Pakistan: మిత్ర దేశాలు కూడా పాకిస్తాన్ను అడుక్కునే దేశంగా చూస్తున్నాయి: పీఎం షహబాజ్ షరీఫ్
PM Shahzab Sharif’s comments on Pakistan’s economic situation: పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి గురించి ఆ దేశ ప్రధాని షహజాబ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చివరకు పాకిస్తాన్ మిత్ర దేశాలు కూడా పాకిస్తాన్ దేశాన్ని డబ్బు కోసం అడుక్కునే దేశంగా చూడటం ప్రారంభించారని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణించిన తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు మనం మన మిత్ర దేశాలకు ఫోన్ చేసినా.. మనం వారి వద్దకు డబ్బులు అడుక్కునేందుకు వచ్చామని అనుకుంటున్నారని.. షహబాజ్ షరీఫ్ లాయర్ల సదస్సులో ప్రసంగించారు.
ప్రపంచంలో చిన్న దేశాల ఆర్థిక వ్యవస్థలు కూడా పాకిస్తాన్ దేశాన్ని మించిపోయాయని.. గత 75 ఏళ్లుగా భిక్షాటన కోసం గిన్న పెట్టుకుని తిరుగుతున్నామంటూ బుధవారం ఆయన లాయర్ల సదస్సులో వ్యాఖ్యానించారు. ఇటీవల పాకిస్తాన్ లో వచ్చిన వరదలు కూడా పాకిస్తాన్ పరిస్థితిని దిగజార్చాయని ఆయన అన్నారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధికారంలో ఉన్నప్పటి నుంచి పాకిస్తాన్ దివాళా అంచున ఉందని.. సంకీర్ణ ప్రభుత్వం కృషితో ఆర్థిక ఊబి నుంచి పాకిస్తాన్ బయటపడుతోందని పీఎం షహబాజ్ షరీఫ్ అన్నారు. పాకిస్తాన్ దేశంలో తమ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతోందని ఆయన అన్నారు. తాను అధికారం చేపట్టే సమయానికి దేశంలో ద్రవ్యోల్భనం గరిష్ట స్థాయిలో ఉందని.. ఇప్పుడు కొంత నియంత్రించామని అన్నారు.
Also Read
- Iran Peace Proposal: ఇరాన్ 14-సూత్రాల ప్రతిపాదన.. అమెరికాకు 30 రోజుల అల్టిమేటం
- Operation Hormuz: హార్ముజ్ జలసంధిలో భారీ ఆపరేషన్ చేపట్టిన అమెరికా..
- Donald Trump: ట్రంప్ 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్' ప్రకటన.. హార్మూజ్లో చిక్కుకున్న ఓడలను సురక్షితంగా బయటకు..
- OPEC+ : పెట్రోల్.. డీజిల్ ఉత్పత్తిపై ఒపెక్+ కీలక నిర్ణయం!
Read Also: Tamil Nadu: వక్ఫ్ బోర్డు పరిధిలో హిందూ గ్రామం..1500 ఏళ్ల దేవాలయం భూమి కూడా..
గతంలో ఇమ్రాన్ సర్కార్ అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) ఒప్పందాన్ని ఉల్లంఘించిందని.. ప్రస్తుతం కఠినమైన షరతులతో ఐఎంఎఫ్ పాకిస్తాన్ కు బెయిల్ అవుట్ ప్యాకేజీని ప్రకటించిందని ఆయన వెల్లడించారు. బెయిల్ అవుట్ కింది 1.18 బిలియన్ డాలర్ల సహాయాన్ని ఐఎంఎఫ్ ఇవ్వనుంది. చైనాతో పాటు నాలుగు దేశాలు పాకిస్తాన్ దేశాన్ని ఆర్థికంగా ఆదుకున్నాయని అన్నారు. రాబోయే శీతాకాలంలో గ్యాస్ సంక్షోభం నుంచి గట్టేక్కేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన అన్నారు.
ఇటీవల పాకిస్తాన్ వరదలతో తీవ్రంగా నష్టపోయింది. మూడింట ఒక వంతు భూభాగం వరద నీటిలోనే ఉంది. ఈ వరదల్లో 1400 మంది చనిపోగా.. 3.3 కోట్ల మంది ప్రభావితం అయ్యారు. ఏకంగా 12 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. మానవతా సాయం కింద పాకిస్తాన్ దేశాన్ని ఆదుకునేందుకు పలు దేశాలు సహాయం చేశాయి. కెనడా, యూఎస్ఏ, యూకే, జపాన్, డెన్మార్క్, ఆస్ట్రేలియా, సింగపూర్ వంటి దేశాలు సాయం చేశాయి.
తాజావార్తలు
-
MI Vs LSG: ఆకాశమే హద్దుగా చెలరేగిన రోహిత్ శర్మ.. ఆ రికార్డులన్నీ పటాపంచల్..
-
Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
Indigo: టేకాఫ్ తర్వాత షాక్.. ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.!
-
Vijay Anil Army: ‘అనిల్’ నుంచి అసెంబ్లీ వరకు.. విజయ్ రాజకీయ ప్రస్థానంలో ఆ ‘ఈల’ వేసిన మలుపులేంటి..?
-
TPCC Mahesh Goud : కేరళలో యూడీఎఫ్ ఘనవిజయం.. తెలంగాణ మోడల్ పాలనే గెలిపించిందన్న మహేష్ గౌడ్.!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!