Ranil Wickramasinghe: శ్రీలంక ముందున్న ఏకైక మార్గం అదే.. లేదంటే కోలుకోలేం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ranil Wickramasinghe Says They Have Only One Option On Economic Recovery: శ్రీలంకలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అందరికీ తెలుసు. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో ఆ దేశం సతమతమవుతుంది. ధరలు ఆకాశాన్నంటడంతో.. అక్కడి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే.. తమ ముందు ప్రపంచ రుణదాత, అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) సంస్థ మద్దతు పొందడం ఒక్కటే మార్గమని తాజాగా ఆ దేశ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందన్న విషయం తనకు తెలుసని.. అలాగే దేశం ఎలాంటి దుర్భర పరిస్థితుల్లో ఉందో కూడా తెలుసని ఆయన అన్నారు. ఎంతోమంది ఉపాధి కోల్పోయారని, వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోయాయని, దీంతో జీవనవ్యయం భారంగా మారి, ప్రజల జీవనస్థితిగతుల్లో మార్పులొస్తున్నాయన్నారు.
Virat Kohli: శ్రీలంకపై కోహ్లీ సెంచరీ.. నమోదైన రికార్డులివి.. వరల్డ్లోనే తొలి ఆటగాడిగా..
Also Read
- Donald Trump: ట్రంప్ గోల్ఫ్ కోర్స్ సమీపంలో లోడెడ్ గన్తో వ్యక్తి అరెస్ట్.. మరో హత్యాయత్నం కుట్రపై అనుమానాలు?
- India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
- Country Name Changed: తమ దేశం పేరు మార్చుకున్న ‘నౌరు’.. కొత్త పేరు ఇదే..
- US-Iran: హార్ముజ్ తెరుచుకుంటుందా? అమెరికా కీలక ప్రకటన
ఈ ఆర్థిక సంక్షోభం విద్య, ఆరోగ్య రంగాలను ప్రభావితం చేసిందని.. తద్వారా ప్రజలు ఇంతకుముందు అనుభవించిన సౌకర్యాలను పొందలేకపోతున్నారని రణిల్ పేర్కొన్నారు. ఈ సమస్యలను గల కారణాలేంటి? దీన్ని ఎలా ఎదుర్కోవాలి? అని చర్చించుకోవడం వ్యర్థమని.. జరగాల్సిన నష్టం జరిగిపోయిందని అన్నారు. ప్రస్తుతం ఉన్న స్థితిలో తమకు ఐఎంఎఫ్ సాయం పొందడం ఒక్కటే మార్గమని.. లేకపోతే ఎన్నటికీ కోలుకోలేం అని నొక్కి చెప్పారు. ప్రస్తుతం తాము రుణ పునర్వ్యవస్థీకరణ కార్యక్రమాన్ని చేపడుతున్నామని.. ఈ విషయం గురించి ఇప్పటికే జపాన్తో చర్చలు జరిపామని తెలిపారు. తాము చైనా, జపాన్, భారత్ నుంచి రుణ సాయం పొందామన్నారు. అటు అమెరికా, యూరప్లో ఆర్థిక వృద్ధి మందగిస్తోందని.. దాని వల్ల వచ్చే ఏడాది శ్రీలంక ఎగుమతి మార్కెట్ పడిపోయే అవకాశం ఉందని అంచనా వేశారు. అలా జరగకుండా ఉండాలంటే.. పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలన్నారు.
Akhilesh Yadav: గంగా విలాస్ కొత్తదేం కాదు.. 17 ఏళ్ల పాతది
ఐఎంఎఫ్ విశ్వాసాన్ని పొందేలా తమ ప్రభుత్వం విజయవంతమైన చర్చలు జరపడంలో విజయం సాధించిందని.. ఈ ఏడాది తొలి త్రైమాసిక తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని రణిల్ ఆశాభావం వ్యక్తం చేశారు. 2024కల్లా మెరుగైన వృద్ధి సాధించగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసిన ఆయన.. ప్రభుత్వ రంగంతోపాటు ప్రైవేట్ రంగాన్ని కూడా బలేపేతం చేయాలన్నారు. దేశంలో అభివృద్ధి కార్యక్రమాలని కొనసాగించాలని.. ఫలితంగా ప్రజలకు ఉపశమనం కలుగుతుందన్నారు. కాగా.. ఈ సమావేశంలో ప్రభుత్వం, సెమీ ప్రభుత్వం, ప్రైవేటు కార్మిక సంఘాల నాయకులు, ప్రతినిధులతో దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభానికి పరిష్కారాలను కనుగొనడం, దిద్దుబాటు చర్యలపై రణిల్ చర్చించారు.
తాజావార్తలు
-
Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
-
Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
Tejaswini Nandamuri : బాలయ్య కూతురిని డైరెక్ట్ చేయబోయే దర్శకురాలు ఎవరంటే?
ట్రెండింగ్
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!