Russia-Ukraine: రష్యా-ఉక్రెయిన్ మధ్య కీలక పరిణామం.. ఇరు పక్షాల యుద్ధ ఖైదీల విడుదల
- రష్యా-ఉక్రెయిన్ మధ్య కీలక పరిణామం
- ఇరు పక్షాల యుద్ధ ఖైదీల విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యా-ఉక్రెయిన్ మధ్య కీలక పరిణామం చోటుచేసుకుంది. రెండు దేశాల మధ్య గత నాలుగేళ్ల నుంచి భీకర యుద్ధం సాగుతోంది. ట్రంప్ అధికారంలోకి వచ్చాక శాంతి చర్చలు ప్రారంభించారు. కానీ సత్ఫలితాన్ని ఇవ్వలేదు. మరోసారి ఇస్తాంబుల్ వేదికగా శాంతి చర్చలకు సిద్ధపడుతుండగా అకస్మాత్తుగా ఉక్రెయిన్.. రష్యాపై డ్రోన్ దాడులు చేసింది. దీంతో రష్యా వైమానిక స్థావరాలు దెబ్బతిన్నాయి. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఇది కూడా చదవండి: Vivo T4 Ultra: 50MP డ్యూయల్ కెమెరా, 5500mAh బ్యాటరీలతో వివో ఫ్లాగ్షిప్ మొబైల్ లాంచ్.. ధర ఎంతంటే..?
Also Read
- PM Modi: వెనెజువెలాకు భారత్ అండ.. సహాయ సహకారాలు అందిస్తామన్న ప్రధాని మోడీ..
- 39 సెకన్లలో దాదాపు లక్ష మంది మృతి?.. Venezuela Earthquakeపై షాకింగ్ రిపోర్ట్..
- Explainer: చరిత్రలో దాచిన ఆకలి విషాదం.. 30లక్షల మంది భారతీయుల చావుకు చర్చిల్ కారణం?
- US Citizenship Fee Hike: ఎన్నారైలకు బిగ్ షాక్.. భారీగా పెరగనున్న అమెరికా సిటిజన్షిప్ ఫీజులు?
ఇలాంటి పరిస్థితుల్లో రెండు దేశాల మధ్య సరికొత్త వాతావరణం నెలకొంది. ఇస్తాంబుల్ వేదికగా జరిగిన చర్చల్లో కీలక పురోగతి లభించింది. శాంతి చర్చలు ఫలించడంతో 25 ఏళ్లలోపు రష్యా-ఉక్రెయిన్కు చెందిన ఖైదీలను మార్పిడి చేసుకున్నాయి. దీంతో యుద్ధ ఖైదీల ముఖాల్లో ఆనందం వెల్లువిరిసింది. వీళ్లంతా యుద్ధం ప్రారంభం నుంచి ఉన్న ఖైదీలుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒక రహస్య ప్రదేశంలో ఈ ఖైదీల మార్పిడి జరిగినట్లుగా సమాచారం.
ఇది కూడా చదవండి: Musk: ట్రంప్తో గొడవపై మస్క్ క్షమాపణ.. పోస్టులపై విచారం
ఖైదీల విడుదలకు సంబంధించిన వీడియోను రష్యా రక్షణ శాఖ పోస్టు చేసింది. ప్రస్తుతం బెలారస్లో వైద్యం అందిస్తున్నట్లు తెలిపింది. తర్వాత మాస్కోలోని ఆస్పత్రులకు తరలిస్తామని వెల్లడించింది. అలాగే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా యుద్ధ ఖైదీల మార్పిడిని ధ్రువీకరించారు. ఇస్తాంబుల్లో జరిగిన రెండో దశ చర్చల్లో బందీలను మార్చుకునేందుకు ఇరువర్గాలు అంగీకరించినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఓ వైపు చర్చలు కొనసాగుతుండగానే రష్యా ఇంకోవైపు ఉక్రెయిన్పై డ్రోన్ దాడులు చేస్తూనే ఉంది. మంగళవారం కీవ్పై దాడులకు పాల్పడింది. ఈ దాడిలో ముగ్గురు మరణించగా.. 13 మంది గాయపడ్డారు. గత మూడేళ్ల యుద్ధంలో రష్యా జరిపిన అతిపెద్ద దాడుల్లో ఇది ఒకటని జెలెన్స్కీ వెల్లడించారు. ఇక ఉక్రెయిన్ కూడా ఇటీవల స్పైడర్ వెబ్ పేరుతో రష్యాపై భీకర దాడులు చేశారు.
తాజావార్తలు
-
RC 17 : కన్ఫ్యూజన్లో పడేసిన సుకుమార్
-
IND Vs IRL: క్రికెట్ అభిమానులకు అలర్ట్.. ఐర్లాండ్ సిరీస్ సమయాల్లో మార్పులు.. రేపటి మ్యాచ్ సమయం ఇదే..
-
CM Vijay: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన విజయ్.. ఫొటోలు వైరల్
-
Ketan Agarwal Murder: యూట్యూబ్ సెర్చ్, కేఫ్లో మంతనాలు.. కేతన్, సియా కేసులో కీలక ఆధారాలు..
-
DK Shivakumar: తుంగభద్ర వేదికగా నీటి ఐక్యత సందేశం ఇచ్చిన డీకే శివకుమార్
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!