PM Modi Russia Tour: నేడు రష్యాకు ప్రధాని మోడీ.. కీలక అంశాలపై చర్చ..!
- నేడు రష్యాకు ప్రధాని నరేంద్ర మోడీ..
- 22వ ఇండో - రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోడీ..
- భారత్- రష్యా ఉమ్మడి నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi Russia Tour: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇవాళ్టి నుంచి రెండు రోజుల పాటు రష్యాలో పర్యటించనున్నారు. 22వ ఇండో– రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొనబోతున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు జరపే అవకాశం ఉంది. పలు రంగాల్లో విస్తృత స్థాయి సహకారంపైన ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి దిగాక మోడీ రష్యాలో పర్యటించడం ఇదే తొలిసారి. అయితే, మూడేళ్ల విరామం తర్వాత భారత్– రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సు జరుగుతుండటంతో ఈ సమిట్లో చర్చించబోయే అంశాలు, తీసుకోబోయే ఉమ్మడి నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి కొనసాగుతుంది.
Read Also: PM Modi : నేటి నుంచి మూడు రోజుల పాటు మోడీ విదేశీ పర్యటన.. ఆస్ట్రియాతో కీలక చర్చలు జరిపే ఛాన్స్
Also Read
అయితే, చివరిసారిగా 2021 డిసెంబర్లో ఢిల్లీలో ఇండో- రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సు జరిగింది. ఇవాళ (సోమవారం) మధ్యాహ్నం రష్యాకు ప్రధాని మోడీ చేరుకున్నాక.. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇచ్చే ప్రత్యేక విందు కార్యక్రమానికి హాజరవుతారు. ఆ తర్వాత శిఖరాగ్ర సదస్సు స్టార్ట్ అవుతుంది. మరుసటి రోజు రష్యాలోని భారతీయ సంతతి వ్యక్తులతో నరేంద్ర మోడీ మాట్లాడనున్నారు. అలాగే, క్లెమ్లిన్లో అనామక సైనికుల స్మారకం దగ్గర శ్రద్ధాంజలి ఘటిస్తారు. దీని తర్వాత మాస్కోలో ఎగ్జిబిషన్ను సందర్శించనున్నారు.. ఇక, రష్యా పర్యటన తర్వాత జులై 9న ఆస్ట్రియా పర్యటనకు ప్రధాని మోడీ వెళ్లనున్నారు. ఆస్ట్రియా అధ్యక్షుడు అలెగ్జాండర్ వాన్ డీర్ బెల్లాన్, చాన్స్లర్ కార్ల్ నెహామెర్లతో విడివిడిగా మోడీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ‘ఆస్ట్రియా, భారత్ మైత్రీబంధానికి 75 ఏళ్లు పూర్తైతున్న వేళ మోడీతో చర్చల కోసం రెడీగా ఉన్నామని నెహామెర్ శనివారం ట్విట్టర్ వేదికగా చేసిన పోస్ట్కు మోడీ ఆదివారం రోజు రియాక్ట్ అయ్యారు.
Read Also: Nepal Floods : నేపాల్లో వరద బీభత్సం.. ఇప్పటివరకు 62 మంది మృతి
కాగా, ఇరు దేశాల మధ్య బంధాన్ని మరింత పటిష్టం చేసేందుకు.. చర్చల కోసం ఎదురుచూస్తున్నామని మోడీ అన్నారు. భారత ప్రధాని ఒకరు ఆస్ట్రియాలో పర్యటిస్తుండటం గత 40 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషంగా చెప్పుకొవచ్చు.. భారత్, ఆస్ట్రియాకు చెందిన పారిశ్రామిక దిగ్గజాలతో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ జరగనుంది. మాస్కోతో పాటు వియన్నాలోని భారతీయ సంతతి ప్రజలతో ప్రధాని మాట్లాడనున్నారు.
తాజావార్తలు
-
MK Stalin: “విజయ్ ప్రభుత్వం డీఎంకే దయపైనే”.. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
-
Hyderabad: మాదాపూర్లో అర్ధరాత్రి బైకులు, కార్లతో రేసర్ల హంగామా.. పోలీసులు ఏం చేశారో చూడండి..
-
Motorola Edge 50 Ultra 5G: మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా 5G పై రూ.26000 డిస్కౌంట్.. 64MP టెలిఫోటో కెమెరా, pOLED డిస్ప్లే
-
AR Rahman Peddi: ‘బాహుబలి’ చూసాకే తెలుగు సినిమాపై ప్రేమ పెరిగింది..
-
SRH: ఐపీఎల్ చరిత్రలో ఆ అరుదైన ఘనత సాధించిన ఏకైక జట్టు ఎస్ఆర్హెచ్.. మళ్లీ 2016 నాటి మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?