Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Pervez Musharraf Pakistans Last Military Ruler

Pervez Musharraf: కార్గిల్ యుద్ధ కారకుడు.. కరడుగట్టిన భారత వ్యతిరేకి.. పాక్ నియంత ముషారఫ్

Published Date :February 5, 2023 , 3:35 pm
By Venu Goapl Reddy
Pervez Musharraf: కార్గిల్ యుద్ధ కారకుడు.. కరడుగట్టిన భారత వ్యతిరేకి.. పాక్ నియంత ముషారఫ్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Pervez Musharraf: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారప్(79) దీర్ఘకాలిక అనారోగ్యంతో దుబాయ్ లో ఆదివారం మరణించారు. కరుడుగట్టిన భారత వ్యతిరేకిగా ముద్రపడిని ముషారఫ్ అంచెలంచెలుగా ఎదిగి పాకిస్తాన్ నియంతగా మారాడు. తనను తాను అధ్యక్షుడిగా ప్రకటించుకుని పాకిస్తాన్ ను సైన్యం కనుసన్నల్లో పాలించాడు. చివరకు స్వదేశంలో దేశద్రోహం నేరాలు ఎదుర్కోవడమే కాకుండా తనను వ్యతిరేకించి వారిని సైన్యం సహాయంతో అణిచివేశాడు. చివరకు తనకు మద్దతు ఇచ్చిన బెనజీర్ భుట్టో వంటి వారిని హతమార్చాడనే అభియోగాలు ఉన్నాయి.

ఢిల్లీలో జననం:

Also Read

  • Indonesia: ఇండోనేషియాలో రెండు రైళ్లు ఢీ.. నలుగురు మృతి
  • Trump-King Charles: వైట్‌హౌస్‌లో ట్రంప్‌ను కలిసిన కింగ్ చార్లెస్ దంపతులు
  • India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్‌ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
  • Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??

పాక్-ఇండియా విభజనకు ముందు 1943 ఆగస్టు 11న ఢిల్లీలో జన్మించాడు పర్వేజ్ ముషారఫ్. దేశ విజభన సమయంలో అనేకమంది ముస్లింల లాగే ముషారఫ్ కుటుంబ కూడా పాకిస్తాన్ కు వెళ్లింది. లాహోర్ లోని ఫార్మన్ క్రిష్టియన్ కాలేజీలో విద్యాభ్యాసం చేశారు. ఆ తరువాత లండన్ లోన రాయల్ కాలేజ్ ఆఫ్ ఢిఫెన్స్ స్టడీస్ చదివాడు. ఆ తరువాత 1961లో పాక్ మిలిటరీ అకాడమీలో శిక్షణ తీసుకుని, 1964లో పాక్ సైన్యం చేరాడు. 18 ఏళ్ల వయసులోనే పాక్ సైన్యంలో చేరాడు. 1965, 1971 భారత్ -పాక్ యుద్ధాల్లో పాల్గొన్నాడు. 1990లో మేజర్ జనరల్ గా పదోన్నతి పొందాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ.. పాక్ సైన్యాధ్యక్షుడిగా, పాక్ అధ్యక్షుడిగా పనిచేశాడు. ముషారఫ్ తండ్రి పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖలో పనిచేశాడు, అతని తల్లి ఉపాధ్యాయురాలు.

కార్గిల్ యుద్ధానికి సూత్రధారి

1999 కార్గిల్ యుద్దానికి ప్రధాన కారణం పర్వేజ్ ముషారఫే. ఆయన ప్లానింగ్ ప్రకారమే పాక్ బలగాలు భారత భూభాగంలోకి అక్రమంగా చొరబడి, కార్గిల్ సెక్టార్ లోని శిఖరాలను స్వాధీనం చేసుకున్నాయి. అయితే ఈ యుద్ధానికి ముందు 1989లోనే పాక్ ప్రధానిగా ఉన్న బెనజీర్ భుట్టోకు ఈ ఆక్రమణ గురించి తెలియజేశాడు. వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్న కారణంగా చొరవతీసుకుని యుద్ధం గురించి వివరించాడు. అయితే భుట్టో యుద్ధ పరిణామాలతో భయపడి దీన్ని వెనక్కి తీసుకుంది.

అయినా కూడా ముషారఫ్ తగ్గలేదు. 1999 మార్చి-మే మధ్య కాలంలో పాక్ బలగాలను భారత్ లోకి చొప్పించి ఆపరేషన్ గ్రీన్ లైట్ పేరుతో దాడికి ప్రణాళిక రూపొందించాడు. ఇదంతా ప్రభుత్వానికి తెలియకుండానే తెరవెనకనుంచి అంతా నడిపించాడు. ఈ ఆక్రమణ సమయంలో భారత్ లో వాయిపేయి నేతృత్వంలోని బీజేపీ సర్కార్ అధికారంలో ఉంది. అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో ఈ ఆక్రమణ గురించి ప్రధాని వాజ్ పేయ్ మాట్లాడితే, తనకు యుద్ధం గురించి తెలియదని నవాజ్ షరీఫ్ బదులు ఇచ్చారు. ఈ సమయలో నవాజ్ షరీఫ్, ముషారఫ్ ను తొలగించే ప్రయత్నం చేస్తే, ప్రధాని షరీఫ్ నే గద్దె దించి తాను దేశాధ్యక్షుడిగా 1999 అక్టోబర్ లో ప్రకటించుకున్నాడు. ముషారఫ్ ను సైన్యాధ్యక్షుడిగా చేసిన నవాజ్ షరీఫ్ అరెస్ట్ చేయించాడు.

