Rishi Sunak: యూకే ప్రధాని రేసులో రిషి దూకుడు.. రెండో రౌండ్లోనూ ముందంజ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూకేలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా చేయక తప్పలేదు. ప్రస్తుతం కొత్త ప్రధానిని ఎన్నుకునే వరకు ఆపద్ధర్మ ప్రధానిగా ఉన్నారు. అయితే తొలిసారిగా యూకే ప్రధాని ఎన్నికలు ఇండియాలో కూడా చాలా ఆసక్తి క్రియేట్ చేస్తున్నాయి. దీనికి కారణం భారత సంతతి వ్యక్తి రిషి సునాక్ ప్రధాని రేసులో ఉండటమే. రిషి సునక్ తో పాటు మరో భారత సంతతి వ్యక్తి సుయెల్లా బ్రేవర్మన్ కూడా ప్రధాని పోటీలో ఉన్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే యూకేకు ప్రధాని పీఠం రిషి సునాక్ ను వరించే అవకాశాలే అధికంగా ఉన్నాయి. ఇదిలా ఉంటే ప్రధాని రేసులో రిషి సునాక్ దూసుకుపోతున్నారు. తొలిరౌండ్లో సత్తా కనబరిచిన రిషి.. రెండో రౌండ్లోనూ ముందంజలో ఉన్నారు.
కన్జర్వేటివ్ పార్టీ అధినేత పదవి కోసం గురువారం జరిగిన రెండో రౌండ్లోనూ ఆయన అత్యధికంగా 101 ఓట్లు గెలుచుకున్నారు. దాంతో పాటు తదుపరి రౌండ్కు అర్హత సాధించారు. రెండో రౌండ్లో సునాక్ తర్వాత.. వాణిజ్య మంత్రి పెన్నీ మోర్డాంట్ (83 ఓట్లు), విదేశాంగ కార్యదర్శి లిజ్ ట్రస్ (64 ఓట్లు), మాజీ మంత్రి కెమీ బదెనోచ్ (49 ఓట్లు), టోరీ బ్యాక్బెంచర్ టామ్ తుగెన్ధాట్ (32 ఓట్లు) వరుసగా నిలిచారు. వీరంతా వచ్చే వారం జరగబోయే తదుపరి రౌండ్లో పోటీ పడనున్నారు. భారత సంతతికి చెందిన మరో అభ్యర్థి అటార్నీ జనరల్ సుయెలా బ్రావెర్మన్.. రెండో రౌండ్లో 27 ఓట్లు రావడం వల్ల పోటీ నుంచి నిష్క్రమించారు.
Also Read
- Pakistan: అసిమ్ మునీర్ గుట్టు బట్టబయలు.. న్యూక్లియర్ డీల్ కోసం చైనాకు పాక్ తాకట్టు.!
- Iran: భారీ ఆదాయం సమకూర్చుకునే పనిలో ఇరాన్.. వాటిపై ‘డిజిటల్ టాక్స్’ వసూలుకు ప్లాన్..
- Pakistan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను గద్దె దించేందుకు అమెరికా కుట్ర.. బయటపడ్డ సంచలన రహస్యాలు!
- Donald Trump: త్వరగా నిర్ణయం తీసుకోండి, లేకపోతే మీకు ఏమీ మిగలదు.. ఇరాన్ను మళ్లీ హెచ్చరించిన ట్రంప్
ప్రధాని పదవి కోసం జరిగిన తొలి రౌండ్లో సత్తా కనబరిచారు రిషి సునాక్. అందరి కన్నా ఎక్కువగా ఎంపీల ఓట్లు సాధించారు. రిషి సునాక్ కు మొదటి రౌండ్లో 88 ఓట్లు సాధించగా.. పెన్నీ మోర్డాంట్ 67 ఓట్లు, ట్రస్ లిజ్ 50 ఓట్లు సాధించారు. మొత్తం ఎనిమిది మందిలో ప్రస్తుతం ఆరుగురు రెండో రౌండ్లోకి రాగా రెండో రౌండ్లోనూ రిషి సునాక్ ఎక్కువ ఓట్లను పొందారు.
Booster Dose : రేపటి నుంచి ఉచితంగా బూస్టర్ డోసు..
యూకేలో జరిగిన రాజకీయ సంక్షోభంలో ముందుగా రాజీనామా చేసిన వ్యక్తుల్లో ఛాన్సలర్గా ఉన్న రిషి సునాక్ ఒకరు. ఆయన రాజీనామా తర్వాతే ఒక్కక్కరిగా కేబినెట్ మంత్రులు రాజీనామా చేశారు. దీంతో ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో కొత్త ప్రధానిని ఎన్నుకోవడంతో పాటు కన్జర్వేటివ్ పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు ఎన్నికలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 5 లోపు బోరిస్ జాన్సన్ వారసున్ని ఎన్నుకోవాలని అనుకుంటున్నారు.
తాజావార్తలు
-
West Bengal: బెంగాల్లో మదర్సా శాఖ మతపర పథకాలకు బ్రేక్.. సువేందు సర్కార్ కీలక నిర్ణయం
-
Peddi Trailer: పెద్ది ట్రైలర్ వచ్చేసింది చూసేయండి!
-
DMK: సీఎం విజయ్ ప్రభుత్వం 6 నెలల్లోపే కూలిపోతుంది..
-
HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
-
AI Vs CRYPTO: రెచ్చిపోతున్న హ్యాకర్లు..వణికిపోతున్న ఇన్వెస్టర్లు.. క్రిప్టో కొంప కూల్చుతున్న ఏఐ..!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..