Supreme Court: ముస్లిం మహిళ “లౌకిక ఆస్తి చట్టాలను” కోరుతోంది.. మీ సమాధానం ఏంటి..?
- ఆస్తి విషయంలో లౌకిక చట్టాలను కోరిన ముస్లిం మహిళ..
- కేంద్రం సమాధానం కోరిన సుప్రీంకోర్టు..
- యూసీసీ చర్చ సమయంలో కీలకమైన కేసు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: దేశవ్యాప్తంగా యూనిఫాం సివిల్ కోడ్(సీఏఏ)పై చర్చ జరుగుతున్న సందర్భంలో, సుప్రీంకోర్టులోకి కీలక కేసు వచ్చింది. ఒకవేళ ఒక వ్యక్తి ముస్లిం కుటుంబంలో జన్మిస్తే అతనున ఆస్తి విషయంలో లౌకిక చట్టాలు పాటించవచ్చా.? లేదా షరియా, ముస్లిం వ్యక్తిగత చట్టాలు పాటించవచ్చా..? అని కేంద్రాన్ని సుప్రీం ప్రశ్నించింది. దీనిపైన కేంద్ర సమాధానాన్ని సుప్రీంకోర్టు కోరింది. భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం నాలుగు వారాల సమయంలో కేంద్రం తన సమాధానాన్ని తెలపాలని కోరింది. తదుపరి విచారణను మే 5కి వాయిదా వేసింది.
ఈ కేసులో పిటిషన్ కేరళకు చెందిన సఫియా పీఎం. ఆమె తన మొత్తం ఆస్తిని తన కుమార్తెకు ఇవ్వాలని అనుకుంటోంది. ఆమె కొడుకు ఆటిజంతో బాధపడుతున్నాడు. ఆమె కుమార్తె అతడిని చూసుకుంటుందని పిటిషన్లో పేర్కొంది. షరియా ప్రకారం.. తల్లిదండ్రుల ఆస్తిలో కొడుకు, కుమార్తె కన్నా రెండు రెట్ల ఆస్తిని పొందుతాడు. తన కుమారు డౌన్ సిండ్రోమ్ కారనంగా మరణిస్తే, తన కుమార్తెకు ఆస్తిలో కేవలం మూడింట ఒక వంతు మాత్రమే పొందుతుందని, మిగతాది బంధువులకు వెళ్తుందని పిటిషనర్ చెప్పారు.
Also Read
- LPG Cylinder: వంటింట్లో గ్యాస్ మంటలు.. సిలిండర్ రేటు ఎంత పెరిగిందంటే?
- India Missile Test: సాహో భారత్.. శత్రు దేశాలకు వార్నింగ్ సిగ్నల్! అడ్వాన్స్డ్ అగ్ని సిరీస్లో కీలక టెస్ట్..
- Arms Theft: మద్రాస్ రెజిమెంట్లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
- PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
Read Also: Rythu Maha Dharna: నల్లగొండలో ముగిసిన రైతు మహాధర్నా.. భారీగా తరలివచ్చిన జనం
తాను, తన భర్త ఇస్లాంను ఆచరించడం లేదని, కాబట్టి తమకు భారత వారసత్వం చట్టంలోని మార్గదర్శకాల ప్రకారం ఆస్తిని పంపిణీ చేయడానికి అనుమతించాలని సఫియా తన పిటిషన్లో పేర్కొంది. ప్రస్తుతం భారత వారసత్వ చట్టాలు ముస్లింలకు వర్తించవు. ఇప్పుడు సఫియా వీటిని సవాల్ చేశారు. దీనిని ఆసక్తికరమైన కేసుగా సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నారు.
మతంతో సంబంధం లేకుండా దేశ పౌరులందరికి ఉమ్మడి పౌర చట్టాలతో కూడిన యూనిఫాం సివిల్ కోడ్ తీసుకురావాలని బీజేపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ కేసు కీలకంగా మారింది. క్రిమినల్ చట్టాలు అందరికి సమానంగా ఉన్నప్పటికీ, ఆస్తి వారసత్వం, దత్తత, చట్టాలు కొన్ని వర్గాలకు విభిన్నంగా ఉన్నాయి. యూనిఫాం సివిల్ కోడ్ తమ మత స్వేచ్ఛని అడ్డుకుంటుందని కొన్ని వర్గాలు దీనిని వ్యతిరేకిస్తున్నాయి. ఇటీవల ఉత్తరాఖండ్ సర్కార్ యూసీసీని అమలు చేసిన తొలి రాష్ట్రంగా నిలిచింది.
తాజావార్తలు
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
AP Local Body Elections: ఏపీలో స్థానిక ఎన్నికలకు కీలక అడుగు!
-
Telangana Rainfall Deficit: తెలంగాణలో వానల కోసం ఎదురుచూపులు.. సెప్టెంబర్పైనే ఆశలు!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
High Court Lifts Stay: గుడ్ న్యూస్.. కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ లపై స్టే ఎత్తివేత.!
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!