russia-Ukraine War: ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడి.. 13 మంది పౌరులు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russia-Ukraine War: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఆరంభం అయి ఏడు నెలలకు చేరినా.. ఇరు వైపుల దాడులు ఆగడం లేదు. తాజాగా మరోసారి రష్యా, ఉక్రెయిన్ పై విరుచుకుపడింది. సెంట్రల్ ఉక్రెయిన్ లోని డ్నిప్రోపెట్రోవ్స్క్ ప్రాంతంలో రష్యా దాడులు చేసింది. ఈ దాడుల్లో 13 మంది సాధారణ పౌరులు మరణించినట్లు స్థానిక గవర్నర్ వాలెంటివ్ రెజ్నిచెంకో తెలిపారు. రష్యా దాడుల్లో 11 మంది అక్కడిక్కడే మరణించగా.. మరో ఇద్దరు చికిత్స పొందుతూ మరణించారు. జపోరిజ్జియా అణు విద్యుత్ ప్లాంట్ కు నుంచి డ్నీపర్ నదికి అవతలి వైపు ఉండే మార్గానెట్స్ గ్రామంపై జరిగిన దాడిలోనే 12 మంది మరణించినట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతంలోని ఎత్తైన భవనాలు, స్కూళ్లు, ఎలక్ట్రిసిటీ లైన్లు దెబ్బతిన్నాయి.
Read Also: We are not Lovers: ప్రేమికులని ముద్ర.. మనస్థాపంతో వారిద్దరు సూసైడ్
Also Read
- H-1B Visa: భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ షాక్.. హెచ్-1బీ వీసా రుసుము భారీగా పెంపు..
- Strait of Hormuz: హోర్ముజ్పై ఇరాన్ కొత్త ప్లాన్.. ప్రపంచ దేశాలకు బిగ్ షాక్..
- Jinping: భారీ బృందంతో ఢిల్లీకి వస్తున్న చైనా అధ్యక్షుడు.. బ్రిక్స్లో పాల్గొననున్న జిన్పింగ్
- Jaishankar-Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్తో జైశంకర్ భేటీ.. రెండు దేశాల సంబంధాలపై చర్చ
ఇదిలా ఉంటే మంగళవారం రష్యా నియంత్రణలో ఉన్న క్రిమియాలోని రష్యా వైమానిక స్థావరంలో పేలుళ్లు జరిగి ఒకరు మరణించారు. క్రిమియాలోని నోవోఫెడోరివ్కా సమీపంలోని సాకీ వైమానిక స్థావరం వద్ద ఈ పేలుడు సంభవించింది. అయితే ఈ దాడికి సంబంధించి ఉక్రెయిన్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. దాడి ఎవరు చేశారనేదానిపై స్పష్టత లేదు.
నాటోలో చేరడాన్ని వ్యతిరేకిస్తూ.. రష్యా, ఉక్రెయిన్ పై ఫిబ్రవరిలో సైనిక చర్య మొదలుపెట్టింది. కీవ్ తో పాటు ఖార్కీవ్, సుమీ, మరియోపోల్ నగరాలపై దాడులు చేసింది. మరియోపోల్, ఖార్కీవ్ నగరాలు మసిదిబ్బలను తలపిస్తున్నాయి. అయితే రాజధాని కీవ్ ను దక్కించుకునేందుకు రష్యా దళాలు ప్లాన్ చేసినా.. అమెరికా, యూకే వంటి నాటో దేశాల వ్యూహాత్మక, సైనిక, ఆయుధ సహకారంతో ఉక్రెయిన్ బలగాలు కీవ్ ను కాపాడుకున్నాయి. అయితే కీవ్ దక్కించుకోవడంలో విఫలం అయిన రష్యా.. ప్రస్తుతం తూర్పు ప్రాంతంలోని డాన్ బోస్ ప్రాంతం నుంచి ఉక్రెయిన్ పై దాడులు చేస్తోంది.
తాజావార్తలు
-
Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
-
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలపై వైద్యశాఖ భారీ కసరత్తు.. 1,110 వైద్య శిబిరాలు, 30 ఫీల్డ్ ఆస్పత్రులు..
-
Pluto OTT: తాగుడుకు బానిస అయ్యే ఏలియన్.. ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సైన్స్ ఫిక్షన్ మూవీ
-
BethlehemKudumbaUnit : తెలుగులో విడుదలవుతున్న నివిన్ పౌలి లేటెస్ట్ బ్లాక్బస్టర్ ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
ట్రెండింగ్
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!