Ranil Wickramasinghe: శ్రీలంక ముందున్న ఏకైక మార్గం అదే.. లేదంటే కోలుకోలేం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ranil Wickramasinghe Says They Have Only One Option On Economic Recovery: శ్రీలంకలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అందరికీ తెలుసు. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో ఆ దేశం సతమతమవుతుంది. ధరలు ఆకాశాన్నంటడంతో.. అక్కడి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే.. తమ ముందు ప్రపంచ రుణదాత, అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) సంస్థ మద్దతు పొందడం ఒక్కటే మార్గమని తాజాగా ఆ దేశ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందన్న విషయం తనకు తెలుసని.. అలాగే దేశం ఎలాంటి దుర్భర పరిస్థితుల్లో ఉందో కూడా తెలుసని ఆయన అన్నారు. ఎంతోమంది ఉపాధి కోల్పోయారని, వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోయాయని, దీంతో జీవనవ్యయం భారంగా మారి, ప్రజల జీవనస్థితిగతుల్లో మార్పులొస్తున్నాయన్నారు.
Virat Kohli: శ్రీలంకపై కోహ్లీ సెంచరీ.. నమోదైన రికార్డులివి.. వరల్డ్లోనే తొలి ఆటగాడిగా..
Also Read
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్పై సర్వత్రా ఆసక్తి
- Pakistan: మమ్మల్ని కాపాడినందుకు ట్రంప్నకు రుణపడి ఉంటాం: షహబాజ్ షరీఫ్..
- Iran: యురేనియం బదిలీపై ఇరాన్ సంచలన నిర్ణయం.. పాక్కు కీలక సమాచారం!
ఈ ఆర్థిక సంక్షోభం విద్య, ఆరోగ్య రంగాలను ప్రభావితం చేసిందని.. తద్వారా ప్రజలు ఇంతకుముందు అనుభవించిన సౌకర్యాలను పొందలేకపోతున్నారని రణిల్ పేర్కొన్నారు. ఈ సమస్యలను గల కారణాలేంటి? దీన్ని ఎలా ఎదుర్కోవాలి? అని చర్చించుకోవడం వ్యర్థమని.. జరగాల్సిన నష్టం జరిగిపోయిందని అన్నారు. ప్రస్తుతం ఉన్న స్థితిలో తమకు ఐఎంఎఫ్ సాయం పొందడం ఒక్కటే మార్గమని.. లేకపోతే ఎన్నటికీ కోలుకోలేం అని నొక్కి చెప్పారు. ప్రస్తుతం తాము రుణ పునర్వ్యవస్థీకరణ కార్యక్రమాన్ని చేపడుతున్నామని.. ఈ విషయం గురించి ఇప్పటికే జపాన్తో చర్చలు జరిపామని తెలిపారు. తాము చైనా, జపాన్, భారత్ నుంచి రుణ సాయం పొందామన్నారు. అటు అమెరికా, యూరప్లో ఆర్థిక వృద్ధి మందగిస్తోందని.. దాని వల్ల వచ్చే ఏడాది శ్రీలంక ఎగుమతి మార్కెట్ పడిపోయే అవకాశం ఉందని అంచనా వేశారు. అలా జరగకుండా ఉండాలంటే.. పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలన్నారు.
Akhilesh Yadav: గంగా విలాస్ కొత్తదేం కాదు.. 17 ఏళ్ల పాతది
ఐఎంఎఫ్ విశ్వాసాన్ని పొందేలా తమ ప్రభుత్వం విజయవంతమైన చర్చలు జరపడంలో విజయం సాధించిందని.. ఈ ఏడాది తొలి త్రైమాసిక తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని రణిల్ ఆశాభావం వ్యక్తం చేశారు. 2024కల్లా మెరుగైన వృద్ధి సాధించగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసిన ఆయన.. ప్రభుత్వ రంగంతోపాటు ప్రైవేట్ రంగాన్ని కూడా బలేపేతం చేయాలన్నారు. దేశంలో అభివృద్ధి కార్యక్రమాలని కొనసాగించాలని.. ఫలితంగా ప్రజలకు ఉపశమనం కలుగుతుందన్నారు. కాగా.. ఈ సమావేశంలో ప్రభుత్వం, సెమీ ప్రభుత్వం, ప్రైవేటు కార్మిక సంఘాల నాయకులు, ప్రతినిధులతో దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభానికి పరిష్కారాలను కనుగొనడం, దిద్దుబాటు చర్యలపై రణిల్ చర్చించారు.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!