Canada Accident: కెనడాలో రోడ్డు ప్రమాదం.. 15 మంది వృద్దులు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Canada Accident: రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. ప్రమాదాల్లో మరణాలు పెరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా మరణిస్తున్న వారిలో ప్రమాదాల మూలంగా మరణిస్తున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉంటోందని ఈ మధ్య నిర్వహించిన సర్వేలో తేలింది. కెనడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 15 మంది మరణించారు. కెనడాలో వృద్ధులతో వెళ్తోన్న మినీ బస్సును ఓ భారీ ట్రక్కు ఢీకొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 15 మంది చనిపోయారు. ఈ ఘటనలో 10 మంది వరకూ గాయపడినట్టు అధికారులు తెలిపారు. సెంట్రల్ కెనడాలోని మానిటోబా ప్రావిన్స్లో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. విన్నిపెగ్కు పశ్చిమాన ఉన్న కార్బెర్రీ పట్టణం వద్ద ఈ రోడ్డు ప్రమాద జరిగినట్టు పోలీసులు తెలిపారు. తక్షణమే స్పందించిన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
Read also: Samantha : ఆ సమయంలో దేవుడిని మనశ్శాంతిని ఇవ్వమని కోరుకున్నా…
Also Read
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Thailand Train Crash: బ్యాంకాక్లో ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 8 మంది మృతి
- Trump China Visit: చైనాను అస్సలు నమ్మని ట్రంప్.. చెత్త బుట్టలోకి చైనీస్ గిఫ్ట్స్..
- Lightning Strike: పక్కనే పిడుగు పడినా బతికాడు.. షాక్లో సైంటిస్టులు..ఈ కుర్రాడిలో అంతుచిక్కని శక్తులున్నాయా?
ఒకటి మరియు ఐదో నెంబరు జాతీయ రహదారులు కలిసే కూడలిలో దాదాపు 25 మంది వృద్దులతో ప్రయాణిస్తున్న మినీ బస్సును ట్రక్కు ఢీకొట్టిందని మానిటోబా అధికారి రాబ్ హిల్ పేర్కొన్నారు. ప్రమాదంలో 15 మంది చనిపోయినట్టు ధ్రువీకరించారు. గాయపడినవారిని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రులకు తరలించామని తెలిపారు. ఈ ప్రాంతంలోని ఆసుపత్రులు పెద్ద సంఖ్యలో బాధితులకు ప్రతిస్పందిస్తున్నాయని మరియు అన్ని సౌకర్యాలు అందిస్తున్నట్టు అధికారులు ధృవీకరించారు. కార్బెర్రీకి ఉత్తరాన ట్రాన్స్-కెనడా హైవేపై ఈ ప్రమాదం జరిగింది. మధ్యాహ్న సమయంలో ఘటన జరిగిందని ఘటనా స్థలానికి సమీపంలోని రెస్టారెంట్లో పనిచేసే వ్యక్తి తెలిపారు. హైవే సమీపంలోని గుంటలో కాలిపోయిన వాహనాన్ని చూసినట్టు చెప్పారు. ఘటన జరిగిన ప్రదేశంలో అనేక అత్యవసర వాహనాలు, రెండు హెలికాప్టర్లు ఉన్నాయన్నారు. ఇటువంటి మంటలను తానెప్పుడూ చూడలేదని, చుట్టూ పొగలు వ్యాపించాయని అతడు చెప్పాడు.
Read also: Fiji Earthquake: ఫిజీలో భీకర భూకంపం.. రిక్టార్ స్కేలుపై 6.8గా నమోదు
ప్రమాదంపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తమకు ఇష్టమైన వారిని కోల్పోయిన వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నట్టు తన అధికారిక ట్విట్టర్ ఫీడ్లో తెలిపారు. బంధువులను కోల్పోయిన వారు అనుభవిస్తున్న బాధను తాను ఊహించగలనని.. కెనడియన్లు మీ కోసం ఉన్నారని భరోసా ఇచ్చారు.
ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నట్టు ట్వీట్ చేశారు.
తాజావార్తలు
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
-
PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
-
Shani Parivartan 2026: మే 17న శని నక్షత్ర మార్పు.. ఈ 4 రాశుల వారికి అదృష్ట యోగం
-
Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
-
Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..