Suresh Gopi: కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేస్తా.. తిరిగి సినిమాలు చేసుకుంటా.. సురేష్ గోపి సంచలన ప్రకటన
- కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేస్తా
- తిరిగి సినిమాలు చేసుకుంటా
- సురేష్ గోపి సంచలన ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్రమంత్రి సురేష్ గోపి సంచలన ప్రకటన చేశారు. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. సినిమాల్లో నటించకపోవడం వల్ల తన ఆదాయం తగ్గిందని.. తిరిగి సినిమాల్లోకి వెళ్లి ఆదాయాన్ని చక్కదిద్దుకుంటానని వెల్లడించారు. ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఈ ప్రకటన చేశారు.
ఇది కూడా చదవండి: Trump: నోబెల్ కోసం అలా చేయలేదు.. భారత్-పాక్ యుద్ధాన్ని ఆపింది నేనే.. ట్రంప్ నోట మళ్లీ అదే పాట
Also Read
- BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
సురేష్ గోపి త్రిస్సూర్ ఎంపీ. కేరళ నుంచి ఎన్నికైన బీజేపీ ఎంపీ. కేరళ నుంచి ఎంపికైన సురేష్ గోపికి మోడీ తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. అప్పటి వరకు మలయాళ సినీ పరిశ్రమలో ప్రముఖ స్థానంలో ఉన్నారు. 2016 అక్టోబర్లో బీజేపీలో చేరారు. 2024లో త్రిస్సూర్ లోక్సభ స్థానాన్ని కేటాయించడంతో విజయం సాధించారు. కేరళ నుంచి బీజేపీ తరపున గెలిచిన ఏకైక ఎంపీ సురేష్ గోపినే కావడం విశేషం. కేంద్ర పర్యాటక, పెట్రోలియం, సహజ వాయువు శాఖ సహాయ మంత్రిగా కొనసాగుతున్నారు.
ఇది కూడా చదవండి: Hamas-Israel: నేడు బందీల విడుదల.. ఇజ్రాయెల్కు ట్రంప్.. యుద్ధం ముగిసిందని ప్రకటన
ఆదివారం ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని.. నిజాయితీగా చెబుతున్నా.. కేరళ నుంచి రాజ్యసభకు ఎన్నికైన సి.సదానందన్ మాస్టర్ను కేంద్రమంత్రిని చేయాలని సురేష్ గోపి అభ్యర్థించారు. సదానందన్ చాలా సీనియర్ నాయకుడు.. తన బాధ్యతను ఆయనకు అప్పగిస్తే కన్నూర్ జిల్లా రాజకీయాల్లో కొత్త ఉత్సాహం వస్తుందని చెప్పుకొచ్చారు. సదానందన్ ఎంపీ కార్యాలయం త్వరలో మంత్రి కార్యాలయంగా మారాలని ఆకాంక్షించారు. తనకు ఆదాయం తగ్గిపోయిందని.. ఈ నేపథ్యంలోనే తిరిగి సినిమాల్లోకి వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. నటనను కొనసాగించి.. మరింత సంపాదించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అయినా తానెప్పుడు కేంద్రమంత్రిని కావాలని కోరుకోలేదన్నారు. తన సినిమా కెరీర్ను ఎప్పుడూ వదులుుకోవాలని భావించలేదని చెప్పుకొచ్చారు.
సదానందన్.. ప్రఖ్యాత ఉపాధ్యాయుడు. సామాజిక కార్యకర్త. బీజేపీతో మంచి సంబంధాలు ఉన్నాయి. చాలా సీనియర్ నాయకుడు. 2021లో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. జూలైలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము రాజ్యసభ ఎంపీగా ఎంపిక చేశారు. 1994లో జరిగిన హింసలో రెండు కాళ్లు పోయాయి. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా-మార్క్సిస్ట్ వివాదం హింసాత్మకంగా మారినప్పుడు రెండు కాళ్లను ప్రత్యర్థులు నరికేశారు. ఇప్పుడు రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో సదానందన్ను కేంద్రమంత్రిగా చేయాలని సురేష్ గోపి సిఫార్సు చేశారు. దీన్ని మోడీ పరిగణనలోకి తీసుకుంటారో లేదో వేచి చూడాలి.

తాజావార్తలు
-
Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
-
Dhanush – Anirudh : ధనుష్ – అనిరుధ్ మధ్య ఫ్రెండ్షిప్ చెడిందా..?
-
Kia Syros EV: 526KM రేంజ్, లెవెల్-2 ADAS భద్రతా ఫీచర్లతో.. కియా సైరోస్ EV భారత్ లో విడుదల
-
IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
-
Thursday Horoscope: ఆ రాశివారు అనుకున్న పనుల అంచనాలు తారుమారతాయి.. జాగ్రత్త సుమీ..!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!