Donald Trump: ప్రధాని మోడీ సరైనది చేస్తారు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
- వలసల విషయంలో ప్రధాని మోడీ సరైనదే చేస్తారు..
- డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: డాక్యుమెంట్లు లేకుండా అమెరికాలో ఉంటున్న భారతీయులను తీసుకునేందుకు మన దేశం అంగీకరించింది. అమెరికాలోకి అక్రమంగా వచ్చిన భారతీయ వలసదారుల విషయంలో ప్రధాని నరేంద్రమోడీ ‘‘సరైనది చేస్తారు’’ అని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ప్రధాని మోడీ, ట్రంప్ సోమవారం ఫోన్లో మాట్లాడిన తర్వాత ట్రంప్ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ఇరువురు నేతలు రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలు, ద్వైపాక్షిక సంబంధాల గురించి, ప్రపంచ రాజకీయ పరిస్థితుల గురించి చర్చించారు.
ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత నుంచి అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. చాలా మందిని వారివారి దేశాలకు బహిష్కరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 18,000 మంది భారతీయులను యూఎస్ అధికారులు గుర్తించినట్లు బ్లూమ్బెర్గ్ నివేదించింది. గత వారం అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ భేటీ అయని సందర్భంలో కూడా క్రమ రహిత వలసల సమస్యను పరిష్కరించాలనే కోరికను నొక్కి చెప్పారు. భారతీయులను తీసుకోవడానికి భారత్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని జైశంకర్ హామీ ఇచ్చారు.
Also Read
- Sheikh Hasina: "నన్ను అంతం చేయడం మీ తరం కాదు! నేను మళ్లీ నా దేశానికి వస్తా.. నన్ను ఎవరూ ఆపలేరు": షేక్ హసీనా
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- Afghan Women: ‘అమ్మాయి మౌనం పెళ్లికి అంగీకారమే’.. తాలిబన్ కొత్త చట్టంపై ఆగ్రహజ్వాలలు
- Oil Companies: పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచినా.. ఇంకా నష్టాల్లోనే చమురు సంస్థలు.. కారణం ఇదే..
Read Also: Supreme Court: ముస్లిం మహిళ “లౌకిక ఆస్తి చట్టాలను” కోరుతోంది.. మీ సమాధానం ఏంటి..?
‘‘ఒక ప్రభుత్వంగా చట్టబద్ధమైన వలసలకు మా మద్దతు ఉంటుంది. భారతీయుల ప్రతిభ, భారతీయు నైపుణ్యాలు ప్రపంచ స్థాయిలో గరిష్ట అవకాశాలను కలిగి ఉండాలని మేము కోరుకుంటున్నాము. అదే సమయంలో అక్రమ వలసలను కూడా మేము గట్టిగా వ్యతిరేకిస్తాము’’ అని జైశంకర్ వాషింగ్టన్లో జరిగిన మీడియా సమావేశంలో చెప్పారు. ‘‘ఏదైనా చట్టవిరుద్ధమైనవి జరిగినప్పుడు, అనేక ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలతో కలిసిపోతామని మీకు తెలుసు. మన పౌరులు ఎవరైనా చట్టవిరుద్ధంగా అమెరికాలో ఉన్నారని ఖచ్చితంగా తెలిస్తే, వారిని భారత్ తీసుకురావడానికి ఎల్లప్పుడూ మేము సిద్ధంగా ఉంటాము’’ అని చెప్పారు.
ఇదిలా ఉంటే, నైపుణ్యం కలిగిన వర్కర్ల చట్టబద్ధమైన వలసలకు తాను సిద్ధంగా ఉన్నానని ట్రంప్ పలు సందర్భాల్లో చెప్పారు. ఇది మన ఐటీ నిపుణులకు చాలా ఉపయోగంగా మారుతుంది. భారతదేశ టెక్కీలకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. యూఎస్ జారీ చేసే H-1B వీసాలలో ఎక్కువ భాగం మన దేశానికి చెందినవారికే వస్తున్నాయి.
తాజావార్తలు
-
Janhvi Kapoor: కోలీవుడ్లో బంపర్ ఛాన్స్ ఆఫర్ కొట్టేసిన.. జాన్వీ
-
Pat Cummins-SRH: ఇట్స్ వెరీ టఫ్.. కానీ ఆ ఇద్దరి వల్లే గెలిచాం!
-
Sheikh Hasina: “నన్ను అంతం చేయడం మీ తరం కాదు! నేను మళ్లీ నా దేశానికి వస్తా.. నన్ను ఎవరూ ఆపలేరు”: షేక్ హసీనా
-
Deputy CM Pawan Kalyan: పంచాయతీరాజ్ శాఖలో ప్రత్యేక డ్యాష్బోర్డులు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు..
-
PeddiTrailer : ‘పెద్ది’ పెద్దగా మెప్పిచలేకపోయాడా? రెహమాన్ దెబ్బేసాడా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!