Supreme Court: ముస్లిం మహిళ “లౌకిక ఆస్తి చట్టాలను” కోరుతోంది.. మీ సమాధానం ఏంటి..?
- ఆస్తి విషయంలో లౌకిక చట్టాలను కోరిన ముస్లిం మహిళ..
- కేంద్రం సమాధానం కోరిన సుప్రీంకోర్టు..
- యూసీసీ చర్చ సమయంలో కీలకమైన కేసు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: దేశవ్యాప్తంగా యూనిఫాం సివిల్ కోడ్(సీఏఏ)పై చర్చ జరుగుతున్న సందర్భంలో, సుప్రీంకోర్టులోకి కీలక కేసు వచ్చింది. ఒకవేళ ఒక వ్యక్తి ముస్లిం కుటుంబంలో జన్మిస్తే అతనున ఆస్తి విషయంలో లౌకిక చట్టాలు పాటించవచ్చా.? లేదా షరియా, ముస్లిం వ్యక్తిగత చట్టాలు పాటించవచ్చా..? అని కేంద్రాన్ని సుప్రీం ప్రశ్నించింది. దీనిపైన కేంద్ర సమాధానాన్ని సుప్రీంకోర్టు కోరింది. భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం నాలుగు వారాల సమయంలో కేంద్రం తన సమాధానాన్ని తెలపాలని కోరింది. తదుపరి విచారణను మే 5కి వాయిదా వేసింది.
ఈ కేసులో పిటిషన్ కేరళకు చెందిన సఫియా పీఎం. ఆమె తన మొత్తం ఆస్తిని తన కుమార్తెకు ఇవ్వాలని అనుకుంటోంది. ఆమె కొడుకు ఆటిజంతో బాధపడుతున్నాడు. ఆమె కుమార్తె అతడిని చూసుకుంటుందని పిటిషన్లో పేర్కొంది. షరియా ప్రకారం.. తల్లిదండ్రుల ఆస్తిలో కొడుకు, కుమార్తె కన్నా రెండు రెట్ల ఆస్తిని పొందుతాడు. తన కుమారు డౌన్ సిండ్రోమ్ కారనంగా మరణిస్తే, తన కుమార్తెకు ఆస్తిలో కేవలం మూడింట ఒక వంతు మాత్రమే పొందుతుందని, మిగతాది బంధువులకు వెళ్తుందని పిటిషనర్ చెప్పారు.
Also Read
- NEET Case: నీట్ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై 20 వేల పేజీల ఛార్జ్షీట్
- Kangana Ranaut: ‘‘నక్కగా ఉండే కన్నా కుక్కగా ఉండటం బెటర్’’ నసీరుద్ధీన్ షాపై కంగనా ఫైర్..
- DY Chandrachud: రష్యా-ఉక్రెయిన్ వివాదంలో మాజీ సీజేఐ ఎంట్రీ.. రష్యా తరఫున ఆర్బిట్రేటర్గా బాధ్యతలు
- Aadhav Arjuna on Delimitation: తమిళనాడు నుంచే ప్రధాని రావాలి.. డీలిమిటేషన్పై మంత్రి ఆధవ్ అర్జున కీలక వ్యాఖ్యలు
Read Also: Rythu Maha Dharna: నల్లగొండలో ముగిసిన రైతు మహాధర్నా.. భారీగా తరలివచ్చిన జనం
తాను, తన భర్త ఇస్లాంను ఆచరించడం లేదని, కాబట్టి తమకు భారత వారసత్వం చట్టంలోని మార్గదర్శకాల ప్రకారం ఆస్తిని పంపిణీ చేయడానికి అనుమతించాలని సఫియా తన పిటిషన్లో పేర్కొంది. ప్రస్తుతం భారత వారసత్వ చట్టాలు ముస్లింలకు వర్తించవు. ఇప్పుడు సఫియా వీటిని సవాల్ చేశారు. దీనిని ఆసక్తికరమైన కేసుగా సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నారు.
మతంతో సంబంధం లేకుండా దేశ పౌరులందరికి ఉమ్మడి పౌర చట్టాలతో కూడిన యూనిఫాం సివిల్ కోడ్ తీసుకురావాలని బీజేపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ కేసు కీలకంగా మారింది. క్రిమినల్ చట్టాలు అందరికి సమానంగా ఉన్నప్పటికీ, ఆస్తి వారసత్వం, దత్తత, చట్టాలు కొన్ని వర్గాలకు విభిన్నంగా ఉన్నాయి. యూనిఫాం సివిల్ కోడ్ తమ మత స్వేచ్ఛని అడ్డుకుంటుందని కొన్ని వర్గాలు దీనిని వ్యతిరేకిస్తున్నాయి. ఇటీవల ఉత్తరాఖండ్ సర్కార్ యూసీసీని అమలు చేసిన తొలి రాష్ట్రంగా నిలిచింది.
తాజావార్తలు
-
NEET Case: నీట్ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై 20 వేల పేజీల ఛార్జ్షీట్
-
Kangana Ranaut: ‘‘నక్కగా ఉండే కన్నా కుక్కగా ఉండటం బెటర్’’ నసీరుద్ధీన్ షాపై కంగనా ఫైర్..
-
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్కు విజయవంతంగా పూర్తయిన సర్జరీ
-
Rukmini Vasanth : నివిన్ పౌలీ సినిమాతో మలయాళంలోకి రుక్మిణీ వసంత్ ఎంట్రీ
-
YS Jagan Slams AP PPP Policy: ‘ఆంధ్రప్రదేశ్ ఫర్ సేల్’లా కొత్త PPP పాలసీ.. జగన్ తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..