Atal Bihari Vajpayee

ముషారఫ్ పై మూడుసార్లు హత్యాయత్నం

ముషారఫ్ తక్కువ సమయంలోనే అమెరికాకు మిత్రుడిగా మారాడు. 2001 నుంచి దేశాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించాడు. 2007లో మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి అధ్యక్షుడయ్యాడు. అయితే ఈ గెలుపుపై సుప్రీంకోర్టులో పలుపార్టీలు పిటిషన్లు దాఖలు చేశాయి. అయితే సుప్రీంకోర్టులో తనకు వ్యతిరేకంగా తీర్పు వస్తుందని గ్రహించి, ఉగ్రవాదాన్ని సాకుగా చూపి దేశంలో ఎమర్జెన్సీ విధించాడు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇఫ్తికార్ ఎం చౌధురిని తొలగించి తనకు అనుకూలంగా ఉన్న జస్టిస్ అబ్దుల్ హమీద్ దోగార్ ను ప్రధాన న్యాయమూర్తిగా నియమించాడు. ఈ తరువాత పరిస్థితి సద్దుమణిగింది.

అమెరికా మద్దతుతో పాక్ ఖైబర్ ఫఖ్తుంఖ్వా ఇతర ప్రాంతాల్లో ఉన్న ఆల్ ఖైదా, ఆఫ్ఘన్ తాలిబాన్లను నిర్మూలించేందుకు ప్రయత్నించాడు. సైన్యాన్ని ఉపయోగించి ఈ ఉగ్రసంస్థలను దాడులు చేశాడు. అయితే ఈ నేపథ్యంలోనే ముషారఫ్ ను ఉగ్రవాదులు మూడుసార్లు చంపేందుకు ప్రయత్నించాడు.

భారత్ తో చర్చలు..

1999లో భారత్ తో యుద్ధానికి కారకుడు అయిన ముషారఫ్, 2002లో భారత్ తో శాంతి చర్చలకు ప్రాధాన్యత ఇవ్వడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. కాశ్మీర్ అంశాన్ని చర్చలతో పరిష్కరించుకునేందుకు చొరవచూపాడు. ఆ సమయంలో భారత ప్రధానిగా ఉన్న అటల్ బిహారీ వాజ్ పేయి కూడా చర్చలకు మొగ్గు చూపారు. ముషారఫ్ హయాంలో, విదేశీ పెట్టుబడులు వృద్ధి చెందాయి, పాకిస్తాన్ వార్షిక ఆర్థిక వృద్ధిని 7.5 శాతంగా చూసింది. ఈ నేపథ్యంలో ఇండియా సాధారణ సంబంధాలను కోరుకున్నాడు.

మరణశిక్ష ఎదుర్కొని, ప్రవాసంలో జీవనం

2007లో దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన ముషారఫ్ అనేక అభియోగాలను ఎదుర్కొన్నారు. మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్య దగ్గర నుంచి లాల్ మసీదు అబ్దుల్ రషీద్ ఘాజీలను చంపించాడనే అభియోగాలు ఎదుర్కొన్నాడు. 2008లో పాకిస్తాన్ నుంచి యూకే పారిపోయాడు. 2013లో తిరిగివచ్చి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధం అయ్యాడు. పాక్ సుప్రీంకోర్టు ఇతడిని అనర్హుడిగా ప్రకటించింది. చివరకు అరెస్ట్ చేసింది పాక్ సర్కార్. అయితే 2016లో చికిత్స కోసం దుబాయ్ వెళ్లిన ముషారఫ్ అక్కడే కన్నుమూశాడు. 2007లో దేశద్రోహం కేసులో ముషారఫ్ కు 2019లో ఇస్లామాబాద్ కోర్టు మరణ శిక్ష విధించింది. ఈ సమయంలో కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. పార్లమెంట్ ముందుకు తీసుకువచ్చి, మూడు రోజుల పాటు మృతదేహాన్ని వేలాడదీయండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే మరుసటి ఏడాదే శిక్షను తగ్గించింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • atal bihari vajpayee
  • india
  • kargil war
  • Nawaz Sharif
  • Pakistan

తాజావార్తలు

  • Rava Paratha Recipe: రెగ్యులర్ బ్రేక్‌ఫాస్ట్ బోర్ కొట్టిందా..? 10 నిమిషాల్లో మెత్తటి రవ్వ పరాఠాలు ఇలా తయారు చేయండి

  • KING 100 : దాదాపు 20 ఏళ్ల తర్వాత నాగ్ సరసన టబు.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి

  • Divya Sathyaraj: పెళ్లి లేకుండానే తల్లిని అవుతా.. కట్టప్ప కూతురు సెన్సేషనల్ కామెంట్స్!

  • YSRCP Protest: డీజిల్, పెట్రోల్ కొరత.. ఆందోళనలకు వైసీపీ పిలుపు..

  • Nandamuri Balakrishna : బాలయ్య నీ స్పీడ్ ఏంటయ్యా.. ఒకేసారి రెండు సినిమాలు

ట్రెండింగ్‌

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions