PM Modi: రష్యా అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఫోన్.. కీలక అంశాలపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ఫోన్లో సంభాషించారు. 2021 డిసెంబర్లో అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటన సందర్భంగా తీసుకున్న నిర్ణయాల అమలును ఇరువురు నేతలు సమీక్షించారు. ఇంధనం, ఆహార విపణి తదితర ప్రపంచ అంశాలపైనా ఫోన్లో చర్చించారు. ముఖ్యంగా, వ్యవసాయ ఉత్పత్తులు, ఎరువులు, ఫార్మా ఉత్పాదనల పరస్పర వాణిజ్యంపై సమాలోచనలు చేశారు.
ఉక్రెయిన్లో కొనసాగుతున్న పరిస్థితులపై కూడా ప్రస్తావన వచ్చింది. అయితే చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. మధ్య సంభాషణ మరియు దౌత్యానికి అనుకూలంగా భారతదేశం యొక్క దీర్ఘకాల వైఖరిని పునరుద్ఘాటించారు. ప్రపంచ, ద్వైపాక్షిక అంశాలపై ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరపుతుండాలని నేతలు నిర్ణయించారు. ఉక్రెయిన్లో ఫిబ్రవరి 24న యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి శాంతి కోసం, శత్రుత్వాలకు ముగింపు పలకాలని రష్యా, ఉక్రెయిన్లకు ప్రధాని మోదీ విజ్ఞప్తి చేస్తున్నారు. అంతకుముందు, ప్రధాని జోక్యం చేసుకుని, రష్యా అధ్యక్షుడు పుతిన్తో మాట్లాడారు. రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షుల మధ్య చర్చలు శాంతిని నెలకొల్పేందుకు సాయపడతాయని గతంలో ప్రధాని మోదీ సూచించారు.
Also Read
- Pakistan: సౌదీకి మేమున్నాం.. ఇరాన్కు పాకిస్తాన్ ప్రధాని వార్నింగ్..
- Trump: మరో దేశంపై సైనిక దాడికి ట్రంప్ ఏర్పాట్లు?.. ఏం జరగబోతుంది?
- US Defense Budget: ప్రపంచాన్ని వణికిస్తున్న అమెరికా డిఫెన్స్ బడ్జెట్.. షాక్కు గురి చేస్తున్న లక్షల కోట్లు!
- US Airstrike: తారాస్థాయికి చేరిన అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. రంగంలోకి బీ-1 బాంబర్!
Russia-Ukraine War: ఉక్రెయిన్పై రష్యా క్షిపణి దాడి.. 18 మంది దుర్మరణం
ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీతో కూడా మాట్లాడిన ప్రధాని మోదీ.. కొనసాగుతున్న దాడుల కారణంగా జరుగుతున్న ప్రాణ, ఆస్తి నష్టంపై తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు.ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని జీ7 దేశాలు విమర్శించిన తర్వాత కూడా ఈ చర్చలు జరిగాయి. అయితే జీ7 సదస్సులో ఉక్రెయిన్ వివాదంపై భారత్ వైఖరిని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. శత్రుత్వాలకు తక్షణం ముగింపు పలకాలని, చర్చలు, దౌత్యం అనే మార్గాన్ని ఎంచుకోవడం ద్వారా ఒక స్పష్టత రావాలని ప్రధాని పునరుద్ఘాటించారు.
తాజావార్తలు
-
Ahmedabad: అహ్మదాబాద్ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం
-
ZIM vs IND: జింబాబ్వేను వణికించిన టీమిండియా.. భారత్ ముందు 126 పరుగుల టార్గెట్!
-
Venky Anil5: ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్.. క్రేజీ వీడియో రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!
-
Pakistan: సౌదీకి మేమున్నాం.. ఇరాన్కు పాకిస్తాన్ ప్రధాని వార్నింగ్..
-
Paper Leaks: పంజాబ్లో పేపర్ లీక్.. చిక్కుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?