Israel: రెండేళ్ల తర్వాత విషాదకర నిర్ణయం.. హమాస్ చేతిలో ప్రియురాలి చనిపోయిందని ప్రియుడు ఆత్మహత్య
- రెండేళ్ల తర్వాత విషాదకర నిర్ణయం
- హమాస్ చేతిలో ప్రియురాలి చనిపోయిందని ప్రియుడు ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గాజా-ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం వేళ ఒక ఇజ్రాయెలీయుడు విషాదకరమైన నిర్ణయానికి తీసుకున్నాడు. ఇటీవలే రెండు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమై రెండేళ్లు పూర్తైంది. ప్రస్తుతం శాంతి ఒప్పందం జరిగింది. ఇలాంటి తరుణంలో ఒక ప్రియుడు మరణశాసనాన్ని రాస్తున్నాడు. హమాస్ చేతిలో చనిపోయిన ప్రియురాలిని జ్ఞాపకం చేసుకుని తాజాగా రోయ్ షాలెవ్ అనే ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. శాంతి ఒప్పందం వేళ ప్రాణాలు తీసుకోవడంతో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇది కూడా చదవండి: Suresh Gopi: కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేస్తా.. తిరిగి సినిమాలు చేసుకుంటా.. సురేష్ గోపి సంచలన ప్రకటన
Also Read
2025, అక్టోబర్ 7న గాజా-ఇజ్రాయెల్ యుద్ధం జరిగి రెండేళ్లు పూర్తైంది. కొద్దిరోజులకే రోయ్ షాలెవ్ (30) బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు సోషల్ మీడియాలో కీలక పోస్ట్ పెట్టాడు. తన ప్రియురాలు లేని జీవితాన్ని ముందుకు సాగించలేనని పేర్కొన్నాడు. అక్టోబర్ 10న రోయ్ షాలెవ్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ చూసి స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. అప్రమత్తం అయ్యేలోపే ప్రాణాలు తీసుకున్నాడు. దీంతో అందరూ విషాదంలో మునిగిపోయారు. తాజాగా ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.
ఇది కూడా చదవండి: Hamas-Israel: నేడు బందీల విడుదల.. ఇజ్రాయెల్కు ట్రంప్.. యుద్ధం ముగిసిందని ప్రకటన
‘‘దయచేసి నాపై కోపం తెచ్చుకోకండి. ఎవరూ నన్ను ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. మీరు అర్థం చేసుకోలేనందున అది పర్వాలేదు. ఈ బాధ అంతం కావాలని నేను కోరుకుంటున్నాను. నేను బతికే ఉన్నాను. కానీ లోపల ప్రతిదీ చచ్చిపోయింది.’’ అని రోయ్ షాలెవ్ రాశాడు. కొన్ని గంటల తర్వాత టెల్ అవీవ్లో కాలిపోతున్న కారులో చనిపోయి కనిపించాడు. ఇంధనం పోసి సజీవదహనం అయినట్టుగా ఇజ్రాయెల్ మీడియా తెలిపింది.
ఇది కూడా చదవండి: Cricket Tragedy: చివరి బంతి వేశాడు, మ్యాచ్ గెలిపించాడు.. కానీ మైదానంలోనే మరణించాడు!
రాయ్ షాలెవ్-మాపాల్ ఆడమ్ ప్రేమికులు. 2023 అక్టోబర్ 7న నోవా ఓపెన్-ఎయిర్ మ్యూజిక్ ఫెస్టివల్లో పాల్గొన్నారు. ఊహించని రీతిలో హమాస్ ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో మాపాల్ ఆడమ్ ప్రాణాలు కోల్పోయింది. రాయ్ షాలెవ్ ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ అప్పటి నుంచి ఆమె ధాన్యంలో మునిగిపోయాడు. ఇక చేసేదేమీలేక అక్టోబర్ 10న నిప్పుంటించుకుని సజీవదహనం అయ్యాడు. మాపాల్ ఆడమ్ సోదరి మాయన్ శనివారం రాయ్ షాలెవ్ ఫోటోను పోస్ట్ చేసింది. రాయ్ చనిపోయినట్లు పేర్కొంది. తనకు మాటలు రావడం లేదని తెలిపింది. ఇదిలా ఉంటే సోమవారం ఇజ్రాయెల్ బందీలు విడుదల కానున్నారు. రెండేళ్ల తర్వాత విముక్తి లభిస్తోంది.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!