Rahul Gandhi: కొంతమందికే విద్యా హక్కు.. వాక్ స్వాతంత్ర్యం లేదు.. రాహుల్గాంధీ సంచలన వ్యాఖ్యలు
- కొంతమందికే విద్యా హక్కు
- వాక్ స్వాతంత్ర్యం లేదు
- రాహుల్గాంధీ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీ మరోసారి విదేశాల్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో కొంత మందికే విద్యా హక్కు ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఉన్నత కులాల ప్రయోజనాలకే ప్రభుత్వ సేవ చేస్తోందని.. మధ్యతరగతి, దిగువ కులాలు, గిరిజన వర్గాల చరిత్ర, సంప్రదాయాలు, సహకారాలను విస్మరిస్తుందని ధ్వజమెత్తారు. అంతేకాకుండా దేశంలో వాక్ స్వాతంత్ర్యంపై కూడా దాడి జరుగుతోందని రాహుల్ గాంధీ ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Israel: రెండేళ్ల తర్వాత విషాదకర నిర్ణయం.. హమాస్ చేతిలో ప్రియురాలి చనిపోయిందని ప్రియుడు ఆత్మహత్య
Also Read
- Trump: నా యుద్ధ అధికారాల్ని పరిమితం చేయడం దేశద్రోహం.. డెమోక్రాట్లపై ట్రంప్ ఆగ్రహం
- Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్టాక్ సృష్టికర్త..
- Mojtaba Khamenei: శత్రువుల కుట్రలపై అప్రమత్తంగా ఉండాలి.. ఇరానీయులకు మొజ్తబా ఖమేనీ సందేశం
- Pakistan: పాకిస్తాన్ను మెచ్చుకున్న ఎలాన్ మస్క్.. గ్యాంగ్రేప్ దోషులకు ఉరిశిక్షపై ప్రశంసలు
పెరూలోని పోంటిఫికల్ కాథలిక్ విశ్వవిద్యాలయం, చిలీ విశ్వవిద్యాలయంలోని విద్యార్థులను ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగించారు. భారతదేశంలో విద్యా సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. గొప్ప వైవిధ్యాన్ని ప్రతిబింబించే విద్యా వ్యవస్థ దేశానికి అవసరం అని పేర్కొన్నారు. కొంత మందికే విద్య ప్రత్యేక హక్కుగా మారకూడదని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Suresh Gopi: కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేస్తా.. తిరిగి సినిమాలు చేసుకుంటా.. సురేష్ గోపి సంచలన ప్రకటన
ప్రస్తుతం దేశంలో ప్రభుత్వ విద్య వెనక్కి తగ్గి ప్రైవేటు సంస్థలు ఆధిపత్యం చెలాయించడానికి అనుమతించారని ఆరోపించారు. ప్రైవేటు సంస్థలు ఉన్నప్పటికీ.. ప్రభుత్వం అందరికీ అధిక నాణ్యత కూడిన విద్యను అందించాలని కోరారు. విద్య కోసం ఎక్కువ నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
రాహుల్ గాంధీ దక్షిణ అమెరికాకు వెళ్లి చాలా రోజులైంది. దాదాపు 15 రోజులైంది. సెప్టెంబర్ 26న దక్షిణ అమెరికాకు వెళ్లారు. అప్పటి నుంచి రాహుల్ గాంధీ అక్కడే పర్యటిస్తున్నారు. అయితే రాహుల్ గాంధీ రహస్య పర్యటన ఎందుకు అని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ ప్రశ్నించారు. పర్యటన యొక్క అసలు ఉద్దేశం ఏంటి? అని నిలదీశారు.
తాజావార్తలు
-
Mamata Banerjee: నా సీటు నుంచి పోటీ చేయండి.. మమతా బెనర్జీకి బంపర్ ఆఫర్..
-
Trump: నా యుద్ధ అధికారాల్ని పరిమితం చేయడం దేశద్రోహం.. డెమోక్రాట్లపై ట్రంప్ ఆగ్రహం
-
Rajya Sabha: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కీలక నేతలకు అవకాశం
-
Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
-
Kitchen Tips: ఈ వస్తువుల్ని ఫ్రిజ్లో పెట్టొద్దు.. నెమ్మదిగా విషంగా మారుతాయి..
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!