Supreme Court: ముస్లిం మహిళ “లౌకిక ఆస్తి చట్టాలను” కోరుతోంది.. మీ సమాధానం ఏంటి..?
- ఆస్తి విషయంలో లౌకిక చట్టాలను కోరిన ముస్లిం మహిళ..
- కేంద్రం సమాధానం కోరిన సుప్రీంకోర్టు..
- యూసీసీ చర్చ సమయంలో కీలకమైన కేసు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: దేశవ్యాప్తంగా యూనిఫాం సివిల్ కోడ్(సీఏఏ)పై చర్చ జరుగుతున్న సందర్భంలో, సుప్రీంకోర్టులోకి కీలక కేసు వచ్చింది. ఒకవేళ ఒక వ్యక్తి ముస్లిం కుటుంబంలో జన్మిస్తే అతనున ఆస్తి విషయంలో లౌకిక చట్టాలు పాటించవచ్చా.? లేదా షరియా, ముస్లిం వ్యక్తిగత చట్టాలు పాటించవచ్చా..? అని కేంద్రాన్ని సుప్రీం ప్రశ్నించింది. దీనిపైన కేంద్ర సమాధానాన్ని సుప్రీంకోర్టు కోరింది. భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం నాలుగు వారాల సమయంలో కేంద్రం తన సమాధానాన్ని తెలపాలని కోరింది. తదుపరి విచారణను మే 5కి వాయిదా వేసింది.
ఈ కేసులో పిటిషన్ కేరళకు చెందిన సఫియా పీఎం. ఆమె తన మొత్తం ఆస్తిని తన కుమార్తెకు ఇవ్వాలని అనుకుంటోంది. ఆమె కొడుకు ఆటిజంతో బాధపడుతున్నాడు. ఆమె కుమార్తె అతడిని చూసుకుంటుందని పిటిషన్లో పేర్కొంది. షరియా ప్రకారం.. తల్లిదండ్రుల ఆస్తిలో కొడుకు, కుమార్తె కన్నా రెండు రెట్ల ఆస్తిని పొందుతాడు. తన కుమారు డౌన్ సిండ్రోమ్ కారనంగా మరణిస్తే, తన కుమార్తెకు ఆస్తిలో కేవలం మూడింట ఒక వంతు మాత్రమే పొందుతుందని, మిగతాది బంధువులకు వెళ్తుందని పిటిషనర్ చెప్పారు.
Also Read
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
Read Also: Rythu Maha Dharna: నల్లగొండలో ముగిసిన రైతు మహాధర్నా.. భారీగా తరలివచ్చిన జనం
తాను, తన భర్త ఇస్లాంను ఆచరించడం లేదని, కాబట్టి తమకు భారత వారసత్వం చట్టంలోని మార్గదర్శకాల ప్రకారం ఆస్తిని పంపిణీ చేయడానికి అనుమతించాలని సఫియా తన పిటిషన్లో పేర్కొంది. ప్రస్తుతం భారత వారసత్వ చట్టాలు ముస్లింలకు వర్తించవు. ఇప్పుడు సఫియా వీటిని సవాల్ చేశారు. దీనిని ఆసక్తికరమైన కేసుగా సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నారు.
మతంతో సంబంధం లేకుండా దేశ పౌరులందరికి ఉమ్మడి పౌర చట్టాలతో కూడిన యూనిఫాం సివిల్ కోడ్ తీసుకురావాలని బీజేపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ కేసు కీలకంగా మారింది. క్రిమినల్ చట్టాలు అందరికి సమానంగా ఉన్నప్పటికీ, ఆస్తి వారసత్వం, దత్తత, చట్టాలు కొన్ని వర్గాలకు విభిన్నంగా ఉన్నాయి. యూనిఫాం సివిల్ కోడ్ తమ మత స్వేచ్ఛని అడ్డుకుంటుందని కొన్ని వర్గాలు దీనిని వ్యతిరేకిస్తున్నాయి. ఇటీవల ఉత్తరాఖండ్ సర్కార్ యూసీసీని అమలు చేసిన తొలి రాష్ట్రంగా నిలిచింది.
తాజావార్తలు
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
-
Bhatti Vikramarka : 3 ట్రిలియన్ల ఆర్థిక వ్వవస్థే లక్ష్యం
-
Off The Record : కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి సీఎం చంద్రబాబు వార్నింగ్..?
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!