Tamil Nadu: వక్ఫ్ బోర్డు పరిధిలో హిందూ గ్రామం..1500 ఏళ్ల దేవాలయం భూమి కూడా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu Waqf Board Claims Ownership Of Entire Hindu Village, Including Temple Land: తమిళనాడులో కొత్త వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హిందూ గ్రామం మొత్తం వక్ఫ్ బోర్డు పరిధిలో ఉందని తెలియడంతో సదరు గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తిరుచిరాపల్లి జిల్లా తిరుచెందురై గ్రామం మొత్తం వక్ఫ్ బోర్డు పరిధి కింద ఉందని తెలియడంతో గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో వింతేంటంటే 1500 ఏళ్ల క్రితం నాటి పురాతన సుందరేశ్వర ఆలయానికి సంబంధించిన 369 భూమి కూడా ఉంది. ఇది వక్ఫ్ బోర్డుకు సంబంధించిన భూమి కాదు. అయితే ఈ భూమి కూడా ప్రస్తుతం వక్ఫ్ బోర్డు పరిధి కింద ఉండటంతో గ్రామస్తులు ఇదేలా సాధ్యం అని చర్చించుకుంటున్నారు.
ఈ విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన రాజగోపాల్ అనే వ్యక్తి తనకు ఉన్న 1.2 ఎకరాల స్థలాన్ని అమ్మేసి కూతురు పెళ్లి చేద్ధాం అని అనుకున్నాడు. అయితే దీనిని విక్రయించాలంటే చెన్నైలోని వక్ఫ్ బోర్డు నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్(ఎన్ఓసీ) తెచ్చుకోవాలని రాజగోపాల్ కు అధికారులు సూచించారు. సబ్ రిజిస్టార్ ఆఫీస్ కూడా ఈ భూమిని తమిళనాడు వక్ఫ్ బోర్డు కలిగి ఉందని 20 పేజీల పత్రాలను అందించారని సమాచారం. దీంతో ప్రస్తుతం గ్రామస్తులంతా సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసుకు క్యూ కట్టారు. అయితే రాజగోపాల్ 1992లో భూమిని కొనుగోలు చేసినప్పుడు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదని గ్రామస్తులు తెలుపుతున్నారు.
Also Read
- Jaipur Tension Over School Row: జైపూర్లో ఉద్రిక్తత.. కాక్రోచ్ పార్టీ కార్యకర్తలపై గ్రామస్థుల దాడి
- Mahatma Gandhi: గాంధీజీ చేతిరాత డైరీకి కళ్లు చెదిరే ధర.. రూ.16.20 కోట్లకు అమ్ముడైన డైరీ
- Ram Mandir Prasad: "రామ మందిర ప్రసాద్ " అంటూ అమ్మకాలు.. అమెజాన్కు రూ. 1 లక్ష జరిమానా.!
- గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
Read Also: Assam: అస్సాం ప్రభుత్వం, తీవ్రవాద సంస్థల మధ్య కీలక ఒప్పందం
ఈ ప్రాంతంలో ముస్లింలు నివసించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని గ్రామస్తులు చెబుతున్నారు. అయితే వక్ఫ్ బోర్డు తిరుచ్చిలోని 12 రిజిస్ట్రేషన్ లేఖ రాసింది. ఆ ఆస్తులు మొత్తం వక్ఫ్ బోర్డుకు చెందినవే అని క్లెయిమ్ చేసింది. చివరకు వక్ఫ్ బోర్డు చైర్మన్ గ్రామస్తులు ఆక్రమణదారులుగా పేర్కొన్నారు. తిరుచెందురై గ్రామంలోని భూములన్నీ వక్ఫ్ బోర్డుకు చెందినవి అని.. ఎవరైనా విక్రయించాలంటే చెన్నైలోని బోర్డు నుంచి ఎన్ఓసీ తీసుకురావాలని అధికారులు సూచిస్తున్నారు.
369 ఎకరాల ఆస్తిని కలిగి ఉన్న 1500 ఏళ్ల నాటి పురాతన సుందరేశ్వర దేవాలయం ముస్లింలకు చెందినది కాదని.. ఇందుకు సంబంధించిన పత్రాలు కూడా ఉన్నాయని.. గ్రామ పంచాయతీ మాజీ అధ్యక్షుడు దనపాల్ తెలిపారు. తమిళనాడు వ్యాప్తంగా వక్ప్ బోర్డుకు వేలాది ఎకరాల ఆస్తులు ఉన్నాయి. 18 ముస్లిం మెజారిటీ గ్రామాలను కలిగి ఉంది.
తాజావార్తలు
-
Dr Priyanka Murder Case: డాక్టర్ ప్రియాంక హత్య కేసు.. నిందితుల రిమాండ్ పొడిగింపు!
-
Alaska Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు పైలట్లతో సహా 8 మంది మృతి
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Missi Jersey Auction: ఒకే వేలంలో మెస్సీ, రొనాల్డో ఫైట్.. ఊహించని ధరకు అమ్ముడైన దిగ్గజాల జెర్సీలు..
-
Prabhas Fauji: ‘ఫౌజీ’లో అదిరిపోయే యాక్షన్ బ్లాక్స్.. పీక్స్కు చేరిన హైప్.. బాక్సాఫీస్ తగలబడిపోద్ది ఇగ!
ట్రెండింగ్
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!