Pakistan: మిత్ర దేశాలు కూడా పాకిస్తాన్ను అడుక్కునే దేశంగా చూస్తున్నాయి: పీఎం షహబాజ్ షరీఫ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Shahzab Sharif’s comments on Pakistan’s economic situation: పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి గురించి ఆ దేశ ప్రధాని షహజాబ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చివరకు పాకిస్తాన్ మిత్ర దేశాలు కూడా పాకిస్తాన్ దేశాన్ని డబ్బు కోసం అడుక్కునే దేశంగా చూడటం ప్రారంభించారని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణించిన తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు మనం మన మిత్ర దేశాలకు ఫోన్ చేసినా.. మనం వారి వద్దకు డబ్బులు అడుక్కునేందుకు వచ్చామని అనుకుంటున్నారని.. షహబాజ్ షరీఫ్ లాయర్ల సదస్సులో ప్రసంగించారు.
ప్రపంచంలో చిన్న దేశాల ఆర్థిక వ్యవస్థలు కూడా పాకిస్తాన్ దేశాన్ని మించిపోయాయని.. గత 75 ఏళ్లుగా భిక్షాటన కోసం గిన్న పెట్టుకుని తిరుగుతున్నామంటూ బుధవారం ఆయన లాయర్ల సదస్సులో వ్యాఖ్యానించారు. ఇటీవల పాకిస్తాన్ లో వచ్చిన వరదలు కూడా పాకిస్తాన్ పరిస్థితిని దిగజార్చాయని ఆయన అన్నారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధికారంలో ఉన్నప్పటి నుంచి పాకిస్తాన్ దివాళా అంచున ఉందని.. సంకీర్ణ ప్రభుత్వం కృషితో ఆర్థిక ఊబి నుంచి పాకిస్తాన్ బయటపడుతోందని పీఎం షహబాజ్ షరీఫ్ అన్నారు. పాకిస్తాన్ దేశంలో తమ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతోందని ఆయన అన్నారు. తాను అధికారం చేపట్టే సమయానికి దేశంలో ద్రవ్యోల్భనం గరిష్ట స్థాయిలో ఉందని.. ఇప్పుడు కొంత నియంత్రించామని అన్నారు.
Also Read
- H-1B Visa: భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ షాక్.. హెచ్-1బీ వీసా రుసుము భారీగా పెంపు..
- Strait of Hormuz: హోర్ముజ్పై ఇరాన్ కొత్త ప్లాన్.. ప్రపంచ దేశాలకు బిగ్ షాక్..
- Jinping: భారీ బృందంతో ఢిల్లీకి వస్తున్న చైనా అధ్యక్షుడు.. బ్రిక్స్లో పాల్గొననున్న జిన్పింగ్
- Jaishankar-Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్తో జైశంకర్ భేటీ.. రెండు దేశాల సంబంధాలపై చర్చ
Read Also: Tamil Nadu: వక్ఫ్ బోర్డు పరిధిలో హిందూ గ్రామం..1500 ఏళ్ల దేవాలయం భూమి కూడా..
గతంలో ఇమ్రాన్ సర్కార్ అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) ఒప్పందాన్ని ఉల్లంఘించిందని.. ప్రస్తుతం కఠినమైన షరతులతో ఐఎంఎఫ్ పాకిస్తాన్ కు బెయిల్ అవుట్ ప్యాకేజీని ప్రకటించిందని ఆయన వెల్లడించారు. బెయిల్ అవుట్ కింది 1.18 బిలియన్ డాలర్ల సహాయాన్ని ఐఎంఎఫ్ ఇవ్వనుంది. చైనాతో పాటు నాలుగు దేశాలు పాకిస్తాన్ దేశాన్ని ఆర్థికంగా ఆదుకున్నాయని అన్నారు. రాబోయే శీతాకాలంలో గ్యాస్ సంక్షోభం నుంచి గట్టేక్కేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన అన్నారు.
ఇటీవల పాకిస్తాన్ వరదలతో తీవ్రంగా నష్టపోయింది. మూడింట ఒక వంతు భూభాగం వరద నీటిలోనే ఉంది. ఈ వరదల్లో 1400 మంది చనిపోగా.. 3.3 కోట్ల మంది ప్రభావితం అయ్యారు. ఏకంగా 12 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. మానవతా సాయం కింద పాకిస్తాన్ దేశాన్ని ఆదుకునేందుకు పలు దేశాలు సహాయం చేశాయి. కెనడా, యూఎస్ఏ, యూకే, జపాన్, డెన్మార్క్, ఆస్ట్రేలియా, సింగపూర్ వంటి దేశాలు సాయం చేశాయి.
తాజావార్తలు
-
The Paradise : అనిరుధ్ను ఆశీర్వదించిన కాసర్ల శ్యామ్.. ‘ది పారడైజ్’ సెకండ్ సింగిల్ అప్డేట్ వచ్చేసింది
-
Venkaiah Naidu: ఉచితాలకు నేను వ్యతిరేకం.. ఉచితంగా ఇవ్వాల్సింది విద్య, వైద్యం మాత్రమే..!
-
Maharashtra Hill Tragedy: తల్లిదండ్రులను కలపాలని కునాల్ చనిపోయాడా? సంభాజీనగర్ ఎపిసోడ్లో న్యూ ట్విస్ట్!
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
Supreme Court: X, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ పోస్టుల తొలగింపుపై వైసీపీ పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